మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన సంజయ్ రౌత్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఆయన భార్య వర్షా రౌత్ను ఈడీ ముందు హాజరయ్యారు. పట్రాచావల్ రీడవలప్మెంట్ అవకతవకల పై ఈడీ ఆమెను ప్రశ్నిస్తున్నది.
సంజయ్ రౌత్ కస్టడీని ఈనెల 8వ తేదీ వరకూ పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు ఈనెల 4వ తేదీన పొడిగిం చింది. పట్రా చావల్ రీడవలప్మెంట్ వ్యవహారంలో రౌత్ దంపతులకు రూ.3.3 కోట్లు ముట్టినట్టు ఈడీ ఆరోపిస్తోంది. ఇందులో ఎక్కువ మొత్తం వర్షా రౌత్ అకౌంట్లకు జమ అయ్యాయని చెబుతోంది. వర్షా రౌత్ బ్యాంక్ అకౌం ట్లను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చామని ఈడీ తెలిపింది. కాగా రౌత్ తన భార్య అకౌంట్లోకి పెద్ద మొత్తం లో వచ్చిన సొమ్ము గురించి మాత్రం మౌనం వహించారు. ఈ విషయంలో విషయంపై ఈడీ దర్యాప్తు జరుపు తోంది.
ఇదిలా ఉండగా, అలీబాగ్ ల్యాండ్డీల్ డాక్యుమెంట్లతో సంబంధం ఉన్న వారిని కూడా ఈడీ ప్రశ్నిస్తోం ది. తమ విచారణలో భాగంగా సేకరించిన డాక్యుమెంట్లను బట్టి చూస్తే అలీబాగ్లోని బీచ్సైడ్ ఆస్తులను నగదు రూపంలో భూ యజమానులకు చెల్లించి సంజయ్ రౌత్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోం దని ఈడీ చెబుతోంది. పట్రా చావల్ రీడవలప్మెంట్ డీల్లో సంజయ్ రౌత్ సన్నిహిత మిత్రుడు ప్రవీణ్ రౌత్ కీలక పాత్ర పోషించారు. గురుఅవినాష్ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్లలో ఒకరుగా గురుఆశిష్ ప్రవీణ్ రౌత్ ఉన్నారు. ఈ ప్రాజెక్టును ఎగ్జిక్యూట్ చేయడంలో విఫలమైన గురు అవినాష్ కన్స్ట్రక్షన్ ఎఫ్ఎస్ఐకి అమ్మేసింది. ఈ ఫ్రాడ్ ద్వారా వచ్చిన రూ.1.2000 కోట్లలో రూ.112 కోట్లు కమిషన్ రూపంలో ప్రవీణ్ రౌత్కు చెల్లించారు. ప్రవీణ్ రౌత్కు అనుబంధంగా ప్రవీణ్ రౌత్ పనిచేశాడని, పట్రా చావల్ అవకతకవకల కారణంగా కోట్ల రూపాయలు సంజయ్ రౌత్ పొందారని ఈడీ ఆరోపిస్తోంది. ప్రవీణ్ రౌత్ను ఇప్పటికే ఈడీ అరెస్టు చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ed-querring-varsha-raut-39-141397.html
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.