ఈ ఏడాది చివరి నాటికి కర్నూలులో హైకోర్టు బెంచ్!

Publish Date:Feb 3, 2025

Advertisement

మాజీ ముఖ్యమంత్రి జగన్ కర్నూలు న్యాయరాజధాని అంటూ ఐదేళ్ల పాటు పిల్లిమొగ్గలు వేశారు. రాష్ట్రానికి మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ అంటూ అసలు రాజధానే లేకుండా చేసి, ప్రజాగ్రహానికి గురై అధికారాన్ని కోల్పోయారు. అయితే 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్ర రాజధాని అమరావతి అంటూ ప్రకటించి.. రాజధాని నగర నిర్మాణానికి బాటలు వేశారు. ఆయన హయాంలో శరవేగంగా  నిర్మాణ పనులు సాగాయి. అయితే 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ఉద్దేశ పూర్వకంగా అమరావతిని నిర్వీర్యం చేశారు. రాష్ట్రానికి మూడు రాజధానులంటూ కొత్త డ్రామాకు తెరలేపి రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టడంతో మళ్లీ రాజధాని అమరావతి  నిర్మాణ పనులు జోరందుకున్నాయి. తొలి నుంచీ రాష్టరానికి ఒకే రాజధాని, అది అమరావతే అంటూ చెబుతూ వస్తున్న చంద్రబాబు ఆ దిశగా అడుగుల వేగం పెంచారు. అదే సమయంలో విశాఖ, కర్నూలు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టారు.  

ముఖ్యంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ అన్న ఆ ప్రాంత వాసుల చిరకాల డిమాండ్ నెరవేరబోతున్నది. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ మేరకు   కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. కర్నూలులో  హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు అనువైన భవనాన్ని ఎంపిక చేసేందుకు ఈ నెల 6న హైకోర్టు జడ్జీల బృందం కర్నూలులో పర్యటించనుంది.  భవనం ఎంపిక తదితర అంశాలన్నీ సజావుగా పూర్తయిపోయి.. ఈ ఏడాది చివరికల్లా కర్నూలులో హైకోర్టు బెంచ్ ప్రారంభమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.  

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టిన తరువాత గత ఏడాది నవంబర్ 21న కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు అసంబ్లీ తీర్మానం చేసింది. అంతకంటే ముందు హైకోర్టు శాశ్వత బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేసే విషయంలో అభిప్రాయాలను తెలియజేయడానికి హైకోర్టు ఫుల్ బెంచ్ ముందు ఈ అంశాన్ని ఉంచాలని కోరుతూ రాష్ట్ర న్యాయసాఖ కార్యదర్శి ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ కు లేఖ రాశారు. దీంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో ఓ కమిటీని వేశారు.  

ఆ కమిటీ నివేదిక మేరకు ఈ ఏడాది జనవరి 29న హైకోర్టు రిజిస్ట్రార్ కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు కావలసిన సదుపాయాల గురించి వివరిస్తూ జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు.  కోర్టు కాంప్లెక్స్,  న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాలు, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి నివాస వసతి, న్యాయవాదులకు వసతి సౌకర్యాల పూర్తి సమాచారాన్ని పంపాలని ఆ లేఖలో  కోరారు. ఆ లేఖపై కర్నూలు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించారు.  హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన లేఖలో ఉన్న విధంగా సౌకర్యాలు కల్పించేందుకు  భవనాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని  కర్నలు మునిసిపల్ కార్పొరేషన్ చైర్మన్,  ఆర్డీవోలను ఆదేశించారు. ఇప్పుడు 15 మంది న్యాయమూర్తుల బృందం హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అనువైన  స్థలాన్ని పరిశీలించేందుకు కర్నూలు రానుంది. న్యాయమూర్తుల బృందం ఈ నెల6న కర్నూలులో పర్యటించనుంది.  అన్ని సజావుగా జరిగితే ఈ ఏడాది చివరి నాటికే కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

By
en-us Political News

  
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.