రిఫైనరీ పేరుతొ 2500 ఎకరాలకు టెండరుపెట్టిన జి ఎమ్ ఆర్
Publish Date:Mar 30, 2012
Advertisement
రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల భూదాహం నానాటికి పెరిగిపోతోంది. చాలామంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటు పేరుతొ ఇప్పటికే వేలాది ఎకరాలు సేకరించారు. తాజాగా జి ఎమ్ ఆర్ సంస్థ తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపల్లి, తొండంగి మండలాల్లో రిఫైనరీ ఏర్పాటుచేస్తామంటూ ప్రభుత్వం నుంచి 2500 ఎక్లా భూమిని సేకరించింది. ఇక్కడ 25వేల కోట్ల రూపాయలతో రిఫైనరీ ఏర్పాటు చేయబోతున్నట్లు జి ఎమ్ ఆర్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. నిజానికి 25వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసే రిఫైనరీకి 700 నుంచి 900 ఎకరాల భూమి సరిపోతుందని నిపుణులు అంటున్నారు కానీ జి ఎమ్ ఆర్ సంస్థ ఏకంగా 2500 ఎకరాల భూమికి టెండరు పెట్టింది. ఈ భూముల్లో అత్యధికం చిన్న చిన్న రైతుల నుంచి సేకరించిందే కావడం విశేషం. భూములు కోల్పోయిన రైతులకు నామమాత్ర నష్టపరిహారం మాత్రమే ఇస్తున్నారు. అంతే తప్ప వీరు ఏర్పాటు చేయబోయే పరిశ్రమల్లో వారికి పెద్దగా ఉపాధి అవకాశాలు కూడా లభించవు. పారిశ్రామికవేత్తలకు అవసరమున్నా లేకపోయినా ఇలా వేలాది ఎకరాల భూములను ఇవ్వడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వాన్ పిక్ పేరుతొ లక్షలాది ఎకరాల భూములను నెల్లూరు, ఒంగోలు తీర ప్రాంతం మధ్య పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అప్పగించింది. అప్పనంగా భూములను పొందిన ఈ పారిశ్రామిక వేత్తలెవరూ ఇప్పటిదాకా అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయలేడు. అయితే తమ పేరిట ఉన్న భూములను కబ్జా కాకుండా ఉండటానికి కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఫెన్సింగ్, బౌండరీ వాల్స్ మాత్రం నిర్మిస్తున్నారు. పేదల భూములను తక్కువ ధరకే కాజేసిన వీరు ఆ భూములు తమ పేరిట బదిలీకాగానే అన్యాక్రాంతం కాకుండా చేర్యాలు తీసుకుంటున్నారు. అంతేకాని పరిశ్రమల ఏర్పాటుకు మాత్రం ముందుకు రావడం లేదు. జి ఎమ్ ఆర్ సంస్థకు 2500 ఎకరాల భూమిని కట్టబెట్టడంపై విమర్శలు వస్తున్నా నేపథ్యంలో ఆ సంస్థకు చెందిన స్వచ్చంద సంస్థ ప్రజలకు సేవ చేస్తామంటూ ముందుకు వస్తోంది. అయితే ఈ సేవలపట్ల కూడా స్థానికులు ఆసక్తి చూపించడం లేదు.
http://www.teluguone.com/news/content/gmr-group-24-13044.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





