Publish Date:Aug 31, 2025
తెలంగాణ బీజేపీలో అంతర్గత కలహాలు ఆ పార్టీ పరిస్థితిని రాష్ట్రంలో నానాటికీ దిగజారేలా చేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ అధికారం చేజిక్కించుకోలేకపోవడానికి ఈ అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషించారు. అధిష్టానం జోక్యం కూడా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిని మెరుగుపరచచడంలో విఫలమైంది. ఇప్పటికీ రాష్ట్రపార్టీలో ముఠాల కుమ్ములాటలు, గ్రూపు తగాదాలూ అలాగే ఉన్నాయి. నాయకుల మధ్య విభేదాలు క్యాడర్ ను అయోమయానికి గురి చేస్తున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు బహిరంగంగా ఆ పార్టీ ఎంపీ నుంచే ఘోర పరాభవం, అవమానం ఎదురైంది.
విషయమేంటంటే.. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక, ఎన్నికల వ్యూహరచన తదితర అంశాలపై చర్చించేందుకు శనివారం పార్టీ సీనియర్లు, కీలక నేతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు అవమానం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ మెదక్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత రఘునందనరావు పదే పదే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పేర్కొన్నారు.
ఒక సారి అయితే పొరపాటు అనుకోవచ్చు. కానీ రఘునందనరావు తన ప్రసంగంలో కనీసం అరడజను సార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అని పేర్కొన్నారు. పరిశీలకులు, పార్టీ వర్గాలూ కూడా రఘునందనరావు ఉద్దేశపూర్వకంగా, రామచంద్రరావును అవమానించే లక్ష్యంతోనే అలా మాట్లాడారని అంటున్నారు. రఘునందనరావు, రామచంద్రరావు మధ్య విభేదాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రామచంద్ర రావును అవమానించడం, చిన్నబుచ్చడమే లక్ష్యంగా రఘునందనరావు అలా వ్యవహరించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/insult-to-telangana-bjp-chief-39-205355.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!