Publish Date:Sep 18, 2025
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం (సెప్టెంబర్ 18) ఉదయం నుంచీ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహి స్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం ఇరవై చోట్ల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో 3,500 కోట్ల సొమ్మును దారిమళ్లించారన్న ఆరోపణలపై ఈడీ నిర్వహిస్తున్న ఈ సోదాలలో భాగంగా మారేడుపల్లిలోని వెల్డింగ్టన్ ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త బూరుగు రమేష్, ఆయన కుమారుడు విక్రాంత్ నివాసాలలో దాదాపు ఏడుగంటల పాటు నిర్వహించిన సోదాలు ముగిశాయి.
ఈ సోదాలలో ఈడీ కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. కాస్పో లీగల్ సర్వీసెస్, మహదేవ జ్యువెల్లరీస్ తో పాటు రాజశ్రీ ఫుడ్స్ లో బూరుగు విక్రాంత్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఈ కంపెనీలలోకి ఏపీ మద్యం కుంభకోణం కేసు నగదు మళ్లించినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో భాగంగా బూరుగు రమేష్ నివాసంలో నగదు, షెల్ కంపెనీల పత్రాలు సీజ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. స్వాధీనం చేసుకున్న పత్రాలు నగదును హైదరాబాద్ ఈడీ కార్యాలయానికి తరలించారు.
ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 12 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురికి బెయిల్ లభించింది. కాగా నకిలీ ఇన్వాయిస్, పెంచిన మద్యం ధరలతో అక్రమంగా సొమ్ములు వివిధ ప్రాంతాలకు చేరవేసినట్లు ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఈడీలు సోదాలు జరుగుతున్నాయి. ఈ స్కామ్ కు సంబంధించి ఐదు రాష్ట్రాల్లో లింకులున్నాయని గుర్తించిన ఈడీ ఇప్పుడు ఈ సోదాలు నిర్వహిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ed-raids-in-burugu-ramesh-residence-39-206404.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.