విజయవాడ, తిరుపతికి గ్రేటర్ హోదా

Publish Date:May 14, 2026

Advertisement

విజయవాడ, తిరుపతి నగరాలకు గ్రేటర్ హోదా కల్పించడానికి ప్రభుత్వం వడవడిగా అడుగులు వేస్తోంది.  ఆ రెండు నగరాల విస్తీర్ణం పెంచేందుకు.. 10 మండలాల్లోని 138 గ్రామ పంచాయతీలను విలీనం చేసే అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తోంది. గ్రేటర్ విశాఖపట్నం పరిధిలోకి మరో 64 పంచాయతీలను విలీనం చేసే ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నది. రాష్ట్రంలో జనగణన పూర్తయ్యేలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి గ్రేటర్ నగరాల ప్రతిపాదనలపై ఇప్పటికే నిర్ణయం తీసుకోవాల్సింది..  కానీ జనగణన కారణంగా పక్కన పెట్టారు.

విజయవాడ గ్రేటర్‌ సిటీ ప్రతిపాదనలో భాగంగా ఆరు మండలాల్లో ఉన్న 75 పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేయాలని  2014-2019 మధ్య ప్రతిపాదనలు వచ్చాయి. కానీ గత ప్రభుత్వం ఈ ప్రతిపాదనల్ని పక్కన పెట్టింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తాజాగా ఈ ప్రతిపాదనల్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. విజయవాడ గ్రేటర్ కార్పొరేషన్ ఏర్పాటైతే కేంద్రం నుంచి నిధులు కూడా వస్తాయి. అందుకే ఈ ప్రక్రియన వేగవంతం చేయనున్నారు. విజయవాడలోకి ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న ఎన్నో గ్రామాలు, పట్టణాలు కలిసిపోయాయి. కానీ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల హోదాలోనే ఉడటంతో అభివృద్ధికి అవకాశం లేకుండా పోయింది. అందుకే విలీన ప్రక్రియను పూర్తిచేసి విజయవాడను గ్రేటర్‌ కార్పొరేషన్‌గా మార్చాలని భావిస్తున్నారు.

తిరుపతిని గ్రేటర్ కార్పొరేషన్‌గా ఏర్పాటు, గ్రామాల విలీనానికి సంబంధించి గత ఏడాది తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి మండలాల్లోని 64 గ్రామాలను గ్రేటర్ తిరుపతిలోకి విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటికే మంగళం, అవిలాలలు తిరుపతి నగరంలో కలిసిపోయాయి. అవి పంచాయతీలుగా ఉండటంతో అభివృద్ధి పనులు నిలిపోయాయి. ప్రతిపాదించిన గ్రామాలతో పాటుగా నగరంలో కలిసిన ప్రాంతాలతో గ్రేటర్‌ తిరుపతి నగరపాలక సంస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. విలీన ప్రక్రియపై త్వరలోనే క్లారిటీ వస్తుంది అంటున్నారు.

గ్రేటర్‌ విశాఖపట్నంలోకి 64 గ్రామాలను విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఈ గ్రామాలు ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల్లో ఉన్నాయి. తాజాగా ప్రతిపాదించిన గ్రామాల్లో 60శాతం నగరంలో కలిసిపోయాయి. అందుకే ఈ పంచాయతీలను గ్రేటర్ పరిధిలోకి తీసుకుంటే మరింత అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా గ్రామాల విలీనం చాలా ముఖ్యమని చెబుతున్నారు. గతంలో అనకాపల్లి, భీమిలి, గాజువాక మున్సిపాలిటీలు గ్రేటర్ విశాఖపట్నంలో విలీనమైన తర్వాతే అభివృద్ధి చెందాయని చెబుతున్నారు. మొత్తం మీద విశాఖకు తోడుగా విజయవాడ, తిరుపతి గ్రేటర్ సిటీలుగా మారబోతున్నాయి.

By
en-us Political News

  
ప్రత్యేకంగా బీఆర్‌టీఎస్ కారిడార్‌తో పాటు రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్లను అందుబాటులోకి తెచ్చారు. రవాణాతో పాటే విద్యుత్తు, తాగునీటి సరఫరా, గ్యాస్ నెట్‌వర్క్, డ్రైనేజీ, కమ్యూనికేషన్ కేబుళ్ల నిర్వహణ కోసం భూగర్భ మౌలిక వసతులు సమకూర్చారు.   పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు,   గ్రీన్‌బెల్ట్ నిర్మాణంతో ఆధునిక  రవాణా వ్యవస్థకు ఈ రోడ్డు దర్పణం పడుతుంది.  
దక్షిణాసియా ప్రాంతంలో అల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద అనుబంధ సంస్థల   దాడుల సామర్థ్యం గణనీయంగా పెరుగుతోందని హెచ్చరించింది. ఈ ఉగ్ర సంస్థలు  రసాయన, జీవాయుధాలను సేకరించి.. వాటితో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయనీ, కుట్రలు పన్నుతున్నాయనీ వెల్లడించింది.
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవిపై బిసిసిఐ స్పష్టత ఇచ్చింది. జట్టు ట్రాన్సిషన్ ఫేజ్, ఆటగాళ్ల గాయాల దృష్ట్యా గంభీర్‌ను 2027 వరల్డ్ కప్ వరకు కోచ్‌గా కొనసాగించేందుకు బిసిసిఐ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
షేక్ రషీద్ అహ్మద్ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, ఆ ఉగ్ర సంస్థ కేంద్ర సలహా మండలి సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి వేదికను పంచుకున్నారు. ఆ సందర్భంగా ప్రసంగించిన ఆయన తాను లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు బానిసనని బాహాటంగా ప్రకటించారు.
జడేజా కెరీర్ ముగింపునకు చేరువవుతున్న వేళ టీమిండియా తదుపరి స్పిన్ లీడర్ ఎవరు కుల్దీప్ యాదవ్ విరాట్, రోహిత్, గిల్ కెప్టెన్సీలలో సాధించిన రికార్డులు, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక సవాళ్లు మరియు మురళీ కార్తీక్ విశ్లేషణపై సమగ్ర కథనం.
2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనే విషయంపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మ్యాథ్యూ హేడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్‌మ్యాన్ ఏజ్, ఫిట్‌నెస్, రికార్డులతో కూడిన పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి!
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో విమాన కనెక్టివిటీ మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇ ఇదిలా ఉండగా, విమానాశ్రయా నికి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు ఆగస్టు 15 నుంచి ఎలక్ట్రిక్‌ బస్సుల సేవలను కూడా ప్రారంభిం చనున్నారు.  
ఇటీవలే   బిడ్డకు జన్మనిచ్చిన కరోలిన్ లెవిట్..  తన పిల్లలు కుటుంబ సభ్యులతోనూ ఎక్కువ సమయం గడిపేందుకు ప్రెస్ సెక్రటరీ పదవి నుంచి వైదొలగాలని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
వెలుగును చంద్రుడు పూర్తిగా అడ్డుకోవడంతో భూమిపైకి సూర్యకాంతి కనిపించకుండా పోయింది.  గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో  ప్రాంతాల్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం స్పష్టంగా దర్శనమిచ్చింది. ఈ ప్రాంతాల్లో ఏకంగా 2 నిమిషాల 18 సెకన్ల పాటు   అక్కడి ప్రజలు పట్టపగలే చిమ్మ చీకట్లు అలుముకున్న అద్భుతాన్ని ఆస్వాదించారు.  
మేడ్చల్ జిల్లా పరిధిలో జరిగిన సదరు కూల్చివేతలకు రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి అనుమతులు,  ఉత్తర్వులు ఇవ్వలేదనీ,   తమ శాఖ సమ్మతి లేకుండానే జిల్లా వ్యాప్తంగా దాదాపు నలభై ప్రదేశాల్లో హైడ్రా బలగాలు కూల్చివేతలు సాగించాయని కలెక్టర్ హైకోర్టు ధర్మాసనం ముందు వెల్లడించారు. 
అమెరికా సైనిక సామర్థ్యాలను దగ్గరుండి పరిశీలించే అవకాశం దక్కిందన్న ఆయన తాము ఊహించిన దాని కంటే.. అమెరికా సైన్యం చాలా బలహీనంగా ఉందన్నారు.
గత విచారణల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌కు పంపిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంపై న్యాయమూర్తి.. ఈసారి ఎలాంటి సాంకేతిక విఘాతాలు లేదా డెలివరీ సమస్యలు తలెత్తకుండా పక్కాగా నోటీసులు అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.