ఎంత లేటయితే.. అంత గ్రేటు....!
Publish Date:Sep 12, 2012
Advertisement
ఒకప్పుడు ఏమోకాని ఇప్పుడు మాత్రం పేదవాడికి సెంటు భూమి అందిందంటే అందరికీ ఇట్టే తెల్సిపోతుంది! అదే ఏ పారిశ్రామికవేత్తో రాజకీయనాయకుడో వేల ఎకరాలు అందుకున్నాడనుకోండి (పేరుకు కంపెనీలు కోసమని చెప్పడం రివాజు) దానిగురించి ఎప్పటికోగాని తెలియదు. అప్పటికి సదరు వ్యక్తులు పెట్టిన పెట్టుబడి లాభం రానే వస్తుంది. ఇలా వుంటుంది నేటి పాలకన్యాయం. వివిధ రాష్ట్రాలకు సంబంధించి 24 లక్షల ఎకరాల ‘భూదాన’ భూములకు సంబంధించిన రికార్డులు గల్లంతవడంతో దీన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈనెల 20న ఢల్లీిలో జరగనున్న రాష్ట్రాల రెవెన్యూ మంత్రుల సమావేశంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. వినోభా భావే 1951లో చేపట్టిన భూదానోద్యమంలో 48 లక్షల ఎకరాల భూములను ‘భూదానం’ కింద భూములు లేని పేదలకు దానం చేయగా, అందులో సగం భూములు మాత్రమే ఇప్పటివరకు పేదలకు పంపిణీ అయ్యాయని, అలాగే మిగిలిన భూముల సమస్యలు సంక్లిష్టమైనవని గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి జైరాం రమేష్ అన్నారు. ఇన్ని సంవత్సరాలు గడచినా కొన్ని భూముల్లో వున్న సంక్లిష్టమైన విషయాలను ఇంతవరకూ పరిష్కరించలేదంటే లోపం ఎక్కడుంది? పాలకుల్లోనా? ఆ భూముల్లోనా? ఇచ్చిన దాతల్లోనా? తీసుకున్న గ్రహీతల్లోనా..?! ఇదంతా చూస్తే ‘నే ఎక్కే బండి జీవితకాలం లేటు..’ అన్న సామెత గుర్తుకువస్తోంది కదూ...!
http://www.teluguone.com/news/content/government-lands-24-17314.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





