Publish Date:Mar 13, 2024
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బర్రెలక్క అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ ఎన్నికలలో ఆమె విజయం సాధించలేదు. అలాగని అధికార పార్టీ అభ్యర్థికి చెమట్లు పట్టించేంత పోటీ కూడా ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో ఆమెకు కేవలం 15 వేల ఓట్లు వచ్చాయి. అయితే తన పోటీ ద్వారా ఆమె అధికార పార్టీ పునాదులను కదిలించింది. ఆమె ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గం నుంచే పోటీ చేసినా, ఆమె పోటీ చేయడానికి దారి తీసిన పరిస్థితులు, ఆమె లేవనెత్తిన అంశాల ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది. ముఖ్యంగా తెలంగాణలో అప్పటి బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయం గురించిన చర్చ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో జరిగింది. ఆ ప్రభావం బీఆర్ఎస్ గెలుపు అవకాశాలను దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ ప్రభావితం చేసింది. ఫలితంగా బీఆర్ఎస్ ఓటమి పాలై ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇప్పుడిదంతా ఎందుకు అంటారా? అక్కడికే వస్తున్నాం..
ఇప్పుడు ఏపీ ఎన్నికలలో జగన్ పాలనలో అన్యాయాలు, అక్రమాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలకు బాధితులై న నలుగురు అసెంబ్లీ పోరులో నిలబడుతున్నారు. పరిశీలకులు ఈ నలుగురూ కూడా ఏపీ ఎన్నికలపై తమదైన ప్రభావాన్ని చూపగలరని విశ్లేషిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బర్రెలక్క పోటీ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అక్కడి అధికార పార్టీపై ప్రతికూలంగా పడిందో.. ఏపీ ఎన్నికలలో ఈ నలుగురి పోటీ అలాగే జగన్ సర్కార్ పై జనంలో ప్రతికూలత మరింత పెరిగేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు. ఇంతకీ తెలంగాణలో బర్రెలక్క చూపినట్లుగా ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ప్రొది కావడానికి దోహదపడే ఆ నలుగురూ ఎవరంటారా?.. ఆ విషయం చెప్పుకునేముందు గత ఎన్నికలలో జగన్ విజయానికి దోహదపడిన బాబాయ్ హత్య, కోడికత్తి దాడి, జగన్ కు స్వయానా సోదరి అయిన షర్మిల ప్రచారం. ఇప్పుడు ఆ ముగ్గురూ జగన్ కు వ్యతిరేకంగా ఎన్నికల బరిలో నిలబడనున్నారు. వీరితో పాటుగా గత ఎన్నికల ముందు హత్యకు గురైన వివేకా కుమార్తె సునీత, ఆమె తల్లి సౌభాగ్యమ్మ కూడా జగన్ కు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ ఇరువురిలో ఎవరో ఒకరు కడప పార్లమెంటు బరిలో నిలవనున్నారు. ఇక వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి కూడా జగన్ ప్రత్యర్థిగా పులివెందుల నుంచి పోటీలో ఉంటానని చెబుతున్నారు.
ఈ నలుగురే తెలంగాణ ఎన్నికలలో బర్రెలక్క పోటీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాగైతే ఓటమి బాటను చూపిందో.. వీరు జగన్ సర్కార్ కూడా అదే బాట పట్టడానికి దోహదపడతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఔను కోడికత్తి శీను జై భీమ్ పార్టీలో చేరి కోనసీమ జిల్లా అమలాపురం నుంచి పోటీలో నిలవనున్నారు. వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ కడప లోక్ సభ అభ్యర్థిగా బరిలో దిగడం దాదాపు ఖరారైంది. అలాగే జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి జగన్ సర్కార్ ను చెరిగి పారేస్తున్నారు. ఆమె కూడా ఎన్నికల బరిలో నిలుచుంటారు. చివరిగా దస్తగిరి కూడా జైభీమ్ పార్టీలో చేరి పులివెందుల బరిలో దిగేందుకు రెడీ అయిపోయారు. వీరు నలుగురూ గెలిచినా, ఓడినా వీరి పోటీ ప్రభావం మాత్రం రాష్ట్రం మొత్తం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. జగన్ అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాష్టీకానికి వీరు నలుగురూ కూడా బాధితులే కావడం ఇందుకు కారణమని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/four-barrelakkas-in-ap-elections-39-171984.html
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.