ఏపీ మద్యం రవాణా కుంభకోణం: లగ్జరీ కార్లు, రోలెక్స్ వాచీలు సీజ్ చేసిన ఈడీ!
Publish Date:Jun 13, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. ఈడీ ఈ కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా హైదరాబద్ లో నిర్వహించిన సోదాలలో ఒక ఖరీదైన లగ్జరీ కారు, 94.5 లక్షల రూపాయల విలువైన విలువైన రోలెక్స్ వాచి వంటి అత్యంత విలాసవంతమైన వస్తువులు, లెక్కల్లో భారీ నగదు, కీలకమైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో తెరవెనుక నడిచిన మనీలాండరింగ్ నెట్వర్క్ను ఛేదించేందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ ఈ చర్యలు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభుత్వ ఐటీ మాజీ సలహాదారు కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కేశిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ (ఏపీఎస్బీసీఎల్) మాజీ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డిలను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు విజయ నరసింహారెడ్డి, వల్లు సందీప్, కార్మూరు నాగేశ్వరరావు, క సునీల్ కుమార్లకు చెందిన నివాసాల్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. అరెస్టయిన రాజ్ కేశిరెడ్డి, వాసుదేవ రెడ్డిలను ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వీరికి ఈ నెల 25 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణానికి రాజ్ కేశిరెడ్డే ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లుఈడీకి ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. సేకరించింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఐటీ సలహాదారుగా ఉన్న కాలంలో ఆయన తనకున్న రాజకీయ, పరిపాలనా పలుకుబడిని ఉపయోగింది, ఏపీఎస్బీసీఎల్ అప్పటి ఎండీ వాసుదేవ రెడ్డి, ఆయన అనుచరుడు తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డితో చేతులు కలిపి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం రవాణా టెండర్లు కేవలం తమ అనుకూల సంస్థలకే దక్కేలా నిబంధనలను మార్చేసినట్లు ఈడీ గుర్తించింది. సిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు మొదలుపెట్టగా.. అదనపు ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఈ ఉద్దేశపూర్వక నిబంధనల ఉల్లంఘన వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ. 195.33 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని తేలింది. టెండర్ ప్రక్రియలో సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఎస్సీఎస్పీఎల్)', అలాగే ప్రసాద్ ట్రాన్స్పోర్ట్స్ వంటి సంస్థలను ముందుంచి నడిపించారనీ.. వాస్తవానికి ఈ సంస్థల ఆర్థిక, నిర్వహణ నియంత్రణ అంతా రాజ్ కేశిరెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలోనే సాగిందనీ ఈడీ చెబుతోంది. మద్యం డిపోల నుండి రిటైల్ షాపులకు మద్యం సరఫరా చేసే ఈ నెట్వర్క్ను వాడుకుని, మార్కెట్ రేట్ల కంటే ఎక్కువ ధరలకు రవాణా కాంట్రాక్టులు కట్టబెట్టి, కోట్ల రూపాయల నేరపూరిత ఆదాయాన్ని సృష్టించారని ఈడీ తేల్చింది.
http://www.teluguone.com/news/content/ed-seizes-luxury-cars-and-rolex-watches-in-ap-liquor-scam--36-222782.html





