జ‌గ‌న్‌కు 'గుప్తా' గుబులు.. వైసీపీ నేత‌ల బెదురు.. మ‌రో ర‌ఘురామ?

Publish Date:Jan 24, 2022

Advertisement

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని ఎన్ని మప్పు తిప్పలు పెట్టాలో.. ఎలా రాజకీయంగా దెబ్బ కొట్టాలో అధికార వైయస్ జగన్ పార్టీకి తెలుసు.. అదే అధికార జగన్ పార్టీని ఎన్ని ముప్ప తిప్పలు పెట్టాలో.. రాజకీయంగా ఎలా దెబ్బ కొట్టాలో అదే పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ కె. రఘురామకృష్ణంరాజుకు తెలుసు.. ఆయన ఢిల్లీలో కూర్చుని ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ పార్టీలోని కీలక నేతలకు ఓ రేంజ్‌లో తలంటుతున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. చివరకీ ఈ విషయం జగన్‌ను అధికారంలోకి తీసుకు వచ్చిన ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌కు కూడా తెలుసన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇటు టీడీపీతో.. అటు రఘురామకృష్ణంరాజుతో రోజు వాతలు పెట్టించుకుంటుందన్నదీ పక్కా నిజం. కానీ జగన్ పార్టీని ఏకుతున్న వారి జాబితాలోకి ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సొమిశెట్టి సుబ్బారావు గుప్తా తాజాగా వచ్చి చేరారు. 

ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల గతేడాది డిసెంబర్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా జగన్ ప్రభుత్వ హయాంలోని చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల భవిష్యత్తులో ఫ్యాన్ పార్టీ కేడర్‌కు ఏర్పడే సమస్యలను సుబ్బారావు గుప్తా ఎత్తి చూపడం నాటి నుంచి..  సుబ్బారావు గుప్తాను మంత్రి బాలీనేని వాసన్న రైట్ హ్యాండ్ సుభానీ చావా బాదడం వరకు ఉన్న వీడియోలను ప్రపంచమంతా వీక్షించింది. 

సుబ్బారావు గుప్తాకు జరిగిందీ అన్యాయమని.. అర్యవైశ్య సంఘాలే కాదు.. జగన్ పార్టీలోని కేడర్ అంతా ముక్త కంఠంతో ఖండించింది. కానీ సుబ్బారావు గుప్తాకు మాత్రం న్యాయం జరగలేదు. అయితే తనకు జరిగిన అన్యాయంతోపాటు... జగన్ పార్టీకీ జరుగుతున్న చెడును సైతం.. వరుస ప్రెస్ మీట్లు పెట్టీ మరి మీడియా సాక్షిగా ఎండగడుతున్నాడీ సుబ్బారావు గుప్తా. 

తాజాగా సంక్రాంతి సందర్భంగా గుడివాడలో క్యాసినో వ్యవహారం.. గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని బూతుల పంచాంగం... కొడాలి నాని తీరుతో పార్టీలో ఓట్లు పోయే పరిస్థితి నెలకొందని.. కొడాలి నానికి పౌరసరఫరాల శాఖ తీసి.. హోం శాఖ ఇవ్వమంటూ స్వయంగా సీఎం జగన్‌కు సూచించడం.. అలాగే ఒంగోలు ఎమ్మెల్యే, జగన్ సమీప బంధువు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వద్ద...  అండర్ గ్రౌండ్‌లో ఏ పనులు ఏ విధంగా చేయాలి అనే విషయాలు చాలా చక్కగా నేర్చుకోవాలంటూ మంత్రి కొడాలి నానికి గుప్తా ఈ మీడియా సాక్షిగా సూచించడం.. అంతేకాదు బాలినేని శ్రీనివాసరెడ్డి.. విశ్వనటుడు కమలహాసన్‌లా చాలా చక్కగా యాక్షన్ చేస్తాడంటూ ఇదే ప్రెస్ మీట్‌ సాక్షిగా సుబ్బారావు గుప్తా చెప్పడం.. అక్కడితో ఆగకుండా..  వచ్చే 2024 ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ నుంచి పోటీకి దిగుతున్నట్లు సుబ్బారావు గుప్తా మరీ బల్లగుద్దీ చెప్పడంతో.. జగన్ పార్టీలో రచ్చ మొదలైందీ. ప్రతి పక్ష టీడీపీతో మనకు తిట్లు దండకం సరే సరి.. ఇక ఢిల్లీలో రఘురాముడు సెలవు రోజుల మినహా ప్రతి రోజూ తిట్ల బాణాలు విసరించుకోవడం పరిపాటిగా మారింది. 

కానీ ఈ రాష్ట్రంలోనే ఉంటూ.. అధికార పార్టీలోని లీడర్ నుంచి క్యాడర్ వరకు ఎవరినీ వదలకుండా ఓ రేంజ్‌లో దొబ్బేస్తున్న ఈ సుబ్బారావు గుప్తా తీరు మాత్రం తమకు మింగుడు పడడం లేదని.. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలోని కీలక నేతలు.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వద్ద మొర పెట్టుకున్నారని సమాచారం. ఈ అంశంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో తాను మాట్లాడతానని సదరు నేతలకు సీఎం జగన్ అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినా అధికార పార్టీలోకి కీలక నేతలకే తలపోటు, రక్త పోటు తెప్పిస్తున్న ఈ సుబ్బారావు గుప్తా మాత్రం మామూలోడు కాదోయి అనే టాక్ అయితే తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో వైరల్ కావడం విశేషం. ఏమైనా సుబ్బారావు గుప్తానా మజాకా.

By
en-us Political News

  
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన వాస్తవ వేదికలో దేశ రాజకీయ పరిస్థితుల
ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? దీనివల్ల ఇండియాలో కూడా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో వచ్చినట్లు ప్రజా విప్లవాలు వస్తాయా అనే చర్చలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ తీవ్రమైన రాజకీయ పరిణామాలపై ప్రముఖ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ లిబర్టీ అధినేత నలమోతు చక్రవర్తి తెలుగువన్ ఇంటర్వ్యూలో అనేక లోతైన విశ్లేషణ చేశారు.
ఇక తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు 2026 విషయానికి వస్తే.. ఈ సారి మహానాడు సరికొత్త రాజకీయ ఒరవడికి వేదికైంది. నెల్లూరులో భారీ ఎత్తున ఏర్పాటు చేయాలనుకున్న ఈ వేదికను, మోడీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా హైబ్రిడ్ మోడల్‌లోకి మార్చారు.
వైసీపీ అధినేత జగన్ తో తాడేపల్లి ప్యాలెస్ లో భేటీ అనంతరం బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన యథాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు.
ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాష్ట్రాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. రాబోయే ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
2023 మేలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం ఆయన తన పదవి వదులుకున్నారు. బెంగళూరులోని తన అధికారిక నివాసం కావేరి లో గురువారం (మే 27) ఏర్పాటు అల్పాహార విందు సమావేశంలో ఇదే విషయాన్ని తన క్యాబినెట్ సహచరులకు వెల్లడించారు.
ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కేవలం 31 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలైందని, అక్కడ తొలగించిన ఓట్ల సంఖ్య దీనికంటే ఎంతో ఎక్కువగా ఉందని చెప్పిన జగన్.. అలాగే.. తమిళనాడులో డీఎంకే కూటమి 17 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, అక్కడ కూడా 74 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా ఫలితాలు తారుమారయ్యేలా చేశారని ఎత్తి చూపారు. . ఈ భారీ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని జగన్ విమర్శించారు.
అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని అంటున్నారు. అధిష్టానం సూచనల మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఆ వెంటనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియ లాంఛనంగా ముగుస్తుందని అంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం అని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించారు.
ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.
ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.