ఇటీవల బీజేపీ జాతీయ నాయకులు తెలుగు హీరోలను కలుస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ నటనకు ముగ్దుడైన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మునుగోడు పర్యటన సమయంలో హైదరాబాద్ లో తారక్ ని కలిసి ప్రశంసించారు. ఇక రీసెంట్ గా బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా యంగ్ హీరో నితిన్ ని కలిశారు. అయితే నితిన్ ఇంతవరకు పాన్ ఇండియా ఫిల్మ్ చేయలేదు. నార్త్ ఆడియన్స్ ని మెప్పించే సినిమా సంగతి అటుంచితే, ఇటీవల ఆయన చేసిన 'మాచర్ల నియోజకవర్గం' చిత్రం తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించలేకపోయింది. దీంతో అసలు నితిన్ ని నడ్డా ఎందుకు కలిశారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే నిజానికి నడ్డా కలవాలనుకున్నది నితిన్ ని కాదట. ఆయన నిఖిల్ ని కలవాలనుకుంటే తెలంగాణ బీజేపీ నాయకులు నితిన్ ని తీసుకొచ్చి ఆయన ముందు కూర్చోబెట్టారని ప్రచారం జరుగుతోంది.
నిఖిల్ హీరోగా నటించిన 'కార్తికేయ-2' ఏమాత్రం అంచనాల్లేకుండా విడుదలై నార్త్ లోనూ ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులో పురాణాలు మన చరిత్ర అని చెబుతూ శ్రీ కృష్ణ తత్వం గురించి వివరించిన తీరు ఆకట్టుకుంది. అందుకే హీరో నిఖిల్ ని నడ్డా ప్రత్యేకంగా కలిసి ప్రశంసించాలి అనుకున్నారట. ఇదే విషయాన్ని ఆయన తన టీమ్ కి చెప్పగా.. వారు తెలంగాణ బీజేపీ లీడర్స్ ని కాంటాక్ట్ అయ్యారట. అయితే పేర్లు ఒకేలా ఉండటంతో కన్ఫ్యూజ్ అయ్యి.. నిఖిల్ కి బదులుగా నితిన్ ని కలిపించారని టాక్.
అయితే తాను కలిసింది 'కార్తికేయ-2' హీరోనే అనుకొని.. నితిన్ తో నడ్డా ఏం మాట్లాడి ఉంటారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాటల మధ్యలో మీరు నటించిన 'కార్తికేయ-2' బాగుందని నడ్డా అనగానే నితిన్ ఒక్కసారిగా ఉలిక్కిపడినంత పనై ఉంటుందని అంటున్నారు. తాను ఆ సినిమాలో నటించలేదు, పోనీ తాను నటించిన 'మాచర్ల' గురించి చెప్దామా అంటే అందులో విషయం లేదు. దీంతో అసలు విషయం బయటపడిపోయిందట. వెంటనే నడ్డా 'మీరు కన్ఫ్యూజ్ అయ్యి అనవసరంగా ఇతన్ని ఇబ్బందిపడేలా చేశారుగా' అంటూ దీనికి కారణమైన టీమ్ కి, లీడర్స్ కి చివాట్లు పెట్టారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. దీంతో నెటిజన్లు ఓ వైపు 'నిఖిల్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు' అంటూనే మరోవైపు నితిన్ ని ఉద్దేశించి 'నీ కష్టం పగోడికి కూడా రాకూడదు బ్రో' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-bjp-leader-jp-nadda-met-nithin-by-mistake-25-143326.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.