పిఠాపురం పర్యటనలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీల్లోనూ, ప్రభుత్వంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. కేబినెట్ లో సహచర మంత్రిపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం కూటమి సర్కార్ కు ఇబ్బందికరంగా పరిణమించాయనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి రాష్ట్ర హోంమంత్రిగా అనిత బాధ్యత వహించాలంటూ చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? అంటూ సంధించిన ప్రశ్నలూ ఒక అనితనే కాక మొత్తం తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పని తీరును ప్రశ్నించడంగానే భావించాల్సి ఉంటుంది. ఆ ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ కూడా భాగమే. అటువంటి పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో అవసరమైతే తాను హోంమంత్రి బాధ్యతలు చేపడుతానని హెచ్చరించడం సీఎం చంద్రబాబు తీరును కూడా ఎత్తి చూపినట్లుగానే పరిశీలకులు భావిస్తున్నారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యల కారణంగా కూటమి ప్రభుత్వానికి ఏర్పడిన ఇబ్బందిని అధిగమించడానికి చంద్రబాబు రంగంలోనికి దిగుతారు. ఆయన పరిణితి, విభేదాల పరిష్కారం నేర్పు తెలియంది కాదు.
అయితే ఇక్కడ చెప్పుకోవలసింది పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించిన తీరును. ఎంతో పరిణితితో, అంతకు మించిన హుందా తనంతో ఆమె పవన్ వ్యాఖ్యలను స్వీకరించారు.
వంగలపూడి అనిత ఎంత ఫైర్ బ్రాండ్ లీడరో అందరికీ తెలిసిందే. జగన్ అరాచక పాలనను వ్యతిరేకంగా ఆమె ఎంత గట్టిగా పోరాడారో తెలియంది కాదు. అటువంటి వంగలపూడి అనిత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఎంతో పాజిటివ్ గా తీసుకున్నారు. ఆయన మాట్లాడిన మాటలన్నీ వాస్తవాలేనని తనకు తెలుసునన్నారు. పవన్ కల్యాణ్ దేని గురించి మాట్లాడుతున్నారో తనకు తెలుసున్నారు. వాటిపై తాము చర్చించామన్నారు. ముఖ్యమంత్రితో రాష్ట్రంలో పరిస్థితుల గురించి తాను జరిపిన చర్చలలో పవన్ కల్యాణ్ కూడా ఉన్నారని చెప్పిన అనిత.. రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దడానికి అవసరమైన అన్ని చర్యలూ త్వరలోనే తీసుకుంటామని చెబుతూనే తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ మాటల్లో రాజకీయాలు లేవని చెప్పడం ద్వారా అనిత తన పరిణితిని చాటుకున్నారు. పవన్ కల్యాణ్ అవేశంతో అనాలోచితంగా అంతర్గతంగా చర్చించుకోవలసిన అంశాలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే.. ఎంతో పరిణితితో అనిత వాటిని పాజిటివ్ గా తీసుకుని చర్యలు తీసుకుంటానని చెప్పారు.
అయితే.. పవన్ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్నిలేపాయనడంలో సందేహం లేదు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. తెలుగుదేశం, జనసేన సఖ్యత చెడిందా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. అయితే పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలలో తప్పేముందని మంత్రి నారాయణ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏదైనా శాఖ సరిగా పని చేయడం లేదని అనిపిస్తే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్పందిస్తారని అందులో తప్పేముందని ప్రశ్నించారు. వారి స్పందన వల్ల ఆ శాఖలు అలర్ట్ అవుతాయని అన్నారు. రాష్ట్రంలో ఇటీవల మహిళలు, బాలికలపై జరిగిన అఘాయి త్యాలపై పవన్ కల్యాణ్ స్పందించారనీ, కొన్ని సంఘటనలలో పోలీసులు వేగంగా స్పందించలేదని ఆయన అన్నారు. ఆయన హెచ్చరికలతో పోలీసు శాఖ అప్రమత్తమౌతుందని నారాయణ వివరించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఎంత మాత్రం వివాదాస్పదం కావని స్పష్టం చేశారు. అలాగే కూటమి పార్టీలలో ఎలాంటి విభేదాలూ లేవని క్లారిటీ ఇచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/home-minister-anita-responded-with-maturity-25-187882.html
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.