హైదరాబాద్ లో రిపబ్లిక్ వేడుకల ప్లేస్ ఎందుకు మారిందో  తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

Publish Date:Jan 25, 2022

Advertisement

జెండా వందనం ఇంత మొక్కుబడిగా జరుగుతుందని మన స్వాతంత్య్ర సమర యోధులు, జాతీయ నాయకులు గతంలో ఎవరూ ఊహించి ఉండరు. వారిప్పుడు ఎవరూ లేరు గనక బతికిపోయారు. లేకపోతే ఇప్పటి మన నాయకుల నిర్లక్ష్య వైఖరికి నిలువెల్లా కుంగిపోయి ఉండేవారు. జాతీయ జెండాను చూస్తేనే దేశభక్తితో పులకించిపోతారు పసిపిల్లలు. ఏడాదికి రెండుసార్లు వచ్చే ఈ జాతీయ పండుగ దినాల కోసం పాఠశాలల్లో అయితే దాదాపు 15 రోజుల ముందు నుంచే ప్రిపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ రోజున పిల్లలకు ఓ రెండు చాక్లెట్లో, ఒక జిలేబీనో ఇస్తారు. అంతదానికే వారు ఆ 15 రోజులూ దేశభక్తి గీతాలాపనలతో, ఆట పోటీల్లో పర్ఫామెన్స్ కోసం ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. అసలు ఏ పండుగకూ లేనంత జోష్ ఈ జాతీయ పర్వ దినాలకే వస్తుందంటే అతిశయోక్తి కాదు. కానీ అదేం విచిత్రమో తెలంగాణ ప్రభుత్వం మాత్రం గణతంత్ర వేడుకలను చాలా లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. 

తెలంగాణలో స్వాతంత్య్ర వేడుకలను గోల్కొండ కోటలో, గణతంత్ర వేడుకలను పబ్లిక్ గార్డెన్ లో జరుపుకుంటున్నారు. సంప్రదాయాన్ని అనుసరించి ఆగస్టు 15న ముఖ్యమంత్రి జెండా ఎగరేస్తుండగా, జనవరి  26 నాడు గవర్నర్ పతాకావిష్కరణ చేస్తున్నారు. అయితే ఈసారి గవర్నర్ తమిళిసై గణతంత్ర ఉత్సవ  ఏర్పాట్లపై  రాజ్ భవన్ అధికారులతో సమావేశమయ్యారు. కోవిడ్-19 విజృంభిస్తున్న దృష్ట్యా అందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను వారు సూచించారని, ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకుంటూ గణతంత్ర వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందని ఓ ట్వీట్ చేశారు. 

ఈ విషయం మీదనే రాష్ట్ర ప్రజలందరూ విస్తుపోతున్నారు. దేశంలో గణతంత్ర వేడుకలన్నీ ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అటు ఢిల్లీలో కేంద్రం కూడా పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. జెండావిష్కరణ సమయంలో స్వల్ప మార్పులు మినహా, ఉత్సవానికి ఇచ్చే ప్రాధాన్యతను ఎక్కడా తగ్గించకపోవడం గమనించాలి. అసలింకా ఢిల్లీలోనే పెద్దసంఖ్యలో కోవిడ్ కేసులు పెరుగుతుండడం కూడా గమనించాలంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ రాష్ట్రంలో కూడా కేసులు ఒకరోజు తగ్గుతూ, ఒకరోజు పెరుగుతూ కనిపిస్తున్నాయి. అయినా ఎలాంటి కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారు. మరోవైపు సినిమా హాళ్లు నడుస్తున్నాయి. మందు దుకాణాల్లో జోష్ ఎక్కడా తగ్గడం లేదు. అన్ని షాపింగ్ మాల్స్ తెరిచే ఉంటున్నాయి. వ్యాపార సంస్థలన్నీ వ్యాపారం చేసుకుంటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులంతా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ఫుల్లుగానే వెళ్తున్నాయి. ఇక్కడెక్కడా కనిపించని కోవిడ్-19 ఒక్క గంటసేపు నిర్వహించుకునే గణతంత్ర వేడుకలనే టార్గెట్ చేసిందా అంటూ సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు. 

అది కూడా ఎప్పుడూ నిర్వహించుకునే పబ్లిక్ గార్డెన్ లో కాకుండా ఈసారి గవర్నర్ ఉండే రాజ్ భవన్ లోనే జెండా వందనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పతాకావిష్కరణ తరువాత గవర్నర్ తమిళిసై తన అధికారిక పర్యటనలో భాగంగా పాండిచ్చేరి వెళ్లిపోతున్నారు. ఉదయం 9 గంటలకే ఆమె ప్రత్యేకమైన హెలికాప్టర్ లో బయల్దేరతారని, ఈ లోగానే జెండావందన కార్యక్రమం పూర్తవుతుందని సమాచారం. రాష్ట్రంలో జరిగే గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి, పలువురు సీనియర్ బ్యూరోక్రాట్లు హాజరవడం ఆనవాయితీ. రాష్ట్రంలో జరిగే ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం, అనుమతి లేకుండా జరగదు కదా. దేశమంతా ఎంతో గర్వంతో వేడుకలు జరుగుతున్న క్రమంలో కోవిడ్ పేరు చెప్పి తెలంగాణలో మాత్రం ఇంత నిర్లక్ష్యం చేస్తారా అన్న ప్రశ్నలు అన్ని వర్గాల ప్రజల నుంచీ వినిపిస్తున్నాయి. స్వాతంత్య్రాన్ని, గణతంత్రాన్ని తూతూ మంత్రంగా జరుపుకునే దారుణమైన పరిస్థితి కన్నా దయనీయమైంది ఈ దేశానికి మరోటి లేదని ఈ దేశాన్ని ప్రేమించే ఆబాలగోపాలం ఆక్రోశిస్తోంది. దీనికి ఎవరు, ఏ రకంగా జవాబు చెప్తారో చూడాలి. 

By
en-us Political News

  
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.