మంగళవారం జగన్ కు అప్పుల వారం!

Publish Date:Aug 10, 2023

Advertisement

2019 ఎన్నికలలో విజయం 151 స్థానాలలో విజయం సాధించి   ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం చేపట్టిన జగన్ పార్టీ వైసీపీ నాలుగేళ్ల తరువాత వెనక్కు తిరిగి చూసుకుంటే.. ఆ పార్టీలోముఖ్యమంత్రి జగన్ వినా మరో పేరు గుర్తు చేసుకుందామన్నా గుర్తుకు రాని పరిస్థితి. మొత్తంగా వైసీపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరాఖరికి మంత్రులూ కూడా డమ్మీలే.  మొత్తంగా ప్రస్తుతం 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులుగా గెలిచిన ఎమ్మెల్యేలలో నలుగురిని మినహాయిస్తే మిగిలిన వారంతా అదే పార్టీలో ఇప్పటికీ ఉన్నారు. వారిలో   ఓ పాతిక మంది  మంత్రులు. ఆ మంత్రులలో ఓ ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు. వీరికి తోడు ముఖ్య సలహాదారు, వందల సంఖ్యలో సలహాదారులు.. అయితేనేం అందరూ జీరోలే. ఎవరికీ నిర్ణయాధికారం ఉందని భావించలేం.

రాష్ట్రంలో ప్రాజెక్టులు పడకేశాయి. అభివృద్ధి అడుగంటింది.  గతంలో పోలవరం కోసం చంద్రబాబు సోమవారాన్ని పోలవారంగా మారిస్తే.. ఇప్పుడు జగన్ మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చి తన హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిందో చెప్పకనే చెబుతున్నారు.    రాష్ట్రంలో గ్రామ, వార్డు వాలంటీర్లకు ఉన్నపాటి అధికారం కూడా జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు లేదు. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలే పలు సందర్భాలలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇలాంటి ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుందని, జనం తమను ఎలా నమ్ముతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడపగడపకూ కార్యక్రమంలో తాము ఎదుర్కొంటున్న నిరసన సెగలకు ఇదే కారణమని అంటున్నారు.  ఏ ప్రభుత్వమైనా సరే  రాష్ట్ర ఆదాయం పెంచుకుని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి కానీ,  గన్ సర్కార్ మాత్రం ఆదాయం సంగతి గాలికొదిలేసి అప్పుల కోసం వెంపర్లాడుతోందని విమర్శిస్తున్నారు.   అ దేశం మొత్తంలో ఇలాంటి తిరోగమన విధానాలను అనుసరిస్తున్న, అవలంబిస్తున్న ప్రభుత్వం ఒక్క జగన్ ప్రభుత్వమేననీ అంటున్నారు. అప్పులు తెచ్చి ఎన్నికలకు ఓట్లు కొనుక్కుంటామని చెప్పే పార్టీ ఒక్క జగన్ పార్టీ మాత్రమేనని చెబుతున్నారు.

  వాస్తవానికి జగన్ హయాంలో మంత్రులు. ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు మాత్రమే కాదు వ్యవస్థలు కూడా ఉనికిని కోల్పోయి డమ్మీలుగా మారిపోయాయని విశ్లేషకులు అంటున్నారు.  జగన్ ప్రభుత్వ విధానాలపై విపక్షాల విమర్శలకు మంత్రుల నుంచి దూషణలే సమాధానంగా వినిపిస్తాయి. పాతిక మంది మంత్రులు, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఎవరూ కూడా ప్రభుత్వ విధానాలపై  మాట్లాడరు. అధికారుల నోటి నుంచి మాటలే రావు.

ఇక రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.  వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రంలో కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టారా? కేంద్ర ప్రభుత్వం కడతానన్న పోలవరం ప్రాజెక్టు పనులను రివర్స్ టెండరింగ్ పేరుతో నిలిపివేసి.. ( కాంట్రాక్టర్ ను మార్చాల్సిన అవసరం లేదనీ, పనులు వేగంగా జరుగుతున్నాయనీ పీపీఏ ( పోలవరం ప్రాజెక్టు అథారిటి  చెప్పినా కూడా వినకుండా) చివరికి ఇప్పుడు కట్టలేమ చేతులెత్తేసే పరిస్థితికి జగన్ సర్కార్ దిగజారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధిని అటకెక్కించేసిన  వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

విపక్షాల సభలకు తండోపతండాలుగా పోటెత్తుతున్న జన సందోహం కూడా అదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నది.గతంలో పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి చంద్రబాబు సోమవారాన్ని పోలవారంగా మార్చేస్తే.. ఇప్పుడు జగన్  మంగళవారాన్ని  అప్పుల వారంగా మార్చేశారని వెల్లువెత్తుతున్నాయి. 

ప్రతి మంగళవారం రూ.3 వేల కోట్లు అప్పులుగా  తెస్తున్నారంటే.. రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందనడాకి ఇంత కన్నా రుజువేం కావాలన్న ప్రశ్నలు వినవస్తున్నాయి.  

By
en-us Political News

  
నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు.
మొత్తం మీద రేవంత్ సభలో జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణలో కేటీఆర్ సభలోనూ జగన్ ఫ్లెక్సీలు వెలిసన సంగతి తెలిసిందే. సొంత రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టడంలో స్తబ్దుగా ఉంటున్న వైసీపీ శ్రేణులు తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల సభలలో తమ అధినేత ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది.
మాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసిపి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి.. తనను తాను రావణుడినని చెప్పుకున్న వ్యక్తిని వత్తాసుగా వైసీపీ నిలవడం కోరి ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
రావణ్ అరెస్టుపై వైసీపీ, ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులకు వైసీపీ ఇలా బాహాటంగా మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో, సమాజానికి ఎంతటి ముప్పుగా పరిణమించాడో ప్రజలంతా గమనించాలని కోరారు.
తిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టే విషయంలో జనసేన ఏమంత యాక్టివ్ గా లేదన్నది వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ విషయంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పార్టీ లీడర్లు, క్యాడర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాదే పాద‌యాత్ర ప్రారంభిస్తాన‌ని కేటీఆర్ స్వయంగా ప్రకటించి కూడా వెనక్కు తగ్గడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మంత వ్యతిరేకత కనిపించడం లేదన్న అవగాహనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో కమలం కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ ఇలా బీజేపీలో చేరారో లేదో అలా బీజేపీ హైకమాండ్ వీరి రాజీనామాతో ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే వీరినే తమ అభ్యర్థులుగా ప్రకటించింది.
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.