మాచర్ల టిక్కెట్ కమ్మవారికే ఇవ్వాలి
Publish Date:Mar 27, 2012
Advertisement
గుంటూరుజిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ను తమ సామాజికవర్గానికే కేటాయించాలని కమ్మ కులానికి చెందిన నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు. 1989 తరువాత ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ను ఒకే సామాజికవర్గానికి ఇస్తూ వస్తున్నారని, దీనివల్ల పార్టీ బాగా బలహీనపడిందని కమ్మ సామాజిక వర్గ నేతలు అంటున్నారు. మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు కూడా వీరి వాదనతో ఏకీభవిస్తున్నట్లు తెలిసింది. అయితే పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిశీలనలో కొమ్మారెడ్డి చలమారెడ్డి, రిటైర్డ్ ఐజి సిబి నరసయ్య, సెంట్రల్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ నిమ్మగడ్డ దుర్గా శ్రీనివాస్, మండవ రవి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో దేశంపార్టీలో వర్గపోరు తీవ్రంగా ఉంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకుని పరాజయంపాలైన జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రస్తుతం నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇది కూడా ఆ పార్టీకి నష్టం కలిగిస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వర్గపోరు కారణంగా ఎవరివైపు మొగ్గుచూపాలో జిల్లా నాయకులు తేల్చుకోలేక అయోమయానికి గురవుతున్నారు. ఎవరిని ఎంపిక చేస్తే ఎవరు వ్యతిరేకిస్తారోనన్న భయం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నెలకొని ఉంది.
http://www.teluguone.com/news/content/guntur-district-macharla-assembly-constituency-24-12949.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





