రాత్రి 7గంటలలోపు భోజనం చెయ్యాలి ఇందుకే!

Publish Date:Jul 19, 2024

Advertisement

ప్రజలు ఆరోగ్యం కోసం మూడు పూటలా ఆహారం తీసుకుంటారు.  ఇందులో ఉదయం బ్రేక్ పాస్ట్, మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఉంటాయి. చాలామందికి ఉదయం 9లోపు అల్పాహారం, మధ్యాహ్నం 2 గంటల లోపు భోజనం చేస్తారు. ఇక రాత్రి సమయంలో కొందరు 8 గంటలకు, మరికొందరు 9 గంటలకు, ఇంకొందరు 10 గంటలకు కూడా భోజనం చేస్తారు.  అయితే రాత్రి భోజనం విషయంలో వైద్యులు చాలా అసక్తికర విషయాలు వెల్లడించారు.  రాత్రి భోజనం 7 గంటలలోపు తింటే ఏం జరుగుతుందో కింది విధంగా వివరించారు.

రాత్రి 7 గంటలలోపు భోజనం చెయ్యడం వల్ల ఆహారం తినడానికి, నిద్రపోవడానికి మధ్య తగినంత సమయం దొరుకుతుంది.  ఈ సమయం తిన్న ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. దీనివల్ల రాత్రి సమయంలో కడుపు  ఉబ్బరం, కడుపు భారంగా అనిపించడం,  అజీర్ణం వంటి  సమస్యలు లేకుండా హాయిగా నిద్ర పడుతుంది.


కొందరిలో ఆకలి వేళలు క్రమ పద్దతిలో ఉండవు. ఎప్పుడంటే అప్పుడు తింటూ ఉంటారు. రాత్రి 7 గంటలలోపు తింటే ఆకలి వేళలు కూడా క్రమ పద్దతిలో ఉంటాయి. రాత్రి తొందరగా తినడం వల్ల  ఉదయాన్నే తొందరగా ఆకలి వేస్తుంది.  ఇది బ్రేక్పాస్ట్  స్కిప్ చేయకుండా ఉండటంలో సహాయపడుతుంది.


చాలామంది రాత్రి 9 గంటలు దాటిన  తరువాత భోజనం విషయంలో చాలా హడావిడి పడుతూ ఉంటారు. ఇలా హడావిడిగా తినేటప్పుడు ఆహారం నమలరు.  అప్పటికే సమయం గడవడం వల్ల ఆ ఆహారం కూడా జీర్ణం కావడం కష్టంగా ఉంటుంది. 7గంటలలోపు తినడం వల్ల హడావిడి ఉండదు. నెమ్మదిగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటారు. దీనివల్ల తిన్న ఆహారం శరీరానికి ఒంటబడుతుంది. 7గంటలలోపు ఆహారం తినడం ద్వారా అది సరిగా జీర్ణం అవుతుంది. యాసిడ్ రిఫ్లక్స్, మలబద్దకం, జీర్ణ అసౌకర్యం వంటి సమస్యలు ఉండవు.

బరువు తగ్గాలని అనుకునేవారు ఆహార వేళలు పర్పెక్ట్ గా ఫాలో అవ్వాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో 7గంటలలోపు తినడం వల్ల బరువు తగ్గడం సులువుగా ఉంటుంది. జీవక్రియ  సజావుగా జరుగుతుంది. పడుకునేలోపు చాలా ఆహారం జీర్ణం అవుతుంది.  దీనివల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది. అంతే కాదు రాత్రి 7గంటల లోపు తింటే సిర్కాడియన్ రిథమ్ సిస్టమ్  సమన్వయంగా ఉంటుంది. ఇది నిద్రా చక్రం.  అంటే నిద్ర చక్రం చక్కగా పనిచేస్తుంది.

                      *రూపశ్రీ.

By
en-us Political News

  
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి...
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.