బీఆర్ఎస్.. కిందపడ్డా పైచేయి మాదేనంటే ఎలా?

Publish Date:Feb 16, 2026

Advertisement

బీఆర్ఎస్ కింద పడ్డా పై ‘చేయి’ మాదేనంటోంది. ‘హస్త’ వాసి బాగాలేదంటోంది. కాంగ్రెస్ పార్టీపై ప్రజలలో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో తెలియడానికి మునిసిపోల్స్ ఫలితాలే నిదర్శనమని బల్లగుద్ది మరీ చెబుతోంది. పురపోరులో ఈ స్థాయిలో పరాజయాన్ని మూటగట్టుకుని కూడా ఓటింగ్ శాతం చూడండి.. గత లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ కు వచ్చిన ఓట్ల శాతం పెరిగిందనీ, కాంగ్రెస్ కు తగ్గిందనీ చెబుతూ సొంత భుజాలను చరిచేసుకుంటోంది. అయితే.. బీఆర్ఎస్ ఓట్ల శాతం భాష్యంపై జనంలో పెద్దగా స్పందన రావడం లేదు. పైపెచ్చు పార్టీ శ్రేణుల్లోనూ ఈ తరహా వ్యాఖ్యల పట్ల ఒకింత వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సాధారణంగా ఒక పరాజయం తరువాత ఏ పార్టీ అయినా, లోపాలను సవరించుకోవడంపై దృష్టి పెడుతుంది. అలాంటిది వరుస పెట్టి పరాజయాలు ఎదురౌతున్నా బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అంతర్మథనం వైపు దృష్టి సారించడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి ఆదరణ పొందడానికి అవసరమైన కార్యాచరణ ప్రకటించలేదు.  

2023  అసెంబ్లీ ఎన్నిక‌ల లగాయతు.. బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకూతీసికట్టు అన్నచందంగా కనిపిస్తోంది.  2023లో పార్టీ పరాజయం తరువాత.. ఆ పార్టీ టికెట్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. శాసన సభ్యత్వం రద్దు కాకుండా కాపాడుకోవడానికో, అనర్హత వేటు భయంతోనో.. కారణమేమైతేనేం.. సాంకేతికంగా తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామనిన చెబుతున్నప్పటికీ ఆ ఎమ్మెల్యేలు పార్టీకి విధేయంగా లేరన్నది తేటతెల్లమైపోయింది. ఇక కీల‌క‌మైన కేకే వంటి నాయకులు సైతం బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేశారు. ఈ పరిస్థితుల్లో  పార్టీని క్షేత్రస్థాయి నుంచీ బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాల్సిన కేసీఆర్.. పార్ట్ టైం పార్టీ కార్యక్రమాలకే పరిమితమై.. ఫామ్ హౌస్ దాటి అడుగుబయటపెట్టేది లేదని చాటుతున్నారు. ఇక కార్య నిర్వాహక అధ్యక్షుడిగా పార్టీని ముందుండి నడిపించాల్సిన కేటీఆర్ సామాజిక మాధ్యమం వేదికగా అధికారపార్టీపై విమర్శల పేరుతో దూషణలకు పరిమితమౌతున్నారు.

పంచాయతీ పోరులో పరాజయం తరువాత మునిసిపోల్స్ లో జెండా పాతడం ఖాయమని ఘనంనగా ప్రకటించారు కేటీఆర్. అయితే ఫలితాలలో ఎన్నికలు జరిగిన 115 మునిసిపాలిటల్లో బీఆర్ఎస్ గెలుచుకున్నవి కేవలం 16 మునిసిపాలిటీలే. ఇక బీఆర్ఎస్ పార్టీ ఒక్కటంటే ఒక్క వార్డులో కూడా గెలుపొందని మునిసిపాలిటీలు 13కు పైగా ఉన్నాయి.  ఎన్నిక‌ల్లో గెలుపు-ఓట‌ములు స‌హ‌జ‌మే. కానీ.. తన అంచనాలలోని సంఖ్యకు కనీసం దరిదాపులకు కూడా రాకుండా మునిసిపల్ పోరు ఫలితాలు ఉన్నా.. ఎక్కడ తేడా కొడుతోందన్న ఆత్మ విమర్శ చేసుకునేందుకు మాత్రం కేసీఆర్, కేటీఆర్ అండ్ కో రెడీగా లేరు. పంచాయతి, పుర పోరు  కాదు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం మా విజయం ఖాయం అంటూ కేటీఆర్ చాటడం చూస్తుంటే.. కింద పడిన ప్రతిసారీ పైచేయి మాదేనని చాటేందుకు చేస్తున్న ప్రయత్నంగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇదే తరహాలో కేటీఆర్ గమనం ఉంటే భవిష్యత్ లో మరిన్ని ఘోర పరాభవాలకు బీఆర్ఎస్ సిద్ధపడాల్సిందే అంటున్నారు పరిశీలకులు.

By
en-us Political News

  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
విజయ్ ప్రస్తుతం చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్) లోని నీలాంకరి నివాసంలో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆయన సచివాలయం ఉన్న రాజాజీ రోడ్డుకు రోజువారీ ప్రయాణం చేస్తున్నారు.
భౌగోళికంగా, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయినా, భాష, సంస్కృతి పరంగా తెలుగు ప్రజల మధ్య బంధం విడదీయరానిదని అన్నారు. తెలుగు సినిమా రంగానికి ప్రజలను ఏకం చేసే అద్భుతమైన శక్తి ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు.
తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ నేతల సమావేశం ఉద్రిక్తంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.