వీర జవాన్లకు సాయంలోనూ కులం! ఏపీ సర్కార్ మరో దారుణం

Publish Date:Nov 12, 2020

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో దేశంలో ఎక్కడా లేనంటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ పాలనలో వింత వింత ఘటనలు జరుగుతున్నాయి.  వీర జవాన్ల కుటుంబాలకు చేసే సాయంలోనూ వివక్ష చూపుతున్నారు పాలకులు. కులం ఆధారంగా అమర జవాన్ల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అమరులైన జవాన్లలో కొందరి కుటుంబాలకు సాయం చేస్తూ.. మరికొందరిని పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలు తావిస్తోంది. జగన్ సర్కార్ తీరుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అమర జవాన్లను కూడా అవమానించడమేంటనీ ఫైరవుతున్నారు ప్రజలు. ఇలాంటి పరిస్థితులు ఏపీలో రావడం దారుణమని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
              
మూడు రోజుల క్రితం కాశ్మీర్‌ లో  జరిగిన ఉగ్ర దాడులో చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి అమరుడయ్యారు. బుధవారం అమర జవాన్ అంత్యక్రియలు
అధికార లాంఛనాలతో  పూర్తయ్యాయి. దేశం కోసం వీర మరణం పొందిన ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు 50 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది జగన్ సర్కార్. అయితే అక్టోబర్ 12న సరిహద్దులో ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్ లో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు గ్రామానికి చెందిన జవాన్ బొంగు బాబూరావు వీరమరణం పొందాడు. అస్సాం రైఫిల్స్‌లో సైనికుడిగా ఉన్న 
బాబూరావు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయారు. అంతకు నెల క్రితం శ్రీకాకుళం నగరానికి చెందిన ఉమామహేశ్వరరావు బాంబు నిర్వీర్యం చేస్తుండగా పేలిన 
ఘటనలో మృతి చెందారు. సిక్కోలుకు చెందిన ఈ ఇద్దరూ జవాన్లు విధినిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయినా.. జగన్ సర్కార్ మాత్రం వారి కుటుంబాలను పట్టించుకోలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం ప్రకటించలేదు.  

అమర జవాన్ల విషయంలో  జగన్ సర్కార్ వ్యవహరించిన తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు  50 లక్షల రూపాయల పరిహారం ప్రకటించిన జగన్ సర్కార్.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు వీర జవాన్ల కుటుంబాలను పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. అమర జవాన్ల విషయంలోనూ కులం చూసి పరిహారం ఇస్తున్నట్లుగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. వీర జవాన్లకు సాయంలోనూ కులం చూస్తారా  అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సీఎం జగన్ కు లేఖ రాశారు. "ఉగ్రవాదులతో పోరాడుతూ మరణించిన చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల సాయం ఇచ్చారు. అభినందిస్తున్నాను. దీనికి కొద్ది రోజుల ముందు ఈ నెల 4న అస్సాం రైఫిల్స్‌ దళంలో హవల్దార్‌గా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లా వజ్ర కొత్తూరుకు చెందిన బొంగు బాబూరావు వీర మరణం పొందారు. సైన్యంలో పనిచేస్తున్న వారి ప్రాణత్యాగం ఎవరిదైనా ఒకటే. ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబానికి ఎటువంటి సాయం ఇచ్చారో అదే సాయాన్ని కులం, మతం, ప్రాంతం చూడకుండా ఇతర అమర వీరుల కుటుంబాలకు కూడా ఇవ్వాలి. బాబూరావు కుటుంబానికి కూడా ఈ సాయం వర్తింపచేయాలి" అని లేఖలో ముఖ్యమంత్రిని కోరారు అచ్చెం నాయుడు. 

దేశం కోసం ప్రాణాలు అర్పించిన సిక్కోలుకు చెందిన వీర జవాన్ల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు విమర్శించారు. వీర జవాను ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించడం స్వాగతించదగ్గ విషయమన్నారు రామ్మోహన్‌ నాయుడు. రెండు నెలల వ్యవధిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు జవాన్లు మృతి చెందారని ఆయన గుర్తుచేశారు. శ్రీకాకుళం నగరానికి చెందిన ఉమామహేశ్వరరావు బాంబు నిర్వీర్యం చేస్తుండగా పేలిన ఘటనలో మృతి చెందగా, అస్సాం రైఫిల్‌ ఉగ్రవాదుల కాల్పుల్లో బొంగు బాబూరావు మృతి చెందారన్నారు. వీరిద్దరు మృతి చెందిన తర్వాత వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా ప్రకటించలేదని గుర్తు చేశారు. వీర జవాన్‌ ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాకు చెందిన వీర జవాన్లపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. 

అమర జవాన్ల విషయంలో జగన్ సర్కార్ తీరు తీవ్ర విమర్శలు తావిస్తోంది. దేశంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లను ప్రభుత్వం అవమానించినట్లుగా ఉందనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. అయినా కొందరికి పరిహారం ప్రకటించి.. మరికొందరికి ప్రకటించకపోవడం ఏంటని నిలదీస్తున్నారు జనాలు. ఇలాంటి ఘటనలతో రాష్ట్రం పరువు పోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జవాన్లకు సాయం చేసే విషయంలో ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంటుందని.. అలా కాకుండా వ్యవహరించడం సరికాదని చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే తప్పును సరిదిద్దుకుని సిక్కోలు జిల్లాకు చెందిన ఇద్దరు వీర జవాన్ల కుటుంబాలకు 50 లక్షల రూపాయల పరిహారం ప్రకటించాలని ఏపీ ప్రజలు, నేతలు కోరుతున్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.