వ్యాపారుల కొమ్ముకాస్తున్న పొగాకుబోర్డు
Publish Date:Apr 1, 2012
Advertisement
గుంటూరు పొగాకు బోర్డు వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల సంక్షేమానికి పాటుపడాల్సిన పోగాకుబోర్డు అందుకు భిన్నంగా వ్యాపారుల సంక్షేమానికి కృషిచేస్తున్నాదనే విమర్శలు వస్తున్నాయి. గుంటూరు పోగాకుబోర్డు పరధిలో 774 కంపెనీలు రిజిష్టరై ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ వేలంలో పాల్గొంటే పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. కానీ ఇవి ఒక సిండికేట్ గా మారాయి. ప్రస్తుతం కేవలం 10 కంపెనీలు మాత్రమే మార్కెట్ యార్డులో పొగాకును కొనుగోలు చేస్తున్నాయి. ఈ 10 కంపెనీలు కూడా తాము నిర్ణయించిన రేటుకే రైతులు తమకు పొగాకును విక్రయించాలని అంటున్నాయి. దీనిపై పొగాకు బోర్డుకు అనేక ఫిర్యాదులు వెళ్ళినా పెద్దగా ఫలితం లేకపోతుంది. బోర్డు చైర్మన్, ఐఎస్ అధికారి అయిన కమలవర్థనరావు వ్యాపారులతో కుమ్ముక్కయ్యారని పొగాకు బోర్డు మాజీ సభ్యుడు, వర్జీనియా పొగాకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు చుండూరి రంగారావు ఆరోపిస్తున్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన బాధ్యతా బోర్డు అధికారులకు ఉన్నప్పటికీ వారు తమకేమీ పట్ట్టనట్లు వ్యవహరించడం మంచి పధ్ధతి కాదన్నారు. ప్రస్తుతం వ్యాపారులు కుమ్ముక్కై నాణ్యమైన పొగాకుకు కూడా సరైన ధరలు ఇవ్వడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. నిజానికి ఒకవైపు రాష్ట్రంలో సిగరెట్ల ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. అయితే ముడి పొగాకు ధరలు మాత్రం క్రమంగా తగ్గుతున్నాయి. పొగాకు పంటవల్ల ఏటా కేంద్రానికి రూ. 15వేల కోట్లు, రాష్ట్రానికి రూ. 14 వందల కోట్ల ఆదాయం లభిస్తుంది. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతుల సంక్షేమానికి, వారి హక్కులు కాపాడటానికి పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు. పొగాకు వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి రైతు ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నప్పుడు పొగాకు బోర్డు ట్రెడ్ వింగ్ రంగంలో దిగి పొగాకును కొనుగోలుచేయాల్సి ఉంటుంది. అయితే బోర్డు దీనికి కూడా ఇష్టపడక పోవడంతో రైతులు తమ ఉత్పత్తులను తక్కువ రేటుకే విక్రయించుకోవలసి వస్తోంది.
http://www.teluguone.com/news/content/guntur-tobacco-board-24-13071.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





