Publish Date:Aug 30, 2022
కొన్ని సంఘటనలు ఎంతో ఆశ్చర్యపరుస్తాయి. వయసుతో నిమిత్తం లేకుండా ఆయా సంఘటనల్లో పిల్ల లూ హీరోలయిపోతుంటారు. ఊహించని సంఘటనల్లో ఒక్కసారిగా మెరుపులాంటి ఆలోచనలతో వెంటనే స్పందించడం అనేది అవతలివారికి ఎంతో మేలు చేస్తుంది. గెవిన్ తన తల్లిని కాపాడాడు.
పదేళ్ల గెవిన్ ఏం చదువుతున్నాడు, బడికి సరిగా వెళుతున్నాడా, గుడ్ స్టూడెంటా.. అనే ప్రశ్నలతో చుట్టు పక్కలవారూ, పక్కంటి పిన్నిగారూ వేధించలేదు. గెవిన్ ని తమ ఊరు హీరో అనేశారు. పిల్లవాడయినా ఎంత వేగంగా, చురుగ్గా ఆలోచించాడమ్మా.. అనుకున్నారు వెనకింటి బామ్మగారు, ఎదురింటి బాబాయి గారూ .. పిల్లడు పదేళ్లవాడయితేనేమి.. వాళ్ల డాడీ ఇవ్వాల్సిన రక్షణ వాడే చేసేడన్నారంతా.
ఓక్లహామాలో ఓ చిన్న కుటుంబం. తల్లీ, పిల్లడూ స్విమింగ్పూల్లో ఆడుకోవడం ఓ సరదా. కానీ మొన్నీ మధ్య తల్లి ఒక్కతే స్విమింగ్పూల్లో దిగింది. పిల్లడు ఎక్కడో ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఆమె మామూ లుగానే పాడుకుంటూ తిరుగుతూంది. పిల్లాడి కోసం ఎదురుచూస్తోంది. పిలుద్దామనే అనుకుంది. కానీ అంతలోనే హఠాత్తుగా ఆమె పల్టీకొట్టింది. ఊపిరాడనంత పనయింది. నీళ్లు మింగేసింది. నీటిలోకి దిగిపోయేలోగానే అదృష్టం ఆమెను రక్షించింది. సరిగ్గా అప్పుడే ఆమె పదేళ్ల పిల్లవాడు గెవిన్ అటుగా వచ్చాడు. తల్లి అరుపులు విని పరుగున స్విమ్మింగ్పూల్లోకి అమాంతం దూకేశాడు. చిత్రమేమంటే ఆమెను బయటికి లాగేయగలిగాడు. అదీ ఆమె మొహాన్ని నీటి పైకి పట్టుకుని పూల్ చివర ఉన్న మెట్లమీద వరకూ తీసుకువచ్చి ఆమెను పైకి లాగేడు. అంతలో తండ్రి పరుగున వచ్చాడు.
ఇదెలా సాధ్యం.. అన్న ప్రశ్నకంటే పిల్లాడు ప్రదర్శించిన తెలివినే అందరూ మెచ్చకున్నారు. నీటిలో మునిగిపోతున్న తల్లి అరవగానే దూకడం సరే. కానీ అంత మనిషిని వాడు మెడపట్టుకుని తలను నీటి పైనే ఉంచేట్టు చేసి తీసుకురావడమే గొప్ప విషయమని అన్నారంతా. మనూళ్లో అయితే దీన్నే దైవేచ్ఛ అనేవారు. ఏమయినప్పటికీ ఓక్లహామాలో గెవిన్ నివాస ప్రాంతంలో మాత్రం గొప్ప హీరోగా అందరి మెప్పూ పొందుతున్నాడు.
ఆ తల్లి ఫేస్బుక్లో తన గెవిన్ తనకు దేవుడు అంటూ రాసింది. వాడివల్లే మళ్లీ ఊపిరిపీల్చుతున్నా నన్న ది. వాడు నాకు మరో జన్మని ప్రసాదించాడన్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gevin-saved-his-mother-25-142939.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.