టీఆర్ఎస్ ఎప్పుడూ వీకే! విపక్షాల బలహీనతే కేసీఆర్ బలం 

Publish Date:Nov 11, 2020

Advertisement

తెలంగాణలో మరో మూడు టర్మ్ లు టీఆర్ఎస్ దే అధికారం. తెలంగాణ ప్రజలు కారును తప్ప మరో పార్టీని గెలిపించరు.. ఇదీ టీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎప్పుడూ చెప్పే మాటలు. కేసీఆర్, కేటీఆర్ ప్రకటనలు వినేవారు నిజంగానే తెలంగాణలో టీఆర్ఎస్ చాలా బలంగా ఉందని నమ్ముతుంటారు. పాలనలో కేసీఆర్ నిర్ణయాలు కూడా అలానే ఉంటాయి, రాష్ట్ర్ర భవిష్యత్ కు సంబంధించిన కీలక అంశాలపైనా సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిపక్షాలను కనీసం లెక్కలోకి తీసుకోరు. తెలంగాణ మొత్తం తన సొంతమనే తీరుగా ఆయన పోకడలు ఉంటాయనే ఆరోపణలున్నాయి. అయితే తాజాగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నికతో టీఆర్ఎస్ బలమెంతో తెలిసొచ్చింది. అధికార పార్టీగా ఉండి తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది టీఆర్ఎస్, ఎమ్మెల్యే చనిపోవడంతో ఆయన భార్యే పోటీ చేసినా.. ఆ సెంటిమెంట్ ఉన్నా దుబ్బాకలో గట్టెక్కలేకపోయింది గులాబీ పార్టీ. 

 

దుబ్బాక బైపోల్ ఫలితంతో తెలంగాణ రాజకీయాల్లో సమూల మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తమకు తిరుగేలేదనే భ్రమలో ఉన్న టీఆర్ఎస్ కు కౌంట్ డౌన్ మొదలైందనే చర్చ జరుగుతోంది. నిజానికి తెలంగాణలో ఎప్పుడూ టీఆర్ఎస్ బలంగా లేదు. రెండు సార్లు అధికారంలోకి వచ్చినా.. ఆ పార్టీకి వచ్చిన ఓట్లు గొప్పగా ఏమి లేవు, గత ఎన్నికల ఫలితాలను చూస్తేనే ఇది అర్ధమవుతుంది. బోగస్ ఓట్లు, బోటాబోటీ మెజార్టీలు, ఈవీఎం మిషన్లు, కౌంటింగులో అవకతవకలు.. ఇలాంటి అంశాలు కలిసి రావడం వల్లే టీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని, ఎన్నికల లెక్కలు చూస్తే ఆ పార్టీ బలమేంటో 
తెలుస్తుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. దుబ్బాక ఫలితంలో ఇది రుజువైందని చెబుతున్నారు. 

 

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైందని ప్రజలంతా భావించారు. ఆ సమయంలోనే 2014లో జరిగిన తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. మేజిక్ ఫిగర్ కు మూడు సీట్లే ఎక్కువొచ్చాయి ఆ పార్టీకి. ఇక ఓట్ల పరంగా చూస్తే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వచ్చిన ఓట్లు 33. 2 శాతమే. అంటే దాదాపు 67 శాతం మంది తెలంగాణ ఓటర్లు కేసీఆర్ కు , టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓట్లు వేశారన్నమాట. ఇక గెలిచిన 63 సీట్లలోనూ 10 నియోజకవర్గాల్లో మెజార్టీ 2 వేల లోపే ఉంది. అక్కడ కొంచెం తారుమారైనా గులాబీకి పవర్ దక్కేది కాదు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన ఉద్యమపార్టీ నేతగా వెలుగొందిన కేసీఆర్ కు.. తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 33 శాతం ఓట్లే రావడం నిజంగా అశ్చర్యమే. లెక్కలు ఇలా ఉంటే కేసీఆర్ మాత్రం తెలంగాణ ప్రజలంతా తనవెంటే ఉన్నారంటూ గొప్పలు చెప్పుకుంటూ వస్తున్నారు. 

 

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించింది టీఆర్ఎస్. అయితే అందుకు సవాలక్ష కారణాలు, ప్రభుత్వ కుట్రలు కనిపిస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచింది గులాబీ పార్టీ. 46.9 శాతం ఓట్లు సాధించింది. గెలిచిన 88లో దాదాపు 15 నియోజకవర్గాల్లో బోటాబోటీ మెజార్టీతో చివరి రౌండ్లలో బయటపడ్డారు టీఆర్ఎస్ అభ్యర్థులు. ఇబ్రహీంపట్నం, కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో మెజార్టీ వందల్లోనే ఉంది. తుంగతుర్తి, వికారాబాద్, కోదాడలో టీఆర్ఎస్ అభ్యర్థులు చివరి రౌండులో గెలిచారు. స్వల్ప మెజార్టీతో టీఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపుపై 
చాలా ఆరోపణలున్నాయి. ఇబ్రహీంపట్నం, ధర్మపురిలో ఎంతగా మెత్తుకున్నా రీకౌంటింగ్ కూడా చేయలేదని కాంగ్రెస్ అభ్యర్థులు ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఎన్నికల కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని, ఈవీఎంలు మార్చారనే ఆరోపణలు వచ్చాయి. ఓడిపోయిన కొందరు అభ్యర్థులు కోర్టుకు కూడా వెళ్లారు. ఇంకా ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి.

 

2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరో కీలక అంశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో దాదాపు 28 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి.   కొన్ని లక్షల కొత్త ఓట్లు రాత్రికి రాత్రే వచ్చి చేరాయి. అధికార పార్టీ కనుసన్నలోనే ఇదంతా జరిగిందని, తమకు ఇబ్బంది కాకుండా ఓటర్ లిస్టులతో మార్పులు చేర్పులు చేసిందనే విపక్షాలు ఆరోపించాయి. కోర్టుకు కూడా వెళ్లాయి. అయితే ఓట్ల తొలగింపునకు సంబంధించిన అప్పటి ఎన్నికల ప్రధానాధికారి కూడా కోర్టులో ఈ విషయాన్నిఅంగీకరించారు. 28 లక్షల ఓట్లు గల్లంతైందని నిజమేనని, కాని ఇప్పుడు చేసేదేమి లేదని, లోక్ సభ ఎన్నికల నాటికి ఓటర్ లిస్టులను సరి చేస్తామని అప్పటి ఎన్నికల అధికారి రజత్ కుమారే స్వయంగా చెప్పారు. 2018లో మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ఇది కూడా ముఖ్య కారణమని విపక్షాలు ఇప్పటికి ఆరోపిస్తూనే ఉన్నాయి.

 

ఓటర్ లిస్టులు సరిచేశాక జరిగిన 2019 లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అసలు బలమేంటో తెలిసొచ్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లోపే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కారు పార్టీ ఏకంగా ఏడు సీట్లు కోల్పోయింది. నిజానికి లోక్ సభ ఎన్నికల సమయానికి టీఆర్ఎస్ కార్యకర్తలు అసెంబ్లీ గెలుపు జోష్ లోనే ఉన్నారు. విపక్షాలు ఓటమి నిరాశలోనే ఉన్నాయి. అయినా లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏడు సీట్లు కోల్పోవడం., సీఎం కేసీఆర్ కూతురే నిజామాబాద్ లో ఓడిపోవడం సంచలనమైంది. 2018 డిసెంబర్ లో 88 అసెంబ్లీ సీట్లు గెలిచి రెండోసారి పవర్ చేపట్టిన టీఆర్ఎస్.. ఆరు నెలల్లోనే దాదాపు 55 నియోజకవర్గాల్లో వెనకబడిపోవడం అందరిని అశ్చర్యపరిచింది. బోగస్ ఓట్లు లేకుండా, లక్షలాది ఓట్లను తొలగించకుండా 2018 అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా జరిగితే లోక్ సభకు వచ్చిన ఫలితాలే అప్పుడు కూడా వచ్చేవేమోననే అనే అభిప్రాయం కొన్ని వర్గాలు, రాజకీయ అనలిస్టుల నుంచి వినిపించాయి. 

 

మొత్తంగా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో తెలంగాణలో టీఆర్ఎస్ అందరూ అనుకున్నట్లుగా బలంగా లేదని, విపక్షాలు బలహీనంగా ఉండటమే కేసీఆర్ బలమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దుబ్బాకలో బీజేపీ గట్టి పోరాటం చేయడంతో ప్రజలు ఆ పార్టీని అదరించారని చెబుతున్నారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉంటామని ఏ పార్టీ నిరూపించుకున్నా.. ఆ పార్టీకి తెలంగాణ ప్రజల మద్దతు దొరికే అవకాశం ఉందంటున్నారు. దుబ్బాక ఫలితం విపక్షాలకు టానిక్ లా మారే అవకాశం ఉందని, రానున్న రోజుల్లో కారు పార్టీకి కష్టాలు తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.