political-news-img

ఇరాన్ తో యుద్ధం కోసం అమెరికా చేసిన ఖర్చెంతో తెలిస్తే మైండ్ బ్లాక్ ఖాయం.!

ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధం మిడిల్ ఈస్ట్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ యుద్ధంతో అమెరికా కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ యుద్ధం కోసం, యుద్ధాన్ని కొనసాగించడం కోసం అమెరికా ఎంత ఖర్చు చేసిందో తెలుస్తే మైండ్ బ్లాక్ కావడం ఖయం. ప్రపంచానికి పెద్దన్నగా తనను తాను అభివర్ణించుకునే అమెరికా ఇరాన్ సంబంధిత సైనిక చర్యల కోసం అక్షరాలా 37.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇది ఇండియన్ కరెన్సీలో 3.6 లక్షల కోట్లు. పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధం గల్ఫ్ ప్రాంతంలో నిరంతరం సాగుతున్న రాకెట్లు, డ్రోన్లు, క్షిపణి దాడులు అమెరికా ఖజానాను దాదాపుగా ఖాళీ చేస్తున్నాయి. అలాగే అమెరికా రక్షణ రంగాన్ని ఈ యుద్ధం డిఫెన్స్ లో పడేసింది. అమెరికా అహంకారంలోని డొల్ల తనాన్ని ఈ యుద్ధం ప్రపంచానికి చాటింది. అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ సెనేట్ అప్రాప్రియేషన్స్ కమిటీ ఎదుట స్వయంగా హాజరై ఇరాన్ తో యుద్ధం కోసం ఎంత వ్యయం చేయాల్సి వచ్చిందో గణాంకాలతో సహా వెల్లడించారు. సెప్టెంబర్ 30తో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి ఈ యుద్ధ వ్యయం ఇంకా భారీగా పెరుగుతుందని కూడా ఆయన అప్రాప్రియేషన్స్ కమిటీ ఎదుట అంగీకరించారు. మే, జూన్ నెలల్లో వేసిన అంచనాల ప్రకారం ఈ వ్యయం 29 బిలియన్ల నుంచి 30 బిలియన్ డాలర్లుగా ఉంటుందని భావించినా.. అది వాస్తవంగా 37.5 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. యుద్ధ తీవ్రత, క్షిపణుల వాడకం అనూహ్యంగా పెరగడమే ఇందుకు కారణమని ఆయన వెల్లడించారు. రక్షణ అవసరాలు, ఆయుధ రీప్లేస్‌మెంట్ కోసం అత్యవసరంగా మరో 67 బిలియన్ డాలర్ల అదనపు రక్షణ నిధులను కేటాయించాలని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్‌తో కలిసి పీట్ హెగ్‌సెత్ డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తరఫున సెనేట్‌ను అభ్యర్థించారు. సైనిక బలగాల సంసిద్ధతను కాపాడుకోవడానికి నిధులు అత్యవసరమన్నారు. నిధులు వెంటనే మంజూరు కాకపోతే, అమెరికా సైనిక శిక్షణా కార్యక్రమాలను పరిమితం చేయాల్సి వస్తుందనీ, ఇంు వల్ల నిర్వహణ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. Pete Hegseth US Iran war, US military spending Iran, Strait of Hormuz conflict, Pentagon defense budget

Publish Date: Jul 22, 2026 8:51AM

political-news-img

ఢిల్లీ పోలీసుల వ్యూహ వైఫల్యం.!

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతాపార్టీ పిలుపు మేరకు జరిగిన పిలుపునిచ్చిన చలో పార్లమెంటు ఆందోళన హస్తినలో ఉద్రిక్తతలకు దారితీసింది. వేలాది మంది నిరసనకారులు ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి పార్లమెంట్ వైపు దూసుకురావడం, శాంతియుతంగా సాగుతుందనుకున్న ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంలో పోలీసుల వ్యూహ వైఫల్యం ప్రస్ఫుటంగా బయటపడింది. హస్తినలో కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనలో ఉద్రిక్తత ఏర్పడడానికి కారణం పరిస్థితిని అంచనా వేయడంలో పోలీసులు ఘోరంగా విఫలం కావడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత మూడు వారాలుగా చలో సంసద్ కార్యక్రమంపై కాక్రోచ్ జనతాపార్టీ సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా వరుస ప్రకటనలు ఇస్తూనే ఉంది. ఈ నిరసనలో పదివేల మంది వరకు నిరసనకారులు పాల్గొనే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులు అంచనా వేశారా. అయితే ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ.. భారీ సంఖ్యలో యువత, విద్యార్థులు, మహిళలు రోడ్లపైకి రావడంతో రాజధాని వీధులు జనసంద్రంగా మారిపోయాయి. ఈ స్థాయిలో జనం తరలిరావడానికి కాక్రోచ్ జనతా పార్టీ ముందు నుంచీ చేసుకున్న డిజిటల్ సమన్వయమే కారణంగా పరిశీలకులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది విద్యార్థులు, మహిళలు, యువకులు ఢిల్లీకి చేరుకోవడానికి వాట్సాప్ గ్రూపుల ద్వారా పక్కాగా కమ్యూనికేట్ చేసుకున్నారు. ఈ సమన్వయాన్ని చివరి నిమిషం వరకు నిఘా వర్గాలు పసిగట్టలేకపోవడమే ఈ పరిస్థితికి కారణమైంది. ఆందోళనకారులు చిన్న చిన్న బృందాలుగా వచ్చి ఒక్కసారిగా పార్లమెంటు ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోయిందని భావించిన పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీనికి ప్రతిగా ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. లాఠీఛార్జ్, రాళ్ల దాడులతో పార్లమెంట్ పరిసర ప్రాంతాలు రణ క్షేత్రాన్ని తలపించాయి. గతంలో ఎంతో సున్నితమైన నిర్భయ ఘటన సమయం లోనూ, సుదీర్ఘంగా సాగిన రైతు ఉద్యమాల సమయంలోనూ లక్షలాది మంది ప్రదర్శకులను అత్యంత సమర్థవంతంగా నిలువరించిన చరిత్ర ఢిల్లీ పోలీసులకు ఉంది. అలాంటి బలమైన పోలీస్ యంత్రాంగం ఈసారి నిరసనకారులను ఏ దశలోనూ కంట్రోల్ చేయలేక చేతులెత్తేయడం విస్మయం గొలుపుతోంది. Chalo Parliament protest, NEET paper leak protest Delhi, Cockroach Janata Party protest, Parliament gate tension, Delhi protest lathi charge

Publish Date: Jul 22, 2026 8:41AM

political-news-img

మళ్లీ ఇండియాపై ట్రంప్ టారిఫ్ బాంబ్.!

ప్రపంచవ్యాప్తంగా తక్కువ ధరలో అత్యంత ప్రాణరక్షకమైన ఔషధాలను అందిస్తున్న భారత ఫార్మా రంగానికి అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే జనరిక్ ఔషధాలపై 200 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించారు. అమెరికాలోనే స్వదేశీ ఔషధ తయారీని ప్రోత్సహించి, స్థానిక ప్లాంట్ల ఏర్పాటును పెంచడమే లక్ష్యంగా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెబుతున్నారు. ఈ ప్రకటనతో అమెరికా మార్కెట్‌పై ఆధారపడిన ఇండియన్ ఫార్మా కంపెనీలు, ఎగుమతిదారులపై ప్రభావం పడుతుందనడంలో సందేహం లేదు. డోనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా చేసిన ఈ ప్రకటన మేరకు వచ్చే నెల 1 నుండి రెండేళ్ల పాటు అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని రకాల జనరిక్ ఔషధాలపై సుంకం సున్నా శాతంగానే కొనసాగుతుంది. అయితే ఈ రెండేళ్ల వ్యవధి ముగిసిన వెంటనే, మొదటి ఏడాదిలోనే దిగుమతి సుంకాలను 100 శాతానికి పెంచుతారు. ఆ తర్వాత వచ్చే ఏడాదికి ఈ సుంకాన్ని 200 శాతానికి పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు. ఈ నిర్దేశిత కాల వ్యవధిలో అమెరికాలో తయారీ ప్లాంట్లు, ఏర్పాటు చేయని విదేశీ ఔషధ కంపెనీలకు ఇది శిక్షగా మారుతుందని ట్రంప్ హెచ్చరించారు. ప్రపంచ ఔషధ విపణిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా అమెరికా మార్కెట్‌లో విక్రయించే మొత్తం జనరిక్ మందులలో 40 శాతం భారత్‌లోనే తయారవుతున్నాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీఆర్టీఏ) గణాంకాల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇండియా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 25.8 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేయగా.. అందులో ఏకంగా 9.7 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 38 శాతం అమెరికాకే ఎగుమతి అయ్యాయి. హైపర్‌టెన్షన్ , డయాబెటిస్ , క్యాన్సర్, డిప్రెషన్ వంటి వ్యాధులకు అమెరికన్లు వాడే అత్యవసర జనరిక్ మందులలో భారతీయ కంపెనీల వాటాయే ఎక్కువ. ఇక ఫైనాన్షియల్ పోస్ట్ నివేదిక మేరకు 2024లో అమెరికాలో ఉపయోగించిన మొత్తం గర్భనిరోధక మాత్రలలో దాదాపు 65 శాతం గ్లెన్‌మార్క్, లుపిన్ అనే రెండు భారతీయ ఫార్మా కంపెనీల నుంచి ఉత్పత్తి అయినవే. అయితే.. 2026 ఫిబ్రవరి నెలలో భారత్, అమెరికా మధ్య కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో జనరిక్ ఔషధాలు, వాటి ముడిసరుకుల సరఫరాపై పరస్పర చర్చల ద్వారానే నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటించిన ఈ నిర్ణయం అమలైతే భారత ఫార్మా పరిశ్రమపైనే కాకుండా.. అమెరికాలోని సామాన్యులపై కూడా తీవ్ర భారం పడుతుంది. Donald Trump pharma tariffs, Indian generic medicines America, US import duties on generics, Indian pharma industry, GTRI pharma export report

Publish Date: Jul 22, 2026 8:27AM

political-news-img

బహ్రెయిన్ లోని అమెజాన్ డేటా సెంటర్ పై ఇరాన్ దాడి.!

పశ్చిమాసియా ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. అమెరికా, ఇరాన్ మధ్య రగులుతున్న ప్రతీకార దాడులు గల్ఫ్ రీజియన్ ను అగ్నిగోళంలా మార్చేశాయి. అమెరికా చేపట్టిన వైమానిక దాడులకు ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా వ్యాప్తంగా భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్ జార్డన్ భూభాగంలో ఉన్న అమెరికన్ మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డారు. నాసర్ 2 అనే పేరుతో చేపట్టిన ఈ రహస్య సైనిక ఆపరేషన్ ద్వారా శత్రు స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ మెరుపు దాడి ఫలితంగా అక్కడ పనిచేస్తున్న అత్యాధునిక రాడార్ నియంత్రణ వ్యవస్థలతో పాటు విమాన నిల్వ కేంద్రాలలో సిద్ధంగా ఉన్న ఎఫ్ 15 పోరాట విమానాలుధ్వంసమైనట్లు సమాచారం. ముఖ్యంగా రుక్బాన్ సరిహద్దు ప్రాంతంలో నెలకొల్పిన ప్రధాన అమెరికన్ సైనిక ప్రాంగణంపై జరిగిన క్షిపణి దాడుల ధాటికి పలువురు అమెరికా సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ప్రకటించింది. అలాగే బహ్రెయిన్‌లోని దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రధాన డేటా సెంటర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దేశ పౌర వసతులపై అమెరికా దళాలు జరిపిన దాడులకు తగిన రీతిలో జవాబు చెప్పడానికే ఈ సాంకేతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు, క్షిపణి దాడి ఘటనను అమెజాన్ కానీ, బహ్రెయిన్ ప్రభుత్వం కానీ ధ్రువీకరించలేదు. మరోవైపు కువైట్ లో కూడా ఇరాన్ బలగాలు ఆపరేషన్ లైట్నింగ్ ప్రత్యేక దాడి చేశాయి. ఈ దాడిలో కువైట్‌లోని అమెరికన్ మిలిటరీ క్యాంపులైన అరిఫ్జాన్, అహ్మద్ అల్-జాబర్ ఎయిర్ బేస్‌లలో ఏర్పాటు చేసిన ఎయిర్ డిఫెన్స్ కవచాలు, కమ్యూనికేషన్ టవర్లు, రాకెట్ లాంచర్ వ్యవస్థలను ధ్వంసం అయినట్లు సమాచారం. ఇంకా అలీ అల్-సలేమ్ ఎయిర్ బేస్‌లోని రీపర్ డ్రోన్ నిల్వ కేంద్రంపై జరిపిన దాడిలో అనేక అధునాతన నిఘా , దాడి డ్రోన్లు ధ్వంసమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే.. ఇరాన్ అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధం ఆరంభమైందని ప్రకటించింది. మిడిల్ ఈస్ట్ నుంచి అమెరికా తన దళాలను, మిలిటరీ సామాగ్రిని పూర్తిగా ఉపసంహరించుకునే వరకూ తమ ప్రతిదాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. US Iran War, Gulf Conflict Escalation, Amazon Data Center Attack Bahrain, Jordan US Military Base Strike, Middle East Tension

Publish Date: Jul 21, 2026 7:03PM

political-news-img

హై ప్రోటీన్ కోసం ఖరీదైన ఫుడ్స్ అవసరం లేదు! ఈ మినుముల పులగమే చాలు

హై ప్రోటీన్ కోసం ఖరీదైన ఫుడ్స్ అవసరం లేదు! ఈ మినుముల పులగమే చాలు మినుముల పులగం అనేది మన సంప్రదాయ ఆహారాల్లో ఎంతో విలువైనది. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్, బలం, శక్తిని అందించే సహజమైన ఆహారం. ముఖ్యంగా శారీరక బలహీనత, కండరాల బలం తగ్గడం, అలసట వంటి సమస్యలు ఉన్నవారికి ఇది మంచి పోషకాహారంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. చిటిబొట్ల మధుసూదన్ శర్మ గారు మినుముల పులగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను సులభంగా వివరించారు. మినుములలో ఉండే అధిక ప్రోటీన్ శరీర కండరాలను బలపరచడంలో సహాయపడుతుంది. అలాగే ఎముకల ఆరోగ్యానికి, శక్తి పెరగడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు: మినుముల పులగం ఆరోగ్యానికి ఎందుకు మంచిది? ఇందులో ఉండే పోషక విలువలు ఏమిటి? అధిక ప్రోటీన్ శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది? మినుముల పులగాన్ని ఎలా తయారు చేయాలి? ఎవరు తినాలి? ఎవరు పరిమితంగా తీసుకోవాలి? ఆయుర్వేదం ప్రకారం దీనిని తీసుకునే సరైన విధానం ఏమిటి? సహజమైన ఆహారంతో శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను తప్పకుండా చూడండి. గమనిక: ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఆయుర్వేద అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకుని మాత్రమే ఆహారంలో మార్పులు చేసుకోవాలి.

Publish Date: Jul 21, 2026 5:55PM

political-news-img

జెన్ జడ్ ఉద్యమానికి పరిమిత మద్దతు.. రాహుల్ చేజార్చుకున్న అవకాశం.!

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా యువత చేపట్టిన ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడంలో కాంగ్రెస్ వెనుకబడిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలకు వ్యతిరేకంగా ఇండియాలో జన్ జడ్ చేపట్టిన అతి పెద్ద ఆందోళనను అవకాశంగా మలచుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ కీలక నేత, లోక్ సభలో ప్రధాన పత్రిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ యువత ఉద్యమం విషయంలో స్పందించిన తీరు, ప్రకటించిన పరిమిత మద్దతు కాంగ్రెస్ కు అందివచ్చిన బంగారు అవకాశాన్ని ‘చే’జారేలా చేశాయన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఈ ఉధృత పోరాటాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లేందుకు యువత పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిన తరువాత కూడా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఆ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ వారికి మద్దతుగా కేంద్రాన్ని నిలదీయడంలోవిఫలమయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ వేదికగా మారుమోగుతున్న యువత ఉద్యమానికి ప్రధాన రాజకీయ పక్షాలన్నీ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆప్ అధినేత అరవిద్ కేజ్రీవాల్, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వంటి నేతలైతే.. స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహిస్తున్న యువతను కలిసి సంఘీభావం ప్రకటించారు. అయితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం జంతర్ మంతర్ నిరసన శిబిరానికి వచ్చి యువతకు సంఘీభావం తెలపలేదు. ఇదే విషయం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. పోలీసుల చర్యలు, ఉద్రిక్తతల మధ్య గాయపడిన కొందరు యువకులను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించినప్పటికీ రాహుల్ గాంధీ.. ఆందోళన జరుగుతున్న జంతర్ మంతర్ వద్దకు వెళ్ల లేదు. కేవలం మీడియా ముందు మాట్లాడటానికి, ప్రకటనలు విడుదల చేయడానికి మాత్రమే ఆయన పరిమితమయ్యారు. ప్రభుత్వంపై సమరశంఖం పూరించిన యువజనంతో నేరుగా మమేకం కాకుండా మద్దతు ప్రకటనలకు పరిమితం కావడం ద్వారా పొలిటికల్ మైలేజీకి ఈ ఉద్యమాన్ని ఊతం చేసుకోవడంతో కాంగ్రెస్ విఫలమైందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. దేశంలోనే అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న యువతలో నెలకొన్న ఆందోళనను, వారి ఆగ్రహాన్ని సరైన దిశలో నడిపించగలిగితే ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీకి అపారమైన రాజకీయ ప్రయోజనం లభించేది. అదే సమయంలో ఒక జాతీయ స్థాయి అగ్రనేత తమ మధ్యకు వస్తే, పోరాటం చేస్తున్న యువకులకు సైతం కొండంత అండ లభించేది. ఈ పరిణామం ఉభయతారకంగా ఇరు వర్గాలకు ఎంతో ఉపయోగపడేది. కానీ, రాహుల్ గాంధీ జంతర్ మంతర్‌కు వెళ్లకుండా దూరంగా ఉండటం వల్ల ఆందోళనకు కావాల్సిన స్థాయిలో ఊపు లభించకపోగా, కాంగ్రెస్‌కు దక్కాల్సిన మైలేజ్ కూడా దక్కకుండా పోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకుముందు రైతు చట్టాల రద్దు కోసం జరిగిన ఏడాది కాలపు రైతాంగ ఉద్యమంలో కానీ, మణిపూర్ హింసాకాండ బాధితుల పరామర్శలో కానీ రాహుల్ గాంధీ స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలకు అండగా నిలిచారు. పార్లమెంట్ లోపలా, వెలుపలా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ దూకుడు ప్రదర్శించారు. గతంలో అనేక సందర్భాల్లో ప్రజా సమస్యలపై స్వయంగా వీధుల్లోకి వచ్చిన రాహుల్, ఇప్పుడు అత్యంత కీలకమైన యువజన సమస్యపై మాత్రం జంతర్ మంతర్ ప్రాంగణానికి దూరంగా ఉండటం విచిత్రంగా కనిపిస్తోంది. మీడియా వేదికలపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినంత మాత్రాన క్షేత్రస్థాయిలో ఉద్యమ తీవ్రత పెరగదని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ వీధుల్లో జరుగుతున్న ఈ పోరాటం రాబోయే రోజుల్లో పార్లమెంట్ ముట్టడికి దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఈ దశలో ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలో నేరుగా పాల్గొనకపోతే, అధికార పక్షం ఈ ఆందోళనలను మరింత సులువుగా అణచివేసే ప్రమాదం ఉందని నిరసనకారులు భావిస్తున్నారు. అధికార ప్రతిపక్షాల నడుమ పార్లమెంట్ సమావేశాల్లో రసాభాస జరుగుతున్న నేపథ్యంలో, వెలుపల ఉవ్వెత్తున లేస్తున్న ప్రజా సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ప్రతిపక్షం చూపుతున్న మందకొడి వైఖరిపై సొంత పార్టీ వర్గాల్లో కూడా అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తమవుతోందని సమాచారం. ముందుముందు జరగబోయే రాజకీయ పరిణామాల దృష్ట్యా రాహుల్ గాంధీ తన వ్యూహాన్ని మార్చుకుని నేరుగా జంతర్ మంతర్ ఉద్యమ క్షేత్రంలోకి దిగుతారా లేదా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. యువత సమస్యలను కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం చేయకుండా, స్వయంగా వారితో కలిసి పోరాటంలో పాల్గొంటేనే నిజమైన ప్రతిపక్ష నేతగా ప్రజలలో మరింత నమ్మకం ఏర్పడుతుందని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. రాబోయే ఎన్నికలు, పార్లమెంట్ లోపల వెలుపల జరగబోయే పోరాటాల దృష్ట్యా కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఇప్పటికైనా స్పందించి ఉపాధి, ఉద్యోగ పోరాటంలో ఉన్న యువతకు నేరుగా అండగా నిలబడుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది. Jantar Mantar Protest Delhi, Rahul Gandhi Youth Protest, Leader of Opposition Strategy, Opposition Leaders Support

Publish Date: Jul 21, 2026 5:48PM

MOVIE NEWS