ఆ 27 మందీ అవుట్? జగన్ పై ఇక తిరుగుబాటేనా?!

Publish Date:Sep 29, 2022

Advertisement

‘ఎమ్మెల్యేలూ మీ తీరు మారాల్సిందే.. నాతో కలిసి పనిచేయాల్సిందే.. లేదంటే కష్టమబ్బా. నో మొఖమాటమ్స్’ అంటూ జగన్ ఎమ్మెల్యేలకు హాట్ వార్నింగ్ ఇచ్చారు. పనితీరు బాగాలేదని 27 మందిని మరింత ఘాటుగా హెచ్చరించారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’పై తాడేపల్లిలో తాజాగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రులు, పార్టీ సమన్వయకర్తలను ఉద్దేశించి సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. పనితీరు మార్చుకోకపోతే టికెట్లు ఇచ్చేది లేదంటూ ఖరాఖండీగా చెప్పేశారు. రెండు నెలలే గడువిస్తున్నాననీ హెచ్చరించారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందే సీటు ఇవ్వని వారి పేర్లు ప్రకటిస్తానని జగన్ విస్పష్టంగా చెప్పేశారు.

‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వెనకబడిన 27 మంది ఎమ్మెల్యేలను జగన్ తీవ్రంగా మందలించారు. ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలు తెలుసుకుని, సత్వర పరిష్కారం చేయాల్సిన ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయొద్దని జగన్ ప్రజాప్రతినిధులను గట్టిగా హెచ్చరించారు. వారంలో నాలుగు రోజుల చొప్పున, నెలకు 16 రోజులు కూడా తిరగకపోతే ఎలా అని ఆ 27 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు గంటో రెండు గంటలో కాదనీ, ఏడు నుంచి ఎనిమిది గంటలు గ్రామాల్లో తిరగాలన్నారు. అదే గ్రామంలో పార్టీ నేతల ఇళ్లల్లో భోజనాలు చేయాలని, ప్రతి గడపకూ కచ్చితంగా సమయం కేటాయించాలని జగన్ ఆదేశించారు.  డిసెంబరులో మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, అప్పటిలోగా అందరూ బాగా తిరగాలన్నారు. పని తీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులను గడపగడపలో తిప్పొద్దనీ, తామే స్వయంగా వెళ్లాలని, సమస్యల్ని గుర్తించి తక్షణమే పరిష్కరించాలని జగన్ ఆదేశించారు. కేటాయించిన నిధులను వినియోగించుకోవాలని సూచించారు.

పనితీరు సరిగ్గా లేని వారిపై వేటు తప్పదని పార్టీ అధినేత జగన్ చేసిన హెచ్చరికలు ఎమ్మెల్యేల్లో కలవరం రేపుతున్నాయి. గడప గడపకు.. గత సమీక్ష కంటే ఇప్పుడు ఫలితం మెరుగ్గా ఉందని, మరికొందరు తీరు మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్  సదస్సులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో క్షేత్రస్థాయిలో ప్రతి గడప వద్దకు ఎమ్మెల్యేలు వెళ్లాలని ఆయన సూచించారు. సీఎం జగన్ ఇచ్చిన పిలుపును 27 మంది ఎమ్మెల్యేలు పెద్దగా పట్టించుకోలేదు. వచ్చే డిసెంబరు నాటికి వారి పనితీరు మారకపోతే చర్యలు తప్పవని సీఎం చేసిన హెచ్చరికలతో ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది.

అదలా ఉంచితే.. తాడేపల్లిలో సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు జగన్ పై సెటైర్లు వేసుకున్నారు. ‘మీతో పాటు పనిచేయాలంటే మేం కూడా బటన్ నొక్కాల్సిందే. మా దగ్గర నొక్కడానికి బటన్స్ లేవుగా’ అని జోకులు వేసుకున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ‘ప్రజాసమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వకుండా తిరగమంటే ఎలా.. ఇలాగైతే కష్టమే బ్రదర్’ అంటూ అక్కడ నుండి ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేయడంతో జగన్ పై వారిలో తిరుగుబాటు మొదలైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక జగన్ ఆగ్రహానికి గురైనా ఆ 27 మందీ  జగన్ పై తిరుగుబాటుకు రంగం సిద్ధం చేస్తున్నారనీ, త్వరలోనే తిరుగుబాటు దెబ్బ జగన్ కు రుచిచూపేందుకు పావులు కదుపుతున్నారనీ ఆయా ఎమ్మెల్యేల సహచరులు, సన్నిహితులు అంటున్నారు.

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.