చిన్నారి మనసుకి గాయం అయితే

Publish Date:Dec 15, 2016

Advertisement


పిల్లల్ని పెంచడం ఒక కళ అని చాలామంది గ్రహించరు. పిల్లలకి కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుందన్న ఆలోచనా కొద్దిమందికే ఉంటుంది. ఇక పిల్లల మనసు గాయపడితే వారి జీవితం ప్రభావితం అవుతుందన్న ముందుచూపూ జనానికి తక్కువే! కానీ అలాంటి అలక్ష్యమే వారి నిండు జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.

 

రకరకాల బాధలు

పిల్లలు పసివారే కావచ్చు. కానీ వారి మీద జరిగే దారుణాలు అసంఖ్యాయం. తెలిసో తెలియకో కుటుంబం, సమాజం వారితో ప్రవర్తించే తీరు అమానుషంగానే ఉంటుంది. శారీరిక హింస, మానసిక వేధింపులు, లైంగిక దాడులు, తల్లిదండ్రులు విడిపోవడం, ఇంట్లో గొడవలు లాంటి వ్యవహారాలు పసి మనసుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అందుకనే అమెరికాలోని ఓ స్వచ్ఛంద సంస్థ 17,000 మందిని ప్రశ్నించినప్పుడు... వారిలో చాలామంది తాము ఏదో ఒక సందర్భంలో తీవ్రమైన వేధింపులకి గురైనట్లు పేర్కొన్నారు. వీటిలో శారీరిక హింసదే అగ్రస్థానంగా ఉంది.

 

దీర్ఘకాలిక ప్రభావం

చిన్నతనంలో పసిమనసు దెబ్బతింటే దాని ప్రభావం దీర్ఘకాలికంగా ఉన్నట్లు తేలింది. వారిలో గుండె జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, కాలేయ సమస్యలు, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందట. ఇక డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యలు సరేసరి! అపసవ్యమైన బాల్యాన్ని చవిచూసిన వారిలో ప్రవర్తనాపరమైన లోపాలకీ కొదవ లేదు. దుర్వసనాలకు లోనుకావడం, విచ్చలవిడితనం, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం వంటి జీవనానికి అలవాటుపడతారట. సాధారణ వ్యక్తులతో పోలిస్తే, గాయపడిన మనసుతో బాల్యాన్ని గడిపిన వారి ఆయుష్షులో కూడా మార్పులు ఉండటాన్ని గమనించారు. వీరు దాదాపు 20 సంవత్సరాలు ముందే చనిపోయే ప్రమాదం ఉందట. వీరిలో ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా ఐదురెట్లు అధికంగా జరిగినట్లు గమనించారు.

 

ఇవీ కారణాలు

తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం పసిపిల్లలలో ఉండదు. కనీసం దానిని బయటకు చెప్పుకునే ధైర్యాన్ని కూడా వారు చేయలేరు. ఏ పెద్దల మీదైతే తాము ఆధారపడుతున్నామో... వారే సమస్యగా మారినప్పుడు, సమాజం మీదే వారికి నమ్మకం పోతుంది. అనుబంధాల మీదా, మానవత్వం మీదా విశ్వాసం చెదరిపోతుంది. అది మానసికంగానూ, శారీరికంగానూ, ప్రవర్తనాపరంగానూ వారి మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

 

అదృష్టవశాత్తూ ఇప్పుడు పిల్లల హక్కుల గురించీ, వారి మనస్తత్వాల గురించీ విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఎవరన్నా తన చిన్నతనం తాలూకు జ్ఞపకాలూ ఇంకా తమని వెన్నాడుతున్నట్లు భావిస్తే ధ్యానం చేయడం ద్వారా, కౌన్సిలింగ్‌ తీసుకోవడం ద్వారా ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.

 

- నిర్జర.

By
en-us Political News

  
బాదం పప్పు రోజూ తినడం ఎంతవరకు ఆరోగ్యం? ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? తెలుసుకుంటే..
కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది ఒక సాధారణ చేతి సమస్య. అరచేతి వైపు ఎముకలు, స్నాయువులతో చుట్టుముట్టబడిన ఇరుకైన మార్గం అయిన కార్పల్ టన్నెల్‌లో ఉన్న నాడిని చేతిపై ఒత్తిడి చేసినప్పుడు ఇది సంభవిస్తుంది. చేతులలో తిమ్మిరి రావడం, వేళ్లలో జలదరింపు లేదా నొప్పి ఉండటం, రాయడంలో లేదా టైప్ చేయడంలో సమస్య ఉండటం, పదే పదే వస్తువులు చేతులలో పట్టుకోలేక జారవిడచడం, వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడం ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలు.
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.