చంద్రబాబుకు ఇక తిరుగు లేదు!

Publish Date:Mar 13, 2024

Advertisement

ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది.  ఎత్తులు, పైఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో   పార్టీలు ఓట‌ర్‌ల‌ను బాగానే ఎంట‌ర్‌టైన్ చేస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల ముంగిట పార్టీలన్నీ ఫుల్ బిజీ అయిపోయాయి.  ప్రతిపక్ష తెలుగుదేశం గతంలో ఎన్నడూ లేనంత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. చంద్ర‌బాబు ఎత్తుగ‌డ‌తో  షెడ్యూల్‌కు ముందే మ్యాజిక్ ఫిగ‌ర్ అందుకుని టీడీపీ కూట‌మి విజ‌యం వైపు ప‌రుగులు పెడుతోంది.  

ఏపీ ఎన్నిక‌ల ముఖ‌చిత్రం చూస్తే తెలుగుదేశం దూకుడు మామూలుగా లేదని తేటతెల్లమౌతోంది.  తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవ‌డ‌మే కాదు వ్యూహాత్మ‌కంగా వెళ్ళుతూ గెలుపు దిశ‌గా ప‌రుగులు పెడుతోంది.  గతానికి భిన్నంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. వైసీపీని ఓడించేందుకు అందరినీ కలుపుకునిపోతున్నారు. జగన్ ను గద్దె దించడమే ధ్యేయంగా టీడీపీ కూట‌మి అడుగులు ధృఢంగా ప‌డ్డాయ‌ని చెప్ప‌వ‌చ్చు.     

తెలుగుదేశం పార్టీ  144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నది. 
భారతీయ జనతా పార్టీ  10 అసెంబ్లీ, ఆరు ఎంపీ స్థానాల్లో బరిలోకి దిగనుంది. 
జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో  రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది.
బిజెపి ప్ర‌భావం = (6 x 7) 42 + 10 = 52
జ‌న‌సేన ప్ర‌భావం (2 x 7) 14 + 21 = 35 = 87 
మ్యాజిక్ ఫిగ‌ర్ 88 దాదాపుగా రీచ్ అయిన‌ట్లే... అంటే టీడీపీ గెలుపు అనేది ఇక్కడే  స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.  అయితే ఎంత మెజార్టీ అనేదే తెలాల్సి వుంది.
టీడీపీ కూట‌మి భారీ విజ‌యాన్ని కైవ‌సం చేసుకోబోతోందనేది తేలిపోయింది.  
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ తరపున వై.ఎస్. షర్మిల ప్రచారం చేశారు.  అయితే ఈ దఫా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా వై.ఎస్. షర్మిల  బాధ్యతలు చేపట్టారు. వాస్త‌వానికి గ‌తంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు  వైఎస్ఆర్‌సీపీ వైపు మళ్లింది.  అయితే  వైసీపీ వైపు మళ్లిన ఓటు బ్యాంకును తిరిగి తమ పార్టీ వైపునకు తెచ్చేందుకు  కాంగ్రెస్ వ్యూహలు రచిస్తున్నది.   కాంగ్రెస్ కు ఓట్ల శాతం పెరిగితే   వైసీపీకి భారీగా న‌ష్టం వాటిల్లుతుంది. 
రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో మొత్తం 62 అసెంబ్లీ స్థానాలున్నాయి.  గత ఎన్నికల్లో  టీడీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితమయింది.  ఈసారి రాయలసీమలో జగన్ ను దెబ్బకొట్టి కనీసం ముప్పయి స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో  పనిచేస్తున్నారు. 
గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, హిందూపురరంతో పాటు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం నుంచి మాత్రమే టీడీపీ విజయం సాధించింది. 
కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాలేదు.  అయితే ఈసారి ఖచ్చితంగా అక్కడ గెలిచి జగన్ ను దెబ్బతీయాలన్న ప్లాన్ లో  తెలుగుదేశం ఉంది.  నాలుగు జిల్లాల్లో అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఈసారి  తెలుగుదేశం అధిక స్థానాలను సాధించేందుకు అవకాశాలున్నాయని పరిశీలకులు  అంచనా వేస్తున్నారు.
 ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు తెలుగుదేశంకు కంచుకోట. అక్కడ వైసీపీని సులువుగానే దెబ్బతీయవచ్చు. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో ఎటూ జనసేనతో పొత్తు ఉంది కాబట్టి పెద్దగా ఫోకస్ పెట్టాల్సిన పనిలేదు.  ఆ పనిని తన పార్ట్‌నర్ పవన్ కల్యాణ్ చూసుకుంటారు. 

ఇక గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పది నుంచి పదిహేను స్థానాలకు పైగా సాధిస్తే అధికారం చేతుల్లోకి వచ్చి పడినట్లే. అందుకోసమే ఆయన గెలుపునకు అవకాశం ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు అక్కడ ఎక్కువ నిధులను కుమ్మరించేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉందంటున్నారు.  మొత్తం మీద చంద్రబాబు ఇటు కులాల వారీగా, ప్రాంతాల వారీగా లెక్కలు వేసుకుని మరీ బరిలోకి దిగారు.

1999లో బిజెపితో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. సక్సెస్ అయ్యింది.  2004లో మాత్రం పొత్తు పెట్టుకుని ఓడిపోయింది.  2009లో టిఆర్ఎస్, వామపక్షాలతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది. అప్పుడు కూడా ఓటమి ఎదురైంది. 2014లో బిజెపితో పొత్తు పెట్టుకుంది. గెలుపు సాధించింది.  అయితే తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకునే సమయంలో ఓట్ల బదలాయింపు సక్రమంగా జరిగినప్పుడు మాత్రం ఆ పార్టీ గెలుపు బాట పట్టింది. లేనప్పుడు ఓటమి ఎదురైంది. 2009లో ఉమ్మడి ఏపీలో టిడిపి మహాకూటమితో కాంగ్రెస్ ను ఢీ కొట్టింది.  టిఆర్ఎస్, వామపక్షాలతో కలిసి పోటీ చేసింది.  కానీ ఓటు శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టింది.

అంటే ఓట్ల బదలాయింపు జరగలేదు. టిడిపి సీట్ల పరంగా మెరుగుపడినా..  భాగస్వామ్య పక్షాల నుంచి ఆశించిన స్థాయిలో ఓట్ల బదలాయింపు జరగక అధికారాన్ని అందుకోలేకపోయింది.  2004లో 47 స్థానాలతో ఉన్న టిడిపి  2009 నాటికి 92 స్థానాలకు చేరుకుంది.  కానీ 2004లో 37.59% ఉన్న టిడిపి ఓటు బ్యాంక్  2009 నాటికి 28.12 కు పడిపోయింది.  భాగస్వామ్య పక్షాల నుంచి ఓట్ల బదలాయింపు జరగకపోవడమే ఇందుకు కారణం.  నాడు ఓట్ల బదలాయింపు సక్రమంగా జరిగి ఉంటే టిడిపి ఆధ్వర్యంలోని మహాకూటమి అధికారంలోకి వచ్చి ఉండేది. దీంతో గ‌త అనుభ‌వాల్ని దృష్టిలో పెట్టుకొని ఓట్ల బదలాయింపు చంద్ర‌బాబు దృష్టి పెట్టారు.  2009 ఎన్నికల గుణపాఠంతో ఏ చిన్న అవకాశాన్ని కూడా ప్రత్యర్థులకు విడిచిపెట్టడం లేదు.

By
en-us Political News

  
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.