పంజాబ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్ ను నిరసనకారులు అడ్డుకోవడం సంచనమైంది. నిరసనతో ఏకంగా తన సభను రద్దు చేసుకుని తిరిగి వెళ్లిపోయారు నరేంద్ర మోడీ. అంతేకాదు క్షేమంగా ఎయిర్ పోర్టుకు చేరుకున్నాను.. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. పంజాబ్ లో ప్రధానికి ఎదురైన ఘటన దేశంలో ప్రకంపనలు స్పష్టిస్తోంది. ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో రాజకీయంగా రకరకాల చర్చలు సాగుతున్నాయి.
నరేంద్ర మోడీ తాజా వ్యవహారాన్ని రెండు రకాలుగా చూడవచ్చంటున్నారు. అందులో మొదటిది సెక్యూరిటీ ల్యాప్స్ గా. ఇక రెండోది రాజకీయం. భద్రతా వైఫల్యాన్ని కేంద్ర హోంశాఖ సీరియస్ గా తీసుకుంది. రాజకీయంగా చూస్తే.. తాజా ఘటన పంజాబ్ లో బీజేపీ పరిస్థితికి అద్దం పడుతున్నట్లు ఉందని చెబుతున్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ కూడా ఉంది. ఇపుడు పంజాబ్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రయాణిస్తున్న దారిలో ఓ ఫ్లైవర్ దగ్గర రైతులు వాహనాలను అడ్డంపెట్టి నిరసన తెలపడం బీజేపీకి షాకే.
మూడు వ్యవసాయ చట్టాలు చేయటంతోనే మోడీ సర్కార్ పై రైతుల్లో ఆందోళన మొదలైంది. పంజాబ్ లో మొదలైన ఆందోళన చివరకు దేశవ్యాప్తమైంది. రైతుల పోరాటానికి దిగొచ్చి వ్యవసాయ చట్టాలను మోడీ సర్కార్ ఉపసంహరించుకుంది. అయితే ఈమధ్య కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలతో మళ్ళీ నిప్పు రాజుకుంది. వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసుకోగానే రైతులు కూడా ఉద్యమానికి స్వస్తిచెప్పి ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. అలాంటిది తోమర్ మాట్లాడుతు తొందరలోనే రద్దుచేసిన వ్యవసాయ చట్టాలను మళ్ళీ తెస్తామని చెప్పారు. దాంతో ఒక్కసారిగా రైతు సంఘాల్లో వ్యతిరేకత మొదలైపోయింది. తర్వాత తన మాటలను వక్రీకరించారని కేంద్రమంత్రి చెప్పినా... అప్పటికే జరగాల్సిన నష్టం బీజేపీకి జరిగిపోయింది.
తోమర్ వ్యాఖ్యల తర్వాత మోడి పంజాబ్ పర్యటనకు వచ్చారు. దాంతో రైతులు మోడికి నిరసన సెగ ఎలాగుంటుందో చూపించారు. అంటే ఇదే విధానం రేపటి ఎన్నికల్లో కూడా కంటిన్యు అవుతుందని చెప్పకనే చెప్పినట్లయ్యింది. పంజాబ్ లో రైతులను కాదని ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అసలే పంజాబ్ లో బీజేపీ పరిస్ధితి అంతంత మాత్రంగా ఉంది. జరిగిన ప్రీపోల్ సర్వేల్లో దేనిలో కూడా బీజేపీ అధికారంలోకి కాదు కదా కనీసం పోటీ ఇస్తుందని కూడా కూడా రాలేదు.ఇలాంటి స్ధితిలో పార్టీ పరిస్దితిని చక్కదిద్దుదామని మోడి ప్రయత్నించినట్లున్నారు. పంజాబ్ లో కార్యక్రమం పెట్టుకోవటం ద్వారా జనాలను ఆకట్టుకోవచ్చని అనుకున్నట్లున్నారు. కానీ మధ్యలో రైతుల ఆగ్రహానికి గురై చివరకు కార్యక్రమాన్నే రద్దు చేసుకోవాల్సొచ్చింది. ప్రధానమంత్రి కార్యక్రమాన్నే రైతులు అడ్డుకున్నారంటే ఇక మిగిలిన నేతల పరిస్ధితి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. రేపటి ఎన్నికల్లో బీజేపీ పరిస్ధితి ఏమిటనేందుకు ఇదే తాజా ఉదాహరణ అంటున్నారు. పంజాబ్ లో బీజేపీకి చేతులెత్తేసినట్టేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-bjp-facing-troubles-in-punjab-39-129729.html
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని డీఎంకే నేత ఇలంగోవన్ బహిరంగంగానే ఆరోపించారు. తమ మద్దతుతోనే రాజ్యసభ నామినేషన్లు దక్కించుకుని.. కూటమి ద్వారానే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, ఇప్పుడు స్వార్థం రాజకీయంతో వేరే పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం దారుణమన్నారు.
దేశవ్యాప్తంగా విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, మూల్యాంకన వ్యవస్థ వైఫల్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు.