దావోస్ లో జగన్, కేటీఆర్ ఏమి చర్చించారు?

Publish Date:May 24, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్  ఇద్దరూ ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్’లో ఉన్నారు. అక్కడే ఆ ఇద్దరూ ప్రత్యేకంగా సమావేసమయ్యారు. ఇరుగు పొరుగు రాష్టాలకు చెందిన ఇద్దరు ముఖ్యనాయకులు మరో దేశంలో కలిసి నప్పుడు కలిసి మాట్లాడుకోవడం, ఒకరిని ఒకరు ఆత్మీయంగా పలకరించుకోవడం పెద్దగా చెప్పుకోవలాసిన విషయం కాదు. అందులో విశేషం లేక పోవచ్చును.కానీ,వుందని అంటున్నారు. 
ఎందుకంటే, ఈ మధ్య కాలంలో, ఈ మధ్య  కాలమని ఏముంది లెండి, మొదటి నుంచి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య గొప్ప సయోధ్య ఎప్పుడూ లేదు. స్నేహ, దాయాది బంధం అంతగా లేదు, ప్రస్తుతం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల నాయకుల మధ్య  మాటల యుద్ధం నడుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్’ను చులకన చేసి మాట్లాడడం తెలంగాణ మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలకు అలవాటుగా మారి పోయింది. 

ముఖ్యంగా మంత్రి కేటీఆర్’  ఈ మధ్యనే  ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థతి అద్వాన్నంగా ఉందని ఎద్దేవా చేశారు. ఏపీలో రోడ్లు లేవు, విద్యుత్ లేదు, మౌలిక సదుపాలు అసలే లేవని, ఎవరో మిత్రుడు చెప్పినట్లు చెప్పి, పొరుగు రాష్ట్రాన్ని చులకన చేశారు. అఫ్కోర్స్, ఏపీలో పరిస్థితులు అద్వాన్నంగా ఉన్నమాట నిజం. అందులో రెండో అభిప్రాయానికి తావులేవు. అయితే, తెలంగాణలో పరిస్థితులు అంతకంటే గొప్పగా ఉన్నాయా అంటే, లేదు. సరే అది వేరే విషయం ...కేటీఆర్  నోరు జారి నాలుక కరుచుకున్నారు.  సారీ చెప్పారు. 

అయితే, ఇప్పుడు దావోస్’లో ఆ ఇద్దరూ యాదృచ్చికంగా కలిశారా, ముందుగా అనుకునే కలుసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, రాజకీయ వ్యూహంలో భాగంగా ఒకరిపై ఒకరు కాసింత ఘాటు విమర్శలు చేసుకున్నా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, అధికార తెరాస, వైసీపీ పార్టీల మధ్య రాజకీయ సంబంధాలు, ఇచ్చి పుచ్చుకోవడాలు సజావుగానే సాగుతున్నాయని, రెండు పార్టీలలో ఎప్పటి నుంచో వినవస్తోంది.  రాజకీయ ఉమ్మడి వ్యూహంలో భాగంగానే ఇద్దరు ముఖ్యమంత్రులు  ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే, దావోస్’లో కేటీఆర్, జగన్ రెడ్డి కులుసు కోవడం రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిజానికి, ఆ ఇద్దరు ముఖ్య నాయకులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనుసరించ వలసిన ఉమ్మడి ఎన్నికల వ్యూహం పైనే చర్చించారని రాజకీయ వరగాల్లో చర్చ జరుగుతోంది.

ఏపీలో చంద్రబాబు నాయుడు, తెలంగాణలో రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు  వారిపై ఉన్న కేసులను తిరగ దోడడం మొదలు, ఆ ఇద్దరి ఆర్థిక ములాలను దెబ్బతీయడమే లక్ష్యంగా వ్యూహరచన చేశారని తెలుస్తోంది. అందుకే కేటీఆర్, కావాలనే జగన్ రెడ్డి తో సమావేశం ‘గొప్పగా’ జరిగిందని ట్వీట్’ చేశారు. ఆ ఇద్దరి మధ్య యాదృచ్చికంగా సమావేశం జరిగుంటే, కేటీఆర్ ట్వీట్ చేయవలసిన అవసం లేదు, చేసినా, “నా సోదరుడు ఏపీ ముఖ్యమంత్రి  జగన్ రెడ్డితో సమావేశం గొప్పగా జరిగింది”, అని అంత గొప్పగా, విశేషణాలను చేరుస్తూ, ఫోటోలు జత చేసి మరీ ట్వీట్  చేయవలసిన అవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు. 

అదలా ఉంటే, ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు, గౌరం తెచ్చిన నేపధ్యంలో రాష్ట్ర విభజన తర్వాత కూడా, చంద్రబాబు సృష్టించిన బ్రాండ్ ఇమేజ్’తో హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది. అదే విధంగా రాష్ట్ర విభజన అనంతరం తొలి ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ఎన్నో దేశాలు తిరిగి పెట్టుబడులు ఆకర్షించేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించారు. ఫలితంగా, ఇంతవరకు ఉభయ తెలుగు రాష్ట్రాలు విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ముందువరసలో నిలిచాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

 కేంద్ర పారిశ్రామిక అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం తాజా నివేదిక ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 4,37,188 కోట్ల  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే అందులో 37.46 శాతం ( రూ.37,188 కోట్లు)తో కర్ణాటక ప్రధమ స్థానంలో వుంది. అలాగే, 26.78 శాతం (రూ.64.24 కోట్లు) తో మహా రాష్ట్ర రెండవ స్థానంలో వుంది. గత సంవత్సరం వరకు టాప్ 10 స్టేట్స్’లో ఉన్న ఏపీ, తెలంగాణ ఈ సంవత్సరం ఆ స్థానాన్ని కోల్పోయాయి. ఈ సంవత్సరం తెలంగాణ 2.73 శాతం  (రూ.11,965 కోట్లు)తో దక్షిణాది రాష్టాలో కర్ణాటక, తమిళనాడు తర్వాత మూడవ స్థానానికి దిగజారింది,. ఆంధ్రప్రదేశ్ 0.38 శాతం ( రూ.1.682 కోట్లు) తో మరింత కింది జారిపోయింది.  అవును మరి అంతర్జాతీయ వాణిజ్య సదస్సులోనూ రాజకీయ ప్రత్యర్ధులను ఓడించే ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తూ, రాజకీయాలే సర్వస్వం అనుకుంటే పెట్టుబడులు రావు సరికదా, వచ్చినవీ వెనక్కి పోతాయి,.ఇప్పుడు ఉభే తెలుగు రాష్ట్రాలలో అదే జరుగుతోంది.

By
en-us Political News

  
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.