సన్రైజర్స్...ఆర్సీబీ మ్యాచ్ టికెట్ల రేట్లపై ఫ్యాన్స్ ఆగ్రహం
Publish Date:May 15, 2026
Advertisement
ఐపీఎల్లో అత్యంత క్రేజ్ ఉన్న మ్యాచ్లలో ఒకటైన సన్రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరుకు అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. మే 22న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ టికెట్ల ధరలు భారీగా పెరగడం ఫ్యాన్స్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్ బుకింగ్ ప్రారంభం కావడంతో వేలాదిమంది అభిమానులు ఒకేసారి లాగిన్ అయ్యారు. యాప్లో దాదాపు 2.6 లక్షల మంది క్యూలో ఉన్నట్లు కనిపించడంతో టికెట్ దక్కడం కష్టమైందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టికెట్లు కొద్ది నిమిషాల్లోనే “సోల్డ్ అవుట్”గా చూపించి, తర్వాత వాటిని బ్లాక్ మార్కెట్కు మళ్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారిక ధరలతో పోలిస్తే బ్లాక్ మార్కెట్లో టికెట్లు రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు. పెరిగిన టికెట్ ధరలు ఇలా ఉన్నాయి: ₹950 టికెట్ → ₹2000 లక్షల సంఖ్యలో అభిమానులను క్యూలో ఉంచి చివరకు “సోల్డ్ అవుట్” అని చూపించడం పారదర్శకత కాదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ డిమాండ్ను అవకాశంగా మార్చుకుని టికెట్ ధరలను పెంచుతున్నారని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
₹1500 టికెట్ → ₹3000
₹1910 టికెట్ → ₹3500
₹2500 టికెట్ → ₹4500
₹4500 టికెట్ → ₹6000
₹7000 టికెట్ → ₹10,000
₹23,000 బాక్స్ టికెట్ → ₹30,000
₹30,000 కార్పొరేట్ బాక్స్ → ₹45,000
http://www.teluguone.com/news/content/fans-angry-over-ticket-prices-for-sunrisersrcb-match-36-219922.html





