పంజాబ్ కు వరుసగా ఐదో ఓటమి.. ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం
Publish Date:May 14, 2026
Advertisement
ధర్మశాల వేదికగా పంజాబ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. ఐపీఎల్ లో పంజాబ్ కు ఇది వరుసగా ఐదో ఓటమి. ఐపీలఓ 2026 టోర్నీని ఘనంగా వరుస విజయాలతో ప్రారంభించిన పంజాబ్ ఆ తరువాత వరుసగా పరాజయాలను ఎదుర్కొంది. ఇక తాజాగా గురువారం (మే 14)న ముంబైతో జరిగిన మ్యాచ్ లో పోరాడి ఓడింది. దీంతో పంజాబ్ ప్లేఆఫ్స్ కు చేరు అవకాశాలు సంక్షిష్టంగా మారాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. ముంబై ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. ఈ 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఒక బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. ముంబై బ్యాటర్ బ్యాటర్ తిలక్ వర్మ 75 నాటౌట్ తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకు ముందు పంజాబ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ 32 బంతుల్లో 57 పరుగులు చేసి రాణించాడు. ఆ తరువాత చివరిలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 17 బంతుల్లో 38 పరుగులు చేయడంతో స్కోరును 200కు చేరింది. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 39 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి పంజాబ్ ను కట్టడి చేశాడు. ఇక 201 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ముంబైకి ఓపెనెర్ రియాన్ రికిల్టన్ కేవలం 23 బంతుల్లో 48 పరుగులు చేసి అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే రికిల్టన్ ఔటయిన తరువాత స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయి ముంబై ఒత్తిడిలో పడింది. కానీ తిలక్ వర్మ తన అద్భుత బ్యాటింగ్ తో మ్యాచ్ ను ముంబై వైపు తిప్పేశాడు. కేవలం 33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి విల్ జాక్స్ పదమూడు బంతుల్లో 25 నాటౌట్ సహకారం అందించాడు. టోర్నీ నుంచి ఇప్పటికే ఎలిమినేట్ అయిన ముంబై ఇండియన్స్ ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ అవకాశాలను దెబ్బతీసింది. పంజాబ్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ ప్లేఆఫ్స్ కు చేరాలంటే చెమటోడ్చాల్సిందే.
http://www.teluguone.com/news/content/fifth-consecutive-defeat-for-punjab-36-219826.html





