హైదరాబాద్ లో రిపబ్లిక్ వేడుకల ప్లేస్ ఎందుకు మారిందో  తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

Publish Date:Jan 25, 2022

Advertisement

జెండా వందనం ఇంత మొక్కుబడిగా జరుగుతుందని మన స్వాతంత్య్ర సమర యోధులు, జాతీయ నాయకులు గతంలో ఎవరూ ఊహించి ఉండరు. వారిప్పుడు ఎవరూ లేరు గనక బతికిపోయారు. లేకపోతే ఇప్పటి మన నాయకుల నిర్లక్ష్య వైఖరికి నిలువెల్లా కుంగిపోయి ఉండేవారు. జాతీయ జెండాను చూస్తేనే దేశభక్తితో పులకించిపోతారు పసిపిల్లలు. ఏడాదికి రెండుసార్లు వచ్చే ఈ జాతీయ పండుగ దినాల కోసం పాఠశాలల్లో అయితే దాదాపు 15 రోజుల ముందు నుంచే ప్రిపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ రోజున పిల్లలకు ఓ రెండు చాక్లెట్లో, ఒక జిలేబీనో ఇస్తారు. అంతదానికే వారు ఆ 15 రోజులూ దేశభక్తి గీతాలాపనలతో, ఆట పోటీల్లో పర్ఫామెన్స్ కోసం ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. అసలు ఏ పండుగకూ లేనంత జోష్ ఈ జాతీయ పర్వ దినాలకే వస్తుందంటే అతిశయోక్తి కాదు. కానీ అదేం విచిత్రమో తెలంగాణ ప్రభుత్వం మాత్రం గణతంత్ర వేడుకలను చాలా లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. 

తెలంగాణలో స్వాతంత్య్ర వేడుకలను గోల్కొండ కోటలో, గణతంత్ర వేడుకలను పబ్లిక్ గార్డెన్ లో జరుపుకుంటున్నారు. సంప్రదాయాన్ని అనుసరించి ఆగస్టు 15న ముఖ్యమంత్రి జెండా ఎగరేస్తుండగా, జనవరి  26 నాడు గవర్నర్ పతాకావిష్కరణ చేస్తున్నారు. అయితే ఈసారి గవర్నర్ తమిళిసై గణతంత్ర ఉత్సవ  ఏర్పాట్లపై  రాజ్ భవన్ అధికారులతో సమావేశమయ్యారు. కోవిడ్-19 విజృంభిస్తున్న దృష్ట్యా అందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను వారు సూచించారని, ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకుంటూ గణతంత్ర వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందని ఓ ట్వీట్ చేశారు. 

ఈ విషయం మీదనే రాష్ట్ర ప్రజలందరూ విస్తుపోతున్నారు. దేశంలో గణతంత్ర వేడుకలన్నీ ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అటు ఢిల్లీలో కేంద్రం కూడా పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. జెండావిష్కరణ సమయంలో స్వల్ప మార్పులు మినహా, ఉత్సవానికి ఇచ్చే ప్రాధాన్యతను ఎక్కడా తగ్గించకపోవడం గమనించాలి. అసలింకా ఢిల్లీలోనే పెద్దసంఖ్యలో కోవిడ్ కేసులు పెరుగుతుండడం కూడా గమనించాలంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ రాష్ట్రంలో కూడా కేసులు ఒకరోజు తగ్గుతూ, ఒకరోజు పెరుగుతూ కనిపిస్తున్నాయి. అయినా ఎలాంటి కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారు. మరోవైపు సినిమా హాళ్లు నడుస్తున్నాయి. మందు దుకాణాల్లో జోష్ ఎక్కడా తగ్గడం లేదు. అన్ని షాపింగ్ మాల్స్ తెరిచే ఉంటున్నాయి. వ్యాపార సంస్థలన్నీ వ్యాపారం చేసుకుంటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులంతా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ఫుల్లుగానే వెళ్తున్నాయి. ఇక్కడెక్కడా కనిపించని కోవిడ్-19 ఒక్క గంటసేపు నిర్వహించుకునే గణతంత్ర వేడుకలనే టార్గెట్ చేసిందా అంటూ సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు. 

అది కూడా ఎప్పుడూ నిర్వహించుకునే పబ్లిక్ గార్డెన్ లో కాకుండా ఈసారి గవర్నర్ ఉండే రాజ్ భవన్ లోనే జెండా వందనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పతాకావిష్కరణ తరువాత గవర్నర్ తమిళిసై తన అధికారిక పర్యటనలో భాగంగా పాండిచ్చేరి వెళ్లిపోతున్నారు. ఉదయం 9 గంటలకే ఆమె ప్రత్యేకమైన హెలికాప్టర్ లో బయల్దేరతారని, ఈ లోగానే జెండావందన కార్యక్రమం పూర్తవుతుందని సమాచారం. రాష్ట్రంలో జరిగే గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి, పలువురు సీనియర్ బ్యూరోక్రాట్లు హాజరవడం ఆనవాయితీ. రాష్ట్రంలో జరిగే ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం, అనుమతి లేకుండా జరగదు కదా. దేశమంతా ఎంతో గర్వంతో వేడుకలు జరుగుతున్న క్రమంలో కోవిడ్ పేరు చెప్పి తెలంగాణలో మాత్రం ఇంత నిర్లక్ష్యం చేస్తారా అన్న ప్రశ్నలు అన్ని వర్గాల ప్రజల నుంచీ వినిపిస్తున్నాయి. స్వాతంత్య్రాన్ని, గణతంత్రాన్ని తూతూ మంత్రంగా జరుపుకునే దారుణమైన పరిస్థితి కన్నా దయనీయమైంది ఈ దేశానికి మరోటి లేదని ఈ దేశాన్ని ప్రేమించే ఆబాలగోపాలం ఆక్రోశిస్తోంది. దీనికి ఎవరు, ఏ రకంగా జవాబు చెప్తారో చూడాలి. 

By
en-us Political News

  
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.