Publish Date:Jul 24, 2022
పుష్పా.. ఐ హేట్ టియర్స్.. అంటాడు బచ్చన్ ఓ సినిమాలో. ఈరోజుల్లో పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు ఈ డైలాగ్ని మార్చి టియర్స్ స్థానంలో ట్రాఫిక్ అని అనుకుంటున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం నగరాలు, పట్టణాల్లో ఉద్యోగానికి వచ్చిన వారు టూవీలర్ ఉంటే బాగుండు అనుకునేవారు. నగరం వెలుపల, పట్టణాల వెలుపల పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు వస్తే బస్సల్లో పడి పోలేక దాదాపు అంతా అనుకున్నది అదే. ఎవరు కార్లో వెళుతున్నా, వేగంగా టూ వీలర్ మీద వెళుతున్నా అదే మాట అనుకుంటూ కనీసం సెకండ్ హ్యాండ్ది తీసుకోవాలనుకునేవారు. అయినా ఆ రోజులు వేరు. పెద్దగా ట్రాఫిక్ సమస్యలు ఉండేవి కావు. ఇప్పుడు మనుషుల కంటే వాహానాల జోరు, శబ్దాల హోరు ఎక్కువయిపోయింది. దీంతో రోడ్లు బాగున్నా, లేకు న్నా ట్రాఫిక్ జామ్స్ మాత్రం విసిగిస్తున్నాయి. ఇపుడు కూడా ఇంత వాహనయోగం కలుగుతున్నా ఆఫీసులకు, పనులకు వెళ్లడం చాలా ఆలస్యమవుతోంది. ఇది మనం కల్పించుకున్న ఇబ్బంది గనుక గట్టిగా కామెంట్ చేయడానికీ కష్టమే.
మరీ ముఖ్యంగా బంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి నగరాల్లో ట్రాఫిక్ జామ్స్ లేని సమయం ఉండదు. ప్రతీవారికీ వాహనాల మీద త్వరగా వీలయినంత వేగంగా వెళ్లాలన్న ఆతృత మనిషిని ఏ పనీ చేయనీయని స్థితికి తెచ్చేసింది. వేగంతో పాటు జాగ్రత్తలు పాటించడం మీద అంతగా దృష్టి లేకపోవడంతో ప్రమాదాలు అంతే స్థాయిలో జరుగుతున్నాయి. అసలు మాటి మాటికి బ్రేకులు వేసుకుంటూ కార్లు, హారన్లు కొడుతూ టూవీలర్లు, ఆటోలూ నానా గందరగోళం సృష్టిస్తున్నాయి. చాలా మంది తమ వాహనాల గేర్లు పాడవుతున్నాయనో, అసలు వాహనాలే కొంతకాలం పూర్తిగా మార్చవలసిన పరిస్థితి ఏర్పడుతోందనో గోడు పెడుతున్నారు.
ఇవన్నీ గమనిస్తున్న ఒక బంగళూరు ఉద్యోగి తన కారు గేర్లు అమ్మకానికి పెడుతున్నానని ప్రకటించాడు... సరదాగా! అప్పుడైనా గేర్ల గురించిన జాగ్రత్తలు తీసుకుంటారని. అతను తన కారు 3,4,5 అమ్మేస్తానని అవి షోరూమ్ కండిషన్స్లో నిరుపయోగంగా ఉన్నాయన్నాడు! కానీ బంగళూరు, ముంబై, హైదరాబాద్నుంచీ అతనికి ట్విటర్ సమాధానాలు వచ్చాయి. బాబూ.. నీ కంటే మా పరిస్థితే దారుణంగా ఉంది.. మేము ఏకంగా కారే అమ్మేద్దామనుకుంటున్నామని!
సో, కారులేదని, టూవీలర్ లేదని బాధపడవద్దు.. ఐ హేట్ నాట్ టియర్స్... ఓన్లీ ట్రాఫిక్ పుష్పా!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/i--hate-traffic-25-140437.html
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.