మోడీకి జన్మదిన కానుక నా ఆత్మహత్య.. మహారైతు సూసైడ్ నోట్
Publish Date:Sep 21, 2022
Advertisement
ప్రధాని నరేంద్రమోడీకి జన్మదిన కానుకగా ఓ రైతు తన మరణాన్నే ఇచ్చారు. మహారాష్ట్రకు చెందిన రైతు దశరథ లక్ష్మణ్ కేదారి అనే రైతు మోడీ జన్మదినం రోజునే ఆత్మహత్యకు పాల్పడి.. ఇదే తాను ప్రధానికి ఇస్తున్న జన్మదిన కానుకగా తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. తాను ఓ సాధారణ రైతుననీ, ఉల్లి పంటకు మద్దతు ధర లేదనీ, టమాటాలదీ అదే పరిస్థితనీ పేర్కొన్నారు. కరోనా విలయం, భారీ వర్షాలతో భారీగా నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ, అన్ని కష్టాలూ తట్టుకుని పంట పండించినా మార్కెట్ లో ధర ఉండట లేదనీ, ఈ అనుభవాలతో జీవితంపై విరక్తి కలిగిందనీ దశరథ్ లక్ష్మణ్ కేదారి తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. రైతులు బిచ్చగాళ్లు కాదనీ, వారి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆ సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. రైతు గోస ప్రపంచానికి అర్థం కావాలనే, తెలియజెప్పాలనే తాను ప్రధాని మోడీ జన్మదినం రోజున ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆ సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/farmer-gives-death-as-birthday-gift-to-modi-25-144222.html





