శాంతి పట్టుచీర క‌థ‌.. వెలుగులోకి అక్ర‌మాల పుట్ట!

Publish Date:Jul 20, 2024

Advertisement

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి, దేవాదాయ శాఖ ఉద్యోగి శాంతి వ్య‌వ‌హారం. వీరి వ్య‌వ‌హారంలో లోతుగా వెళ్లిన కొద్దీ దిగ్భ్రాంతికర విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. త‌న భార్య‌ శాంతి జ‌న్మ‌నిచ్చిన కుమారుడికి తండ్రి ఎవ‌ర‌నే విష‌యం తేల్చాల‌ని భ‌ర్త మ‌ద‌న్ మోహ‌న్ ఓ వైపు కోరుతుంటే..  మ‌రోవైపు దేవాదాయ శాఖ  అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ హోదాలో శాంతి అవినీతి అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి.  

ఆమె ఆస్తుల చిట్టా కూడా చాలా చాలా పెద్ద‌గానే ఉంది. హైద‌రాబాద్, మంగ‌ళ‌గిరి, తాడేప‌ల్లిలో కోట్లాది రూపాయ‌ల విలువైన‌ విల్లాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. విశాఖ ప‌ట్ట‌ణంలో ప‌దెక‌రాల మామిడి తోట కూడా ఉందని అంటున్నారు‌. అంతేకాదు.. దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ హోదాలో ఆమె ఏదైనా దేవాల‌యానికి వెళితే క‌చ్చితంగా ప‌ట్టు చీర‌తో పాటు రూ. 50వేలు స‌మ‌ర్పించాల్సిందేన‌న్న విమ‌ర్శ‌లూ వినిపిస్తున్నాయి. శాంతి పోస్టింగ్ విష‌యంలోనూ కొత్త విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆమె ఏపీపీఎస్సీ పరీక్షలో పాస్ కాకుండానే   కొంత మంది మ‌ద్ద‌తుతో   జాబ్ లోకి వ‌చ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

 దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి మ‌ధ్య సంబంధంపై గ‌త వారంరోజులుగా విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ విష‌యంపై క్లారిటీ ఇవ్వాల్సిన విజ‌య‌సాయిరెడ్డి.. మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి క‌థ‌నాలు ప్ర‌సారం చేసిన మీడియాపై బూతుల‌తో విరుచుకుప‌డ్డారు. కానీ,  శాంతి, త‌న‌కు మ‌ధ్య సంబంధం ఏమిట‌నే విష‌యంపై ఎక్క‌డా క్లారిటీ ఇవ్వ‌లేదు. మ‌రోవైపు శాంతి మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి నేను జ‌న్మ‌నిచ్చిన మ‌గ‌బిడ్డ‌కు తండ్రి నా భ‌ర్త మ‌ద‌న్ మోహ‌న్ కాదు.. అడ్వ‌కేట్‌ సుభాష్ రెడ్డి అని కుండబద్దలు కొట్టినట్లు చేప్పేశారు.  సుభాష్ రెడ్డి ఇప్ప‌టి వ‌ర‌కు మీడియా ముందుకు రాక‌పోయినా.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియోలో శాంతి జ‌న్మ‌నిచ్చిన మ‌గ బిడ్డ‌కు తనకూ ఎలాంటి సంబంధం లేద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ వ్య‌వ‌హారంపై శాంతి  భ‌ర్త మ‌ద‌న్ మోహ‌న్ రెడ్డి గ‌త వారం రోజులుగా త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. నా భార్య‌ శాంతి జ‌న్మ‌నిచ్చిన మ‌గ బిడ్డ‌కు తండ్రి విజ‌య‌సాయిరెడ్డేన‌ని ఆరోపిస్తున్నారు. భ‌విష్య‌త్తులో త‌న‌కు, శాంతికి పుట్టిన ఇద్ద‌రు ఆడ పిల్ల‌ల‌కు అన్యాయం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని, ప్ర‌స్తుతం శాంతి జ‌న్మ‌నిచ్చిన మ‌గ బిడ్డ‌కు ఎదిగే కొద్దీ ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని.. ఇప్పుడే ఈ విష‌యంపై తేల్చాల‌ని మ‌ద‌న్ మోహ‌న్ డిమాండ్ చేస్తున్నారు. విజ‌య‌సాయి రెడ్డికి, సుభాష్ రెడ్డికి డీఎన్ఏ ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని కోరుతున్నారు. ఇదే విష‌యంపై రాష్ట్ర హోమంత్రి అనిత‌ను క‌లిశారు. కోర్టుకు సైతం వెళ్లేందుకు మ‌ద‌న్ మోహ‌న్ రెడ్డి సిద్ధ‌మ‌య్యారు. ఈ వ్య‌వ‌హారం సాగుతున్న స‌మ‌యంలోనే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా త‌న హోదాను అడ్డుపెట్టుకొని శాంతి చేసిన అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి.

 శాంతి ఏపీపీఎస్సీ నుంచి డైరెక్ట్ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ గా జాయిన్ అయ్యారు. అయితే, ఆమెకు అర్హ‌త లేక‌పోయినా విశాఖ దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ పోస్టింగ్ ఇచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇందులో రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌మేయం ఉంద‌ని, ఆమె ద్వారా విశాఖ‌లోని దేవాదాయ శాఖ భూములను పెద్ద‌ మొత్తంలో కొట్టేశార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. స్థానికంగా కొంద‌రు వ్య‌క్తులు దేవాదాయ శాఖ ప‌రిధిలోని భూముల వివ‌రాల కోసం స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ద‌ర‌ఖాస్తు చేసినా వివ‌రాలు ఇచ్చేందుకు గ‌తంలో శాంతి తిర‌స్క‌రించార‌ని, వివ‌రాలు ఇవ్వాల‌ని ఉన్న‌తాధికారులు సూచ‌న‌లు చేసినా ప‌ట్టించుకోలేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. తాడేప‌ల్లిలోని మాజీ సీఎం జ‌గ‌న్ నివాసానికి కొద్దిదూరంలో శాంతి ఓ విల్లా నిర్మాణం చేస్తున్నారు. ఆ విల్లా నిర్మాణానికి దాదాపు 40 నుంచి 50 మంది కూలీలు ప‌నిచేస్తున్నారు. వారంద‌రికి రోజూ భోజ‌నాలు విజ‌య‌వాడ సీతారామ‌య్య స‌త్రంతో పాటు మ‌రొక స‌త్రం నుంచి  స‌ప్ల‌య్ చేస్తున్నార‌ని స‌మాచారం. విల్లా వ‌ద్ద ప‌ర్య‌వేక్ష‌ణ‌కు కొంద‌రు దేవాదాయ శాఖ సిబ్బందిని వినియోగించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 

శాంతి స‌హ‌కారంతో విజ‌య‌సాయిరెడ్డి, మ‌రి కొంద‌రు వైసీపీ నేత‌లు పెద్ద‌మొత్తంలో దేవాదాయ భూముల‌ను క‌బ్జా చేసిన‌ట్లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే శాంతికి ఓ విల్లాను విజ‌య‌సాయిరెడ్డి కొనిచ్చార‌నేది ఏపీ రాజ‌కీయాల్లో విస్తృతంగా ప్ర‌చారంలో ఉంది. మొత్తానికి విజ‌య‌సాయిరెడ్డి, శాంతి వ్య‌వ‌హారం ఏపీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శాంతికి జ‌న్మ‌నిచ్చిన బిడ్డ‌కు తండ్రి విజ‌య‌సాయిరెడ్డా.. సుభాష్ రెడ్డా అనే విష‌యం తేలాల్సి ఉండ‌గా.. మ‌రోవైపు దేవాదాయ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ హోదాలో శాంతి అక్ర‌మాల‌పై ప్ర‌భుత్వం దృష్టిసారించాల్సి ఉంది. ఇప్ప‌టికే శాంతి అక్ర‌మాల‌పై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయ‌ణ రెడ్డి దృష్టి కేంద్రీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. అధికారుల నుంచి పూర్తి వివ‌రాలు సేక‌రించిన ఆయ‌న‌.. త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వానికి నివేదిక అందించే అవ‌కాశాలు ఉన్నాయి. మొత్తానికి శాంతి జ‌న్మ‌నిచ్చిన బిడ్డ ఎవ‌రో తేల్చాల‌ని ఆమె భ‌ర్త డిమాండ్ చేస్తున్న క్ర‌మంలో.. శాంతి అక్ర‌మాలుసైతం ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తుండ‌టంతో ప్ర‌జ‌లు విస్తుపోతున్నారు.

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.