విజయవాడ, తిరుపతికి గ్రేటర్ హోదా

Publish Date:May 14, 2026

Advertisement

విజయవాడ, తిరుపతి నగరాలకు గ్రేటర్ హోదా కల్పించడానికి ప్రభుత్వం వడవడిగా అడుగులు వేస్తోంది.  ఆ రెండు నగరాల విస్తీర్ణం పెంచేందుకు.. 10 మండలాల్లోని 138 గ్రామ పంచాయతీలను విలీనం చేసే అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తోంది. గ్రేటర్ విశాఖపట్నం పరిధిలోకి మరో 64 పంచాయతీలను విలీనం చేసే ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నది. రాష్ట్రంలో జనగణన పూర్తయ్యేలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి గ్రేటర్ నగరాల ప్రతిపాదనలపై ఇప్పటికే నిర్ణయం తీసుకోవాల్సింది..  కానీ జనగణన కారణంగా పక్కన పెట్టారు.

విజయవాడ గ్రేటర్‌ సిటీ ప్రతిపాదనలో భాగంగా ఆరు మండలాల్లో ఉన్న 75 పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేయాలని  2014-2019 మధ్య ప్రతిపాదనలు వచ్చాయి. కానీ గత ప్రభుత్వం ఈ ప్రతిపాదనల్ని పక్కన పెట్టింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తాజాగా ఈ ప్రతిపాదనల్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. విజయవాడ గ్రేటర్ కార్పొరేషన్ ఏర్పాటైతే కేంద్రం నుంచి నిధులు కూడా వస్తాయి. అందుకే ఈ ప్రక్రియన వేగవంతం చేయనున్నారు. విజయవాడలోకి ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న ఎన్నో గ్రామాలు, పట్టణాలు కలిసిపోయాయి. కానీ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల హోదాలోనే ఉడటంతో అభివృద్ధికి అవకాశం లేకుండా పోయింది. అందుకే విలీన ప్రక్రియను పూర్తిచేసి విజయవాడను గ్రేటర్‌ కార్పొరేషన్‌గా మార్చాలని భావిస్తున్నారు.

తిరుపతిని గ్రేటర్ కార్పొరేషన్‌గా ఏర్పాటు, గ్రామాల విలీనానికి సంబంధించి గత ఏడాది తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి మండలాల్లోని 64 గ్రామాలను గ్రేటర్ తిరుపతిలోకి విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటికే మంగళం, అవిలాలలు తిరుపతి నగరంలో కలిసిపోయాయి. అవి పంచాయతీలుగా ఉండటంతో అభివృద్ధి పనులు నిలిపోయాయి. ప్రతిపాదించిన గ్రామాలతో పాటుగా నగరంలో కలిసిన ప్రాంతాలతో గ్రేటర్‌ తిరుపతి నగరపాలక సంస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. విలీన ప్రక్రియపై త్వరలోనే క్లారిటీ వస్తుంది అంటున్నారు.

గ్రేటర్‌ విశాఖపట్నంలోకి 64 గ్రామాలను విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఈ గ్రామాలు ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల్లో ఉన్నాయి. తాజాగా ప్రతిపాదించిన గ్రామాల్లో 60శాతం నగరంలో కలిసిపోయాయి. అందుకే ఈ పంచాయతీలను గ్రేటర్ పరిధిలోకి తీసుకుంటే మరింత అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా గ్రామాల విలీనం చాలా ముఖ్యమని చెబుతున్నారు. గతంలో అనకాపల్లి, భీమిలి, గాజువాక మున్సిపాలిటీలు గ్రేటర్ విశాఖపట్నంలో విలీనమైన తర్వాతే అభివృద్ధి చెందాయని చెబుతున్నారు. మొత్తం మీద విశాఖకు తోడుగా విజయవాడ, తిరుపతి గ్రేటర్ సిటీలుగా మారబోతున్నాయి.

By
en-us Political News

  
మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
పశ్చిమ బెంగాల్ ఫలితాలు వెలువడిన అనంతరం శిబ్ పూర్ లో బీజేపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఆ విజయోత్సవ ర్యాలీపై బాంబులు, తుపాకులతో షమీమ్ అహ్మద్ దాడి జరిపించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై కేసు కూడా నమోదైంది.
కేంద్ర భద్రతా సంస్థలు, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ బృందాలు అత్యవసర చర్యలు చేపట్టాయి. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే దానిని రన్‌వే నుంచి దూరంగా ఉన్న ఐసోలేషన్ బేకు తరలించారు. ప్రయాణికులు మరియు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ఈ పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర 110.50 రూపాయలకు చేరింది. అలాగే డీజిల్ ధర రూ. 98.70 కి చేరింది.ఇక ఏపీలోని గుంటూరులో పెట్రోల్‌ లీటర్ రూ. 112.24, డీజిల్ రూ. 100.34కి చేరింది.
హాజీ అలీ నౌక సోమాలియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాకు వెళ్తుండగా బుధవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది.
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పెట్ బషీరాబాద్ పోలీసులు భగీరథ్‌పై ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఆరోపణలను భగీరథ్ తరపున కోర్టులో వాదించిన న్యాయవాది, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి తోసిపుచ్చారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు పెట్టారని ఆయన వాదించారు.
ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్ మధ్య కీలక మ్యాచ్ ప్రారంభానికి ముందు అర్షదీప్ తిలక్ వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అమర్యాదగా సంబోధించారు. పంజాబ్ కింగ్స్ కు అత్యంత కీలకమైన మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ సంఘటన చోటు చేసుకుంది.
టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. ఈ 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఒక బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. ముంబై బ్యాటర్ బ్యాటర్ తిలక్ వర్మ 75 నాటౌట్ తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
2023లో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఆరోపణలతో కేసు ప్రాధాన్యం సంతరించుకుంది.
జిల్లాల పర్యటనలలోనూ కాస్ట్ కటింగ్ పాటించాలని, మెజారిటీ మీటింగులను వర్చువల్‌గా నిర్వహించాలని, ప్రెజెన్స్ అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమలు చేయాలని కేబినెట్ తీర్మానించింది. అలాగే, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల ఉష్ణోగ్రత 24 నుంచి 27 మధ్యనే ఉంచాలని నిర్ణయించింది.
సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే ప్రక్రియను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కమిటీ బాధితుల వివరాలను పరిశీలించి, సకాలంలో వారికి చెల్లింపులు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.
దేశవ్యాప్త విద్యా వ్యవస్థలో అత్యంత కీలకమైన పరీక్షల్లో ఇటువంటి అవకతవకలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఇది మోడీ ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు.
ఈ నెల 16వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు చేరుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.