Publish Date:Apr 23, 2022
ఏప్రిల్ 24, 2021. తెలుగుజాతి గుర్తుంచుకునే రోజు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా తెలుగువారైన ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన రోజు. నేటికి సరిగ్గా ఏడాది. ఈ ఏడాది కాలంలో ఎన్నో మైలురాళ్లు. ఎన్నో చారిత్రాత్మక తీర్పులు. తెలుగువారి సత్తాను.. సామర్థ్యాన్ని.. సీజేఐగా ఘనంగా చాటారు జస్టిస్ రమణ. అందుకే, ఆయన తెలుగు నేలపై అడుగుపెట్టినప్పుడల్లా ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. రమణపై ఎనలేని ఆదరాభిమానాలు చూపుతున్నారు. ఈ ఏడాది కాలంలో సీజేఐ రమణ ఇచ్చిన తీర్పులను ఓసారి గుర్తు చేసుకుంటే...
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టిన 3 రోజుల్లోనే.. మథుర జైలులో అనారోగ్యంతో మగ్గుతున్న జర్నలిస్టు సిద్దిఖీని ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించాలని ఆదేశించడంతో ఒక్కసారిగా మీడియా అటెన్షన్ నెలకొంది. అది మొదలు.. పలు సంచలన తీర్పులతో ఆయన నిత్యం మీడియాలో హెడ్లైన్గా నిలుస్తున్నారు.
తాజాగా ఢిల్లీలోని జహంగీర్పురిలో ఇళ్లను, దుకాణాలను బుల్డోజర్లతో ధ్వంసం చేస్తుంటే.. వాటిని వెంటనే నిలిపివేయించి బాధితులకు ఊరట నిచ్చారు. యూపీ, లఖీంపూర్ఖేరీలో 8 మంది రైతుల మరణానికి కారకుడైన కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు చేసి న్యాయం పవర్ ఏంటో చూపించారు. ఇక, యడాపెడా వాడేస్తున్న రాజద్రోహ చట్టాన్ని ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఏముందని కేంద్రాన్ని ప్రశ్నించి నోటీసులు జారీ చేయడం.. పెగాసస్ స్పైవేర్పై విచారణ కమిటీని నియమించడం.. జస్టిస్ రమణకే సాధ్యమంటున్నారు.
న్యాయవ్యవస్థలో ఖాళీలు నింపేందుకు కీలక చర్యలు చేపట్టారు సీజేఐ రమణ. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. సుప్రీంకోర్టులో ఉన్న 9 ఖాళీలను గత ఆగస్టులోనే భర్తీ చేయించారు. అందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులే ఉన్నారు. ఎన్వీ రమణ హయాంలో హైకోర్టులకు 126 మంది న్యాయమూర్తులను నియమించారు. వీరిలో 20 శాతం మహిళలే. తెలంగాణ హైకోర్టు బెంచ్లో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచారు. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రరీ సెంటర్ ఏర్పాటుకు కర్త, కర్మ, క్రియ ఆయనే.
ఇక, ప్రజలు రాస్తున్న లేఖలపై సీజేఐ రమణ స్పందన స్పూర్తిదాయకంగా నిలుస్తోంది. తనకు లేఖ రాసిన కేరళ విద్యార్థినికి జవాబు రాసి ఆమెకు రాజ్యాంగ ప్రతిని బహూకరించడం.. తెలంగాణ చిన్నారి వైష్ణవి రాసిన లేఖకు స్పందించి.. ఆమె ఊరుకు స్కూలు బస్సు వచ్చేలా చర్యలు తీసుకోవడం.. విడిపోయిన తెలుగు దంపతులు 20 ఏళ్ల తర్వాత కలిసి జీవించేలా వారితో తెలుగులోనే మాట్లాడి ఒప్పించడం.. ఇలా ఏడాది కాలంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో తనదైన ముద్ర వేశారు తెలుగుతేజం జస్టిస్ ఎన్వీ రమణ.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/first-anniversary-of-nv-ramana-as-cji-39-134823.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది