దేశంలో తగ్గుతున్న జనాభా.. దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటు స్థానాలకు ఎసరు!

Publish Date:Jun 18, 2022

Advertisement

గంపెడు పిల్లల్ని కని సుఖ సంతోషాలతో జీవించండి అనే పాత కాలం రోజులు పోయాయి. ఒకరిద్దురు పిల్లలతో ఆనందంగా జీవించండి, ఆర్థిక ఇబ్బందులకు దూరంగా ఉండండి అంటూ పెద్దలు తమ పిల్లల్ని దీవించే కాలం వచ్చేసింది. అలాగే యువతలో కూడా కుటుంబ భవిష్యత్, ఆర్థిక పురోగతి వంటి విషయాలలో స్పష్టతతో ముందుకు అడుగు వేస్తున్నారు. ఈ కారణంగా దేశంలో జనాభా పెరుగుదల నియంత్రణలోకి వచ్చింది. అయితే ఇది ఉత్తరాదితో పోలిస్తే.. దక్షిణాదిలోనే ఒకింత ఎక్కువగా ఉంది. ఇక దేశంలో ఉత్తరాది ఆధిపత్యం అధికం, దక్షిణాది పట్ల చిన్న చూపు అన్న భావన దక్షిణాది వారిలో చాలా కాలం నుంచీ ఉంది. జాతీయ భాష అంటూ హిందీని నెత్తిన రుద్దుతున్నారనీ, హిందీ రాని వారిని అంటే ముఖ్యంగా దక్షిణాది వారిని దేశంలో రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారని దక్షిణాది వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొదటి నుంచీ ఉంది. జనాభా నియంత్రణ దేశ ప్రగతిని అత్యంత కీలకమంటూ గతంలో కేంద్రం విస్తృతంగా ప్రచారం చేసింది. కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది.

దక్షిణాది రాష్ట్రాలలోనే కుటుంబ నియంత్రణ ప్రచారానికి ఉత్తరాదితో పోలిస్తే ఎక్కువ స్పందన కనిపించింది. అదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు జాతీయ రాజకీయాలలో ప్రాతినిథ్యం తగ్గిపోయే ముప్పును తెచ్చింది. షెడ్యూల్ ప్రకారం 2026లో నియోజకవర్గాల పునర్విభజన అంటూ జరిగితే లోక్ సభలో దక్షిణాది ప్రాతినిథ్యం గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన 2026లో జరగాల్సి ఉంది. అలా జరిగితే దక్షిణాది నుంచి లోక్ సభ స్థానాలు తగ్గిపోయే అవకాశం ఉంది.  అదే సమయంలో ఉత్తరాదిలో లోక్ సభ స్థానాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. 2026లోజనాభా ప్రాతిపదికన నియోజకవర్గ పునర్విభజన జరిగితే.. ఐదు దక్షిణాది రాష్ట్ర్రాలలో కలిపి 26లోక్ సభ నియోజకవర్గాలు తగ్గిపోతాయి. అదే ఉత్తరాది రాష్ట్రాలలో 31 స్థానాలు పెరుగుతాయి. ప్రపంచంలోనే జనాభా వేగంగా పెరుగుతున్న దేశంగా ఇంత కాలం అందరూ చెబుతూ వచ్చారు. అనతి కాలంలోనే జనాభా విషయంలో భారత్ చైనాను దాటేసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తుందనీ అంచనాలు వేశారు. కానీ వాస్తవంగా భారత్ లో జనాభా తగ్గుతూ వస్తోంది. అది కూడా పూర్తిగా అన్ ప్రపోర్షనేట్ గా ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ, కుటుంబ సంక్షేమం అంటే అమలు చేసిన పథకాలు దేశంలో జనాభా నియంత్రణ విషయంలో ప్రజలలో ఏదో ఒక మేరకు చైతన్యం తీసుకురావడమే. ఉత్తరాదితో పోలిస్తే ఈ చైతన్యం దక్షిణాదిలో  ఎక్కువగా వచ్చింది. దీంతో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో జనాభా నియంత్రణ విజయవంతంగా  అమలైంది.

అయితే కేంద్రం మాత్రం అన్ని గ్రాంటులు, నిధులు, కార్యక్రమాలను జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు కేటాయించడంతో కుటుంబ నియంత్రణ పకడ్బందీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగింది. ఈ విషయాన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలు సందర్భాలలో కేంద్రానికి నిరసన రూపంలో తెలియజేశారు. కుటుంబ నియంత్రణ అమలు చేసిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సింది పోయి.. నిధుల్లో కేతేమిటని కూడా వారు పలు సందర్భాలలో నిలదీశారు. అదలా ఉంచితే..   ఇప్పుడు జనాభా ప్రకారం పునర్విభజన జరిగితే లోక్‌ సభ సీట్ల స్వరూపం పూర్తిగా మారుతుంది. ఉత్తరప్రదేశ్‌ , బీహార్‌‌‌‌, మధ్యప్రదేశ్‌ ,మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలకు సీట్లు బాగా పెరుగుతాయి. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ , ఒడిశా,తెలంగాణ సీట్లు తగ్గుతాయి.   1971లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినపుడు పెద్ద రాష్ట్రాల్లో ఒక్కో లోక్‌ సభ నియోజకవర్గాని కి ఓటర్లు 10 లక్షల నుంచి 10.6 లక్షల వరకు ఉన్నారు. ఈ 40 ఏళ్లలో సీట్ల సంఖ్య మారలేదుగానీ ఓటర్లు పెరిగారు. 2016 జనాభానే ప్రాతిపదికగా తీసుకుంటే రాజస్థాన్‌ లో ఒక్కో ఎంపీ 30 లక్షల మందికి ప్రాతినిధ్యం  హిస్తున్నాడు. అదే తమిళనాడులో ఇది 18 లక్షలు  మాత్రమే. 

జాతీయు కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో సంతానోత్పత్తి రేటు పడిపోయింది. ఆ సర్వే ప్రకారం 2015-16లో 2.2గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2019-21 నాటికి 2.0కు పడిపోయింది.   పునఃస్థాపన స్థాయి సంతానోత్పత్తి  అనేది జనాభా ఒక తరం నుండి మరొక తరానికి సరిగ్గా భర్తీ చేసే స్థాయిని సూచిస్తుంది, తద్వారా స్థాయి తగినంత కాలం పాటు కొనసాగితే సున్నా జనాభా పెరుగుదలకు  దారి తీస్తుంది. 1992-93, 2019-21 మ‌ధ్య కాలంలో దేశంలో  టోటల్ ఫెర్టలిటీ రేటు 3.4  నుంచి 2కు ప‌డ‌పోయింది.  ఈ విధంగా టిఎఫ్ ఆర్ ప‌డిపోవ‌డ‌మ‌న్న‌ది  ప‌ట్ట‌ణాలలో 1992-93లో 2.7 వుండ‌గా అది 2019-21లో అది 1.6కి ప‌డిపోయింది. అయితే  ప్ర‌జ‌లు నివ‌సించే  ప్రాంతంతో సంబంధం లేకుండా  ఈ సంతానోత్స‌త్తి రేటు   20-24 మధ్య వయస్కులలో  అధికంగా ఉంటుందనీ, ఆ తరువాత వయస్సు పెరిగే కొద్దీ   క్రమంగా  త‌గ్గిపోతుంద‌ని  ఎన్ ఎఫ్ హెచ్ స‌ర్వేల‌న్నీ తేల్చాయి.  మ‌హిళ‌ల్లో సంతానోత్ప‌త్తి రేటు త‌గ్గ‌డానికి   అనేక కార‌ణాల్లో అ విద్య కూడా ఒక‌టి. ప్రాధ‌మిక పాఠ‌శాల చ‌దువు లేని మ‌హిళ‌ల కంటే చ‌దువుకున్న‌ వారి  సంతానోత్ప‌త్తి రేటు  త‌క్కువ‌గా వుంద‌ని తేలింది. చ‌దువు లేని మ‌హిళ‌ల్లో  టోటల్ ఫెర్టిలిటీ రేటు 2.8 వుండ‌గా,   చ‌దువుకున్న మ‌హిళ ల్లో  అది 1.8 గా వుంది.  

  దేశంలో మ‌తాల వారీగా చూస్తే, హిందూ మ‌హిళ‌ల్లో టిఎఫ్ ఆర్ 1.94, ముస్లిం మ‌హిళ‌ల్లో 2.2, క్రిస్టియ‌న్ మ‌హిళ‌ల్లో 1.88, బౌద్ధుల్లో 1.39గా వుంది. కాగా గ్రామీణ  ప్రాంతాల్లో ఈ రేటు 1992-93లో 3.7 వుండ‌గా అది 2019-21 కి 2.1 కి చేరుకుంది.   ప్ర‌స్తుతం భార‌త్ జ‌నాభా సుమారు 140 కోట్లు వుంది. ఇది  2100 నాటికి 109 కోట్లు త‌గ్గే అవ‌కాశం వుంది సర్వే పేర్కొంది ఇందుకు సంతానోత్ప‌త్తి రేటు ప‌డిపోవ‌మే ప్ర‌ధాన కార‌ణంగా నివేదిక‌లు స్ప‌ష్టం చేశాయి.  భారతదేశంలో స్త్రీల విద్య వ్యాప్తి చెందడంతో గర్భనిరోధక పద్ధతులు పెరుగుతాయని భావిస్తున్నారు. 2021లో భార‌త్‌లో సంతానోత్ప‌త్తి 2.38 శాతం వుండ‌గా 2100 నాటికి 1.6 శాతానికి ప‌డిపోవ‌చ్చు!   2030 నాటికి  ప్ర‌పంచం మొత్తం మీద వాత‌వ‌ర‌ణంలో పెను మార్పులు సంభ‌విస్తాయ‌ని, ప్ర‌జ‌లు అస్స‌లు త‌ట్టుకోలేని వేడిమి వుంటుంద‌ని, స్వ‌చ్ఛ‌మ‌యిన నీరు ల‌భించ‌క ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌వ‌ల‌సి వ‌స్తుంద‌ని వాతావ‌ర‌ణ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అంతేగాక క్ర‌మేపీ ప్ర‌జ‌ల్లో  రోగ‌ నిరోధ‌క శ‌క్తి క్షీణిస్తుంద‌నీ అన్నారు. ఫ‌లితంగా ప్ర‌జ‌లు జ‌బ్బుల బారిన పడి  నానా ఇబ్బందులూ ఎదుర్కొంటారు. 

1960లో భార‌త మ‌హిళ‌లు తమ జీవిత‌కాలంలో క‌నీసం ఆరుగురు పిల్ల‌ల్ని   క‌న‌గ‌లిగే సామర్థ్యంతో ఉండేవారు.   2005  నాటికి ఇది ముగ్గురు పిల్లలకు పరిమితమైపోయింది.  ఇదే ట్రెండ్ కొనసాగితే జాతీయ రాజకీయాలలో దక్షిణాది ప్రాతినిథ్యం నామామాత్రపు స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. జనాభా ప్రాతిపదికతో పాటు ప్రాంతీయ ప్రాతినిథ్యానికి గండి పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాలలో కూడా జనాభా పెరుగుదల రేటు మందగించినప్పటికీ.. అది దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ.  
 

By
en-us Political News

  
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.