ఉపవాసంతో కేన్సర్‌ మాయం

Publish Date:Dec 14, 2016

Advertisement

 


‘లంకణము పరమౌషధం’ అంటుంటారు పెద్దలు. కాకపోతే ఇదేదో జ్వరం, అజీర్ణం, కఫంలాంటి చిన్నాచితకా వ్యాధులకి సంబంధించిన సూత్రం అనుకునేవారం. కానీ ఏకంగా కేన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధులలోనూ ఉపవాసం ఉపశమనాన్ని కలిగిస్తుందంటే ఆశ్చర్యం కలుగక మానదు. కానీ నమ్మక తప్పదు!

 

ALL అనగా

బ్లడ్‌ కేన్సర్‌ అన్న పేరు వింటేనే చాలు ఒళ్లు జలదరిస్తుంది. మనుషుల్ని బయపెట్టి, బాధపెటట్టి కొంచెంకొంచెంగా మృత్యువుకి చేరువచేసే ఈ తరహా కేన్సర్‌ పగవాడికి కూడా రావద్దు భగవంతుడా అనిపిస్తుంది. లుకేమియా అనేది ఆ బ్లడ్ కేన్సర్‌లో ఒక రకం. అందులో Acute lymphoblastic leukemia అనే తరహా వ్యాధి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

 

తెల్లరక్తకణాలని మార్చేసి

ALL బారిన పడ్డ రోగులలో తెల్లరక్తకణాలు దెబ్బతింటాయి. దీని వలన మనిషిలో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. తరచూ ఏదో ఒక ఇన్ఫెక్షన్‌ బారినపడే ప్రమాదం పెరిగిపోతుంది. ఉపయోగం లేని తెల్లరక్తకణాలు విచ్చలవిడిగా పెరిగిపోవడం వల్ల ఎర్రరక్తకణాలు, ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో రక్తహీనత, నీరసం, రక్తస్రావం, జ్వరంలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

 

పిల్లలలో అధికం

ALL బ్లడ్‌ కేన్సర్‌ పిల్లలలో ఎక్కువ. లుకేమియా బారిన పడ్డ ప్రతి నలుగురు పిల్లలలోనూ ముగ్గురిలో ALL తరహా లుకేమియానే కనిపిస్తుంటుంది. అదృష్టవశాత్తూ 95 శాతం మందిలో కీమోథెరపీ మొదలుపెట్టిన నెలరోజులలోపే ఈ వ్యాధి తగ్గుముఖం పడుతుంది. అయితే వీరిలో దాదాపు 20 శాతం సందర్భాలలో వ్యాధి మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఉంది. కానీ ఉపవాసం ద్వారా ALLని సమూలంగా నాశనం చేసే అవకాశం ఉందేమో పరిశీలించేందుకు కొన్ని ఎలుకల మీద ప్రయోగం చేశారు పరిశోధకులు.
ఫలితం కనిపించింది

 

ప్రయోగంలో భాగంగా ఎలుకలలో ALL కేన్సర్‌ కణాలను ఎక్కించారు.  ఆ తరువాత ఒకరోజు ఉపవాసం మరుసటి రోజు ఆహారం... ఇలా ఎలుకలతో ఉపవాసం చేయించారు. ఒక ఏడు వారాలు గడిచేసరికి ఉపవాసం చేసిన ఎలుకలలోని కేన్సర్‌ కణాలు కూడా ఆరోగ్యవంతమైన కణాలలాగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. ఈ ఎలుకల మూలుగు (bone marrow)లో కానీ ప్లీహం (spleen)లో కానీ లుకేమియాని కలిగించే కణాలే కనిపించలేదు.

 

ప్రయోగం తరువాత కొద్దిరోజులకే ఉపవాసం చేయించని ఎలుకలు చనిపోగా, ఉపవాసంతో కేన్సర్‌ను జయించిన ఎలుకలు సుదీర్ఘకాలం జీవించాయి. మన ఆకలిని నియంత్రించి, రక్తప్రసరణ మీద ప్రభావం చూపే leptin అనే హార్మోను మీద ప్రభావం చూపడం వల్లే ఉపవాసం సత్ఫలితాలనిచ్చింది అంటున్నారు పరిశోధకులు. అయితే పెద్దలకు సోకే AML అనే తరహా లుకేమియాలో ఇలాంటి ప్రభావం కనిపించకపోవడం గమనార్హం. ఏది ఏమైనా ఉపవాసం వల్ల కేన్సర్‌ సైతం నయమవుతుందని తేలిపోయింది. ఉపవాసం వల్ల ఇంకెన్ని రోగాలలో ఉపశమనం లభిస్తుందో తేలడమే తరువాయి. పెద్దలు చెప్పే ఇలాంటి ఆరోగ్య సూత్రాల వెనుక ఎంత ఉపయోగం ఉందో తెలిపే ఇలాంటి పరిశోధనలు ప్రాచీన వైద్యం పట్ల సరికొత్త విశ్వాసాన్ని అందిస్తున్నాయి.

 

 

- నిర్జర.

By
en-us Political News

  
బాదం పప్పు రోజూ తినడం ఎంతవరకు ఆరోగ్యం? ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? తెలుసుకుంటే..
కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది ఒక సాధారణ చేతి సమస్య. అరచేతి వైపు ఎముకలు, స్నాయువులతో చుట్టుముట్టబడిన ఇరుకైన మార్గం అయిన కార్పల్ టన్నెల్‌లో ఉన్న నాడిని చేతిపై ఒత్తిడి చేసినప్పుడు ఇది సంభవిస్తుంది. చేతులలో తిమ్మిరి రావడం, వేళ్లలో జలదరింపు లేదా నొప్పి ఉండటం, రాయడంలో లేదా టైప్ చేయడంలో సమస్య ఉండటం, పదే పదే వస్తువులు చేతులలో పట్టుకోలేక జారవిడచడం, వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడం ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలు.
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.