చదువులతీరు మారాలి!
Publish Date:Sep 8, 2012
Advertisement
కొత్తకాపురానికి వెళ్ళే కూతురుకు అత్త, ఆడపడుచులతో జాగ్రత్తగా మసలుకోమని అమ్మ చెప్పి పంపిస్తుంది. ఒకప్పుడు కొత్తగా కాపురానికి పంపించే కూతుళ్లకి పండంటి కాపురానికి పదో, పన్నెండో సూత్రాలుచెప్పి పంపించేవాళ్లు. ప్రస్తుతం రాష్ట్రంలో వృత్తివిద్యా కోర్సులు చదువుతున్న విద్యార్ధుల పుణ్యం పుచ్చి సర్కారు వాళ్లక్కూడా ఈ సూత్రాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. అందుకోసం భారీ ఎత్తున కసరత్తుకూడా జరుగుతోంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్ధుల్లో వృత్తినైపుణ్యాన్ని, ఇంజనీర్లలో నాణ్యతా ప్రమాణాలను పెంచడానికి కృషిచేయాలని ప్రభుత్వానికి రాష్ట్ర ఐటీ ఐటీఈఎస్ పరిశ్రమల సమాఖ్య విజ్ఞప్తి చేసింది. ఈ విషయమై ఇట్స్ఏపీ ప్రభుత్వానికి పది సూత్రాలతో ఓ ప్రణాళికను అందజేసింది. ఇవి సరిగ్గా అమలయ్యేలా చూస్తే, రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యకు, విద్యార్ధులకు మంచిరోజులు వచ్చినట్టే. భావి ఇంజనీర్లలో వృత్తినైపుణ్యం పెంచాలన్న ప్రభుత్వాశయం నిజంగా మెచ్చుకోదగిందే. ఎందుకంటే.. ఇప్పటివరకూ టెక్నికల్ చదువు తెలివితేటలమీద కాక, ర్యాంకులు, డొనేషన్ల మీద మాత్రమే బతుకుతోంది. వీలైతే ఈ సూత్రాన్ని కేవలం ఇంజినీరింగ్ విద్యకి మాత్రమే కాదు.. కిందిస్థాయినుంచి అన్ని తరగతులకూ వర్తింపజేయాలని రాష్ట్రంలో పిల్లల్ని చదివించుకుంటున్న తల్లిదండ్రులంతా కోరుకుంటున్నారు. విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని, విద్యార్ధుల భవిష్యత్కై రూపొందించిన ఇలాంటి ప్రణాళికలు, విధానాల్ని నిజాయితీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/engineering-24-17223.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





