మ్యాచ్ల వేదికలపై బీసీబీ వినతులకు ఐసీసీ నో
Publish Date:Jan 13, 2026
Advertisement
బంగ్లాదేశ్ జట్టు ఆడే మ్యాచ్లను భారత్ నుంచి తరలించాలనే బంగ్లా క్రికెట్ బోర్డు డిమాండ్ను ఐసీసీ అంగీకరించే అవకాశాలు లేవు. ఇదే విషయాన్ని ఐసీసీ సూచన ప్రాయంగా వెల్లడించింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భద్రతా నిపుణులతో ఐసీసీ రిస్క్ అంచనా విభాగం సర్వే చేయించింది. భారత్లో బంగ్లా మ్యాచ్లకు ముప్పు వాటిల్లే పరిస్థితి లేదని ఆ నిపుణులు తేల్చారని ఐసీసీ సోమవారం ప్రకటించింది. మొత్తంగా టీ20 వరల్డ్ కప్నకు భారత్లో రిస్క్ తక్కువగా, పరిమితంగా ఉందని నిపుణులు తేల్చారని, ప్రపంచ స్థాయి టోర్నీల భద్రత ప్రొఫైల్ ఇలాగే ఉంటుందని ఐసీసీ వర్గాలు తెలిపాయి. భారత్లోని ఏ వేదిక వద్దా బంగ్లాదేశ్ అధికారులకు సైతం ఎలాంటి ముప్పు లేదని నిపుణులు నిర్ధారించినట్టు సమాచారం. ఐపీఎల్లో కేకేఆర్ నుంచి స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను బీసీసీఐ ఆదేశాల మేరకు తొలగించడం బంగ్లాదేశ్ను ఆగ్రహానికి గురి చేసింది. దీనికి నిరసనగా బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిషేధించింది. భారత్లో బంగ్లాదేశ్ వ్యతిరేక భావనలు ఉన్నాయని, కాబట్టి తమ జట్టు మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోరుతుంది
http://www.teluguone.com/news/content/icc-rejects-bcbs-requests-36-212482.html





