ఐలాపూర్‌లో అక్రమ నిర్మాణంపై హైడ్రా కూల్చివేతలు

Publish Date:Apr 17, 2026

Advertisement

 

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చేపట్టిన కూల్చివేత చర్యలు ఏడో రోజుకి చేరుకున్నాయి. కిష్టారెడ్డి పేట గ్రామ పంచాయతీ అనుమతులతో ఐలాపూర్ భూముల్లో నిర్మించబడిన జీ ప్లస్–5 భవనాన్ని అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణంగా గుర్తించిన ఈ భవనాన్ని గత కొన్ని రోజులుగా దశలవారీగా కూల్చివేస్తూ వచ్చిన హైడ్రా సిబ్బంది, గురువారం నాటికి నిర్మాణాన్ని పూర్తిగా తొలగించినట్లు తెలిపారు. ఈ కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానికంగా నివసిస్తున్న ప్రజల్లో ఉద్రిక్తత నెలకొంది.

కూల్చివేత సమయంలో సమీపంలోని ఇళ్లకు చెందిన డ్రైనేజీ లైన్లు, పైప్ లైన్లు, ప్రహరీ గోడలు దెబ్బతిన్నాయని స్థానికులు ఆరోపించారు. తమ ఆస్తులకు నష్టం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైడ్రా అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి అదనపు సిబ్బందిని మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.
 

By
en-us Political News

  
సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం దిశగా సాగుతున్న సమయంలో ఈ ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది.
వైద్య వృత్తిని కేవలం వృత్తిగా మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతగా భావించే వ్యక్తులు అరుదుగా ఉంటారు.
అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో కీలకమైన హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఒకవైపు మంచి ఉద్యోగం, మరోవైపు సమాజం నుంచి వచ్చే విమర్శలు.. ఇవన్నీ దాటుకుని తన కలల దిశగా అడుగులు వేయడం సాధారణమైన విషయం కాదు
ఐపీఎల్‌‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మరో రికార్డును బ్రేక్ చేశాడు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సర్జరీకి అపోలో ఆస్పత్రిలో ఎంత బిల్ అయ్యింది? దాన్ని ఎవరు చెల్లించారు? చర్చ ఒకటి నడుస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్ల కు రూ.76 లక్షల విరాళం ఇచ్చిన భువనేశ్వరి
సీఎం చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాల అంశం హాట్ టాపిక్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం గొడవలు, విమర్శలు సర్వసాధారణం.
సాంకేతికత విపరీతంగా పెరిగిన ఈ ఆధునిక కాలంలో, విద్యా రంగంలో డిజిటల్ పరికరాల వాడకం సర్వసాధారణమైపోయింది.
సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై వైఎస్ భారతిరెడ్డి తీవ్రంగా స్పందించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం ఉదయం ఉత్కంఠ భరిత దృశ్యాలు చోటు చేసుకున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.