political-news-img

జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ కండువా కప్పిన కేటీఆర్..

మాజీ మంత్రి టీఅ. జీవన్ రెడ్డి బీఅర్ఎస్ గూటికి చేరారు. తన నివాసంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఆయనకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జగిత్యాలకు తొలి పర్యటన సందర్భంగా బోర్నపల్లి వంతెన అంశంపై జీవన్ రెడ్డి చేసిన వినతి వెంటనే ఆమోదించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. అలాగే చక్కెర కర్మాగారం అంశంపై జీవన్ రెడ్డి పోరాటం చేసిన సందర్భాన్ని కూడా ప్రస్తావించారు. జీవన్ రెడ్డి వంటి నాయకుడి చేరికతో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పని చేయాలనే ఆలోచనే తనకు ఆనందాన్నిస్తోందని జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను కలిసి తన రాజకీయ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తానన్నారు.

Publish Date: Apr 9, 2026 7:05PM

political-news-img

తక్కువ మాట్లాడే వ్యక్తులే శక్తివంతులుగా, గొప్పవాళ్లుగా  మారతారు.. ఎందుకంటే..!

ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉంటారు. మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే... గొప్ప వ్యక్తులలో ఉండే అతిగొప్ప లక్షణం తక్కువ మాట్లాడటం. తక్కువ మాట్లాడేవాడు తన చేతల్లోనే తన విజయాన్ని చూపిస్తాడు అని తరచుగా చెబుతూ ఉంటారు కూడా. ఇతరుల కంటే తక్కువ మాట్లాడేవారే ఎక్కువ తెలివైనవారని, జ్ఞానులని ఎందుకు అంటారు? తక్కువ మాట్లాడేవారు ఎందుకు ప్రత్యేకమైనవారిగా పరిగణించబడతారు? తక్కువ మాట్లాడటం అనేది గొప్ప లక్షణంగా ఎందుకు పరిగణించబడుతుంది? వివరంగా తెలుసుకుంటే.. తక్కువ మాట్లాడితే మాట విలువ పెరుగుతుంది.. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే వ్యక్తులపై చుట్టూ ఉన్నవారు శ్రద్ధ పెట్టడం తగ్గిస్తారట.చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తి మాట్లాడినా కూడా ప్రజలు శ్రద్ధగా వింటారు. తక్కువ మాట్లాడటం వల్ల వ్యక్తి మాటలకు విలువ పెరిగి, సమాజంలో వారికి మరింత గౌరవం లభిస్తుందని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. ఆలోచనా శక్తి.. తక్కువ మాట్లాడేవారు తమ మెదడును ఎక్కువగా ఉపయోగిస్తారు. వారు స్పందించడానికి తొందరపడరు. ముందుగా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని, ఆ తర్వాతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే వారు కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకున్నారని అందరూ ఒప్పుకునే విధంగా ఉంటాయి. సమాజం కూడా ఇలా తక్కువ మాట్లాడే వారికి చాలా తెలివైన వారు అని చెబుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం.. తక్కువ మాట్లాడేవారు ఆర్భాటాలు చేయరు. వారికి తమపై పూర్తి విశ్వాసం ఉంటుంది, కాబట్టి ఇతరులను ఆకట్టుకోవడానికి పనికిమాలిన మాటలు మాట్లాడరు. ఇలా నిశ్శబ్దంగా ఉండే స్వభావమే వారి నిజమైన బలం అవుతుందని చాణక్యుడు అంటాడు. తక్కువ మాట్లాడినప్పుడు వారిలో ఎన్నో విషయాలు వారిలోనే రహస్యంగా ఉండిపోతాయి. అదే ఎప్పుడూ మాట్లాడేవారు ఏ చిన్న సంఘటన జరిగినా బయటకు చెప్పేసుకుంటారు. దీని వల్ల వారికి విలువ, గౌరవం తగ్గిపోతుంది. అర్థం చేసుకునే అవకాశం.. తక్కువ మాట్లాడటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఇతరుల మాటలను వినడానికి అవకాశం లభించడం. ఇతరులు చెప్పేది బాగా వినగలిగే వ్యక్తి మాత్రమే ఇతరుల బలహీనతలను, అవసరాలను అర్థం చేసుకోగలరని చాణక్యుడు చెబుతాడు. మౌనంగా ఉండి ఇతరుల మాటలను విన్నప్పుడు, వారి ఆలోచనలపై ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇది నిర్ణయాలు తీసుకోవడానికి, విజయం సాధించడానికి అత్యంత కీలకం అవుతుంది. *రూపశ్రీ.

Publish Date: Apr 9, 2026 5:50PM

political-news-img

కొబ్బరి నీరు VS మజ్జిగ.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుందంటే!

వేసవి కాలంలో శరీరానికి నీరు చాలా అవసరం. నీటి కొరత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగమని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. అదనంగా మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు త్రాగమని కూడా సిఫార్సు చేస్తారు. కొందరు ఆరోగ్యానికి కొబ్బరి నీరు బెటర్ అని చెబితే.. మరికొందరు మజ్జిగ చాలా మంచిది అంటారు. ఈ రెండూ ఆరోగ్యకరమైనవే.. అయినప్పటికీ రెండింటిలో కూడా ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది అనే విషయం దగ్గర చాలా మంది కన్ప్యూజ్ అవుతుంటారు. కొబ్బరి నీరు, మజ్జిగ.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేసే డ్రింక్ ఏంటో తెలుసుకుంటే.. కొబ్బరి నీరు.. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం , సోడియం ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం నివారించబడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, తక్షణ శక్తిని అందిస్తుంది. తేలికగా, సులభంగా జీర్ణమవుతుంది. అధికంగా చెమట పట్టినప్పుడు లేదా వ్యాయామం చేసినప్పుడు కొబ్బరి నీళ్లు తాగమని డైటీషియన్లు సిఫార్సు చేస్తారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యత చేయబడుతుంది. మజ్జిగ.. మజ్జిగలో జీర్ణవ్యవస్థను బలపరిచే ప్రోబయోటిక్ గుణాలు ఉంటాయి. మజ్జిగ తాగడం జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ప్రతిరోజూ మజ్జిగ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ , ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగ తాగితే శరీరం చల్లబడుతుంది. బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. గ్యాస్ లేదా అజీర్ణం వంటి కడుపు సమస్యలతో బాధపడుతుంటే, మజ్జిగ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తేడా.. కొబ్బరి నీరు శరీరానికి తక్షణమే తేమను అందిస్తుంది. మరోవైపు, మజ్జిగ జీర్ణక్రియను బలపరుస్తుంది. కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండగా, మజ్జిగలో ప్రోటీన్ , ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఎప్పుడు ఏది ఎంచుకోవాలి..? డీహైడ్రేషన్ లేదా అలసటగా అనిపిస్తే కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఇది శరీరాన్ని తిరిగి ఎనర్జీగా మారుస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత తగ్గిస్తుంది. భోజనం తర్వాత మజ్జిగ తాగవచ్చు. ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అలాగే ఎండలో బయటకు వెళ్లే ముందు కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఎండ నుండి వచ్చిన తర్వాత కూడా కాసింత చల్లగా ఉండే మజ్జిగ తాగవచ్చు. మజ్జిగ, కొబ్బరి నీరు రెండూ మంచివే అయినా.. శరీర పరిస్థితిని బట్టి కొబ్బరి నీరు, మజ్జిగ వేర్వేరు ఫలితాలు ఇస్తాయి, వేర్వేరుగా ఉపయోగపడతాయి. *రూపశ్రీ.

Publish Date: Apr 9, 2026 5:43PM

political-news-img

పట్టాదార్ పాసుపుస్తకాలపై క్యూఆర్ కోడ్.. 2027నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల యాజమాన్య హక్కులపై నమ్మకాన్ని పెంచేలా ప్రభుత్వం ముందడుగు వేసింది. నంద్యాల జిల్లా ధోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజు గ్రామంలో జరిగిన మీ భూమి - మీ హక్కు'కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. రైతులకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశారు. భూ రికార్డుల భద్రత కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని, క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా రెవెన్యూ వ్యవస్థలో పెనుమార్పులకు ఈ పట్టాదార్ పాసుపుస్తకాల ద్వారా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు.. జగన్ హయాంలో భూ రికార్డుల విషయంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేశారు. మునుపటి ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు శాపంగా మారిందన్న ఆయన తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేశామన్నారు. భూమి కేవలం ఆస్తి మాత్రమే కాదని, అది రైతులకు ఆత్మగౌరవంతో కూడిన సెంటిమెంట్ అన్నారు. కొత్తగా రూపొందించిన పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ సదుపాయం కల్పించినట్లు చంద్రబాబు వెల్లడిం చారు. ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు, భూమికి సంబంధించిన పూర్తి వివరాలు, మ్యాపులు వెనువెంటనే ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల రికార్డుల ట్యాంపరింగ్‌కు ఇసుమంతైనా అవకాశం ఉండదన్నారు. ఒకసారి బ్లాక్ చైన్ సిస్టమ్‌లోకి డేటా వెళ్ళాక, ఉన్నతాధికారులు సైతం యజమాని అనుమతి లేకుండా మార్పులు చేయలేరని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు పంపిణీ చేస్తున్న పాస్ పుస్తకాలపై అధికారిక రాజముద్ర మాత్రమే ఉంటుందన్నారు. ఈ పాసు పుస్తకాలను ఎటువంటి అదనపు రుసుము లేకుండా ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16,816 గ్రామాలు ఉండగా, ఇప్పటివరకు చాలా గ్రామాల్లో గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయిందన్న చంద్రబాబు.. 2027 నాటికి ఆంధ్రప్రదేశ్ ను భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు చెప్పారు.

Publish Date: Apr 9, 2026 5:04PM

political-news-img

ఇరాన్ పై అమెరికా ద్వంద్వ వైఖరి

ఇరాన్ విషయంలో అగ్రరాజ్యం అమెరికా ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. పశ్చిమాసియాలో శాంతి స్థాపనే ధ్యేయం అంటే ఓ పక్క శాంతి మంత్రం పఠాస్తూనే.. మరో వైపు ఇరాన్ ను రెచ్చగొట్టి పశ్చిమాసియాలో శాంతికి అవకాశం లేకుండా చేస్తున్నాది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి విరామం ప్రకటించి, ఇరాన్ పది సూత్రాల శాంతి ప్రతిపాదనను భేష్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. గంటల వ్యవధిలోనే ఇరాన్ తో శాంతి ఒప్పందానికి, ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులకూ సంబంధం లేదంటూ ఇజ్రాయెల్ కు వంత పాడారు. అదే సమయంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఇరాన్ పై అమెరికా కఠినాతి కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఇరాన్ దూకుడుకు చెక్ పెట్టేందుకు అమెరికా ఎటువంటి చర్యలకూ వెనుకాడబోదని కుండబద్దలు కొట్టారు. కేవలం చర్చలతోనే సమస్యలు పరిష్కారం కావని, ఇరాన్ తన పంథాను మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

Publish Date: Apr 9, 2026 4:46PM

political-news-img

2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి అంచనా

ప్రపంచ బ్యాంకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి అంచనాను గతంలోని 6.3% నుండి 6.6%కి పెంచింది. * ఈ ప్రాంతం అంతటా ఆర్థిక వృద్ధి మందగిస్తున్నప్పటికీ, భారత్ మాత్రం ప్రధాన చోదక శక్తిగా నిలుస్తూనే ఉంది; విస్తృత ఆర్థిక దృక్పథం అనిశ్చితంగా ఉన్న ప్రస్తుత తరుణంలో, ఇది ఒక రకమైన స్థిరత్వాన్ని అందిస్తోంది. ప్రపంచవ్యాప్త అనిశ్చితులు ఈ ప్రాంతంపై ఒత్తిడిని కొనసాగిస్తున్నప్పటికీ, దక్షిణాసియా ఆర్థిక వ్యవస్థకు భారత్ అత్యంత బలమైన మూలస్తంభంగా నిలుస్తుందని అంచనా వేయబడుతోంది. * బాహ్య ఒత్తిళ్లు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రదర్శించే నిలకడపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, ప్రపంచ బ్యాంకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి అంచనాను గతంలోని 6.3 శాతం నుండి 6.6 శాతానికి సవరించి పెంచింది. * భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు ఇంధన మార్కెట్ల అస్థిరత కారణంగా పెరుగుతున్న ఒత్తిళ్లను దక్షిణాసియా ప్రాంతం ఎదుర్కొంటున్న సమయంలో, ఈ సవరించిన ఆర్థిక దృక్పథం వెలువడటం విశేషం. ఈ ప్రాంతం యొక్క మొత్తం ఆర్థిక వృద్ధి మందగిస్తున్నప్పటికీ, భారత్ మాత్రం ప్రధాన చోదక శక్తిగా ప్రత్యేకంగా నిలుస్తూ, అనిశ్చితంగా ఉన్న ప్రస్తుత ఆర్థిక వాతావరణంలో ఒక స్థాయి స్థిరత్వాన్ని అందిస్తోంది. సేకరణ, సంకలనం: సీతారాం కంఠంనేని

Publish Date: Apr 9, 2026 4:28PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img