దేశానికి భరోసా ఇవ్వవలసిన యువత కుల పోరాటాలు చేస్తుంటే...

Publish Date:Sep 30, 2015

Advertisement

 

ప్రపంచ దేశాలతో పోల్చి చూసినట్లయితే భారతదేశానికి బాగా కలిసివచ్చే అంశం ఏమిటంటే మంచి నైపుణ్యం కలిగిన యువత అధిక సంఖ్యలో కలిగి ఉండటమే. ఇదే విషయం ప్రధాని నరేంద్ర మోడీ మొన్న తన అమెరికా పర్యటనలో కూడా చెప్పారు. కానీ హార్దిక్ పటేల్ వంటి యువకులు తమ నాయకత్వ లక్షణాలను, శక్తి యుక్తులను దేశాభివృద్ధి కోసం వినియోగించకుండా విచ్చినకర పనులకు ఉపయోగించడం చాలా శోచనీయం. పటేల్ కులస్తులకు రిజర్వేషన్ల కోసం అతను మొదలుపెట్టిన పోరాటం వలన దేశంలో అగ్రగామిగా ఉన్న గుజరాత్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోంది. ఆ ఉద్యమం వలన రాష్ట్రంలో కోట్లాది రూపాయల విలువ గల ఆస్తులు బుగ్గి పాలయ్యాయి . ఇంతవరకు 8మంది ప్రాణాలు కోల్పోయారు.

 

హార్దిక్ పటేల్ రాజేసిన ఈ కులచిచ్చు వలన ఒక్క గుజరాత్ రాష్ట్రం నష్టపోవడమే కాకుండా అదిప్పుడు దేశమంతటా క్రమంగా విస్తరిస్తోంది. ఇంతవరకు గుజరాత్ రాష్ట్రానికే పరిమితమయిన తన కుల పోరాటాన్ని ఇప్పుడు దేశమంతా విస్తరించాలనే ఉద్దేశ్యంతో హార్దిక్ పటేల్ ‘అఖిల భారతీయ పటేల్ నవనిర్మాన్ సేన’ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నాడు. కూర్మి, గుజ్జర్లు, మారాఠ, పటేల్ కులస్తులను తన ఉద్యమంలో భాగస్తులుగా చేసుకొని తన ఉద్యమాన్ని రాజస్థాన్, మహారాష్ట్రాలకు కూడా విస్తరించాలని ఆలోచిస్తున్నాడు. తమ సంస్థ యువత, రైతులు, కార్మికుల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేస్తుందని హార్దిక్ పటేల్ తెలిపాడు.

 

భారతదేశం వేగంగా అభివృద్ధి చెంది అగ్రరాజ్యాల సరసన నిలబడాలని ప్రయత్నాలు చేస్తుంటే హార్దిక్ పటేల్ వంటివారు తాము రాజకీయంగా ఎదిగేందుకు ప్రజల బలహీనతలను ఈవిధంగా వాడుకొని పైకి ఎదగాలని ప్రయత్నిస్తుండటం చాలా విచారకరం. హార్దిక్ పటేల్ తనకున్న గొప్ప నాయకత్వా లక్షణాలను, శక్తి యుక్తులను ఇటువంటి విచ్చినకరమయిన పనులకు ఉపయోగించే బదులు దేశాభివృద్ధికి ఉపయోగించి ఉండి ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది. అతను ఒక గొప్ప నాయకుడుగా దేశ ప్రజల దృష్టిలో ఎంతో గౌరవం పొందగలిగేవాడు. కానీ షార్ట్ కట్ పద్ధతిలో ఉన్నత స్థాయికి ఎదగడానికి తన శక్తి యుక్తులను ఉపయోగిస్తుండటం చాలా దురదృష్టకరం.

 

భారతదేశంలో ఇప్పటికే సవాలక్ష సమస్యలతో సతమతమవుతోంది. లోపలనుండి బయట నుండి నిత్యం అనేక సవాళ్లు ఎదుర్కోవలసి వస్తోంది. అనేక సమస్యలను ఎదుర్కొంటూనే అభివృద్ధి పధంలో ముందుకు సాగిపోతోంది. ఇటువంటి సమయంలో దేశానికి వెన్నెముకగా ఉండవలసిన యువతని హార్దిక్ పటేల్ కులం పేరుతో రెచ్చగొట్టి విచ్చిన్నకర, వినాశకర ఉద్యమాలకు ప్రేరేపించడం చాలా అవివేకం. దేశ ప్రజలందరూ తమకి చాలా దేశ భక్తి ఉందనే దృడంగా విశ్వసిస్తుంటారు. బహుశః హార్దిక్ పటేల్ కూడా అలాగే భావిస్తున్నాడేమో? కానీ అతను రాజేసిన చిచ్చుని దేశమంతటా విస్తరించాలని ప్రయత్నిస్తున్నాడు. దేశానికి ఎవరూ ఏ మేలు చేయక పోయినా పరువాలేదు కానీ నష్టం చేయకుండా ఉంటే చాలు.

 

పటేల్ కులస్థులకు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్, దేశంలో కనీసం ఒక్క పూట తిండికి బట్టకి కూడా నోచుకొని కటిక దరిద్రం అనుభవిస్తున్న నిరుపేదలు, చిన్నారులు కోట్ల మంది ఉన్నారనే సంగతి గ్రహిస్తే ఇటువంటి పోరాటాల గురించి ఆలోచించే వాడు కాదు. రైతుల కోసం పోరాడుతామని చెప్పుకొంటున్న హార్దిక్ పటేల్ దేశ వ్యాప్తంగా వేలాది మంది రైతులు ఆర్ధిక బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకొంటున్నారని గ్రహిస్తే, కులం కోసం కాక రైతుల కోసం పోరాడి ఉండేవాడు. కానీ తన ఉద్యమాలతో దేశానికి ఇంకా సమస్యలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాడు.

 

అగ్గి పుల్లతో దీపం వెలిగించి వెలుగులు పంచవచ్చును. అదే అగ్గిపుల్లతో కొంపకి నిప్పు పెట్టవచ్చును. అగ్గిపుల్ల వంటి హార్దిక్ పటేల్ ఇప్పుడు కొంపకు నిప్పుపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. కుల,మత, ప్రాంత, బాషా సంకుచిత బేధాల నుండి భారతావనికి విముక్తి కలిగించి భారతీయులు అందరినీ ఒక్క త్రాటిపైకి తెచ్చి దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించవలసిన ఈ తరుణంలో హార్దిక్ పటేల్ వంటి యువకులే కులం పేరుతో ప్రజల మధ్య అడ్డుగోడలు కడుతుండటం చాలా దురదృష్టకరం.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.