వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎజెండా మావిగన్!.. పూటకోమాట.. రోజుకో తీరు.. సలహాలెవరివి జగన్?

Publish Date:Jul 2, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై వైసీపీ అధినేత తీరు పూటకో మాట, రోజుకో తీరు అన్నట్లుగా తయారైంది.  తాజాగా ఆయన వచ్చే ఎన్నికలకు అంటే 2029 ఎన్నికలకు పార్టీ అజెండాను ప్రకటించేశారు.  బుధవారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో  ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో పార్టీ విధానాన్ని ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి, తాను సీఎం అయితే.. మావిగన్ రాజధాని అని ప్రకటించారు. వచ్చే ఎన్నికలకు మావిగన్ తన నినాదమనీ, అదే తమ పార్టీ అజెండా అనీ చెప్పారు.  

అయితే రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన  విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.  గతంలో 2019 ఎన్నికలకు ముందు అమరావతికి మద్దతు పలికిన జగన్, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల నినాదాన్ని ఎత్తుకున్నారు. తీరా ఇప్పుడు ఆ మూడు రాజధానుల ప్రతిపాదనను పక్కనబెట్టి అకస్మాత్తుగా సరికొత్తగా 'మవిగున్' అంశాన్ని తెరపైకి తీసుకురావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా చేస్తామని 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్సీపీ గట్టిగా ప్రచారం చేసింది. అయితే, గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు, మరీ ముఖ్యంగా విశాఖ వాసులు ఈ మూడు రాజధానుల ఆలోచనను నిద్వంద్వంగా తిరస్కరించారు. ఇంతటి వైఫల్యం తర్వాత కూడా జగన్ తన పంథాను మార్చుకోకుండా, ఇప్పుడు సరికొత్త ప్రయోగానికి తెరలేపడం వెనుక ఉన్న వ్యూహం ఎవరిదనే చర్చ నడుస్తోంది. ఎలాంటి ప్రజాదరణ లేదా సెంటిమెంట్ లేని సరికొత్త ప్రతిపాదనను ఎన్నికల అజెండాగా మార్చడం రాజకీయంగా వైసీపీకి, జగన్ కు  ఆత్మహత్యాసదృశ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా నిండా ముంచేసే సలహాలు జగన్ కు ఇస్తున్నదెవరా అన్న చర్చ రాజకీయవర్గాలలోనే కాకుండా వైసీపీలో కూడా విస్తృతంగా జరుగుతున్నది. మావిగన్ రాజధాని అజెండాను ప్రకటించడం ద్వారా జగన్ వచ్చే ఎన్నికలకు మూడేళ్ల ముందే ఓటమికి రెడీ అయిపోయారని నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు. 

 అధికార పక్షమైన తెలుగుదేశం కూటమి తొలి నుంచీ అమరావతి ఏకైక రాజధాని అనే స్పష్టమైన, స్థిరమైన స్టాండ్ తో వెడుతుండగా, జగన్ మాత్రం జగన్ మాత్రం ప్రతి ఎన్నికలకూ రాజధాని విషయంలో మాట మారుస్తూ ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతికి పూర్తి మద్దతు ప్రకటించిన జగన్.. ఆ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టగానే మాట మార్చి మూడు రాజధానులంటూ కొత్త పల్లవి ఎత్తుకున్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో పరాజయం పాలైన తరువాత ఇప్పుడు మూడు రాజధానులను మూటగట్టి పక్కన పడేసి మావిగన్ అంటూ కొత్త రాగం ఆలపించడం ద్వారా తనకు ఒక స్థిరమైన అభిప్రాయం అంటూ లేదని చాటుకుని ప్రజల దృష్టిలో పలుచన అవుతున్నారని అంటున్నారు. ఈ తరహా వ్యూహాలు జగన్ విశ్వసనీయతను దెబ్బతీయడమే కాకుండా, ఆయన నాయకత్వ పటిమపై కూడా ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయంటున్నారు.  

By
en-us Political News

  
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.
దీంతో తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం
తన నాలుక కోసి సమాధి కడతానని బెదిరించడం హత్యను ప్రేరేపించే క్రిమినల్ చర్య కిందకే వస్తుందన్న ఆయన, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. ఒకవేళ ప్రభుత్వం సుమోటోగా చర్యలు తీసుకోకపోయినా, తనపై ఉన్న అభిమానంతో ఎవరో ఒకరు తప్పకుండా ఫిర్యాదు చేస్తారని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.
తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.