Publish Date:Apr 22, 2022
వైకాపా పాలనలో తిరుమల పవిత్రత, ప్రతిష్ట మంటగలుస్తున్నాయి. వరుసగా ఒకదాని తరువాత ఒకటిగా జరుగుతున్న సంఘటనలు భక్తులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. భక్తుల సేవలో తరించాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆ పని మానేసి అనవసర రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది. తిరుమల రద్దీ అంటూ భక్తులకు కొండ మీదకు రావడంపై నిషేధం విధించడం నుంచీ ఎన్నడూ లేని విధంగా క్యూ లైన్లలో తొక్కిస లాట వరకూ ఏ సంఘటన తీసుకున్నా టీటీడీ నిర్లక్ష్యం, నిర్వహణా సామర్ధ్య లోపం కనిపిస్తాయి.
తాజాగా నిత్య గోవింద నామస్మరణతో అలరారాల్సిన తిరుమల గిరిపై సినిమా పాటలు వినిపించాయి. అదికూడా సాక్షాత్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లపైనే. శుక్రవారం సాయంత్రం దాదాపు ఒక అరగంట పాటు తిరుమలలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లపై సినిమా పాటలు ప్రసారం కావడం భక్తుల మనోభావాలను దెబ్బతీసింది.
నిత్యం గోవింద నామస్మరణ,భక్తి గీతాలతో మార్మోగే తిరుమల గిరులపై సినిమా పాటల ప్రసారంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ తెరపై ఓ వైపు సినిమా పాటల దృశ్యాలు, బ్యాక్ డ్రాప్లో గోవింద నామాలు ప్రసారం ప్రసారమ్యాయి.ఇది టీటీడీ నిర్లక్ష్యానికీ బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సెట్ టాప్ బాక్స్ వైఫల్యం వల్లే టీటీడీ ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లపై సినిమాపాటల ప్రసారం జరిగిందనీ, వెంటనే సరిచేశామని టీటీడీ ఈవో వివరణ భక్తుల ఆగ్రహాగ్నిని ఏ మాత్రం చల్లార్చ లేకపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవలే తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా జరుగుతున్న సంఘటనల వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/irresponsible-ttd-39-134814.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది