కింద పడ్డాపై చేయి మాదే అన్నచందంగా ఉంది జగన్ వైఖరి. కోర్టులు అక్షింతలు వేసినా, కేంద్రం కాదూ కూడదని స్పష్టం చేసినా, జనం ఛీ అంటున్నా జగన్ మాత్రం ముడు ముక్కులాటే అంటున్నారు. మూడు రాజధానుల విషయంలో వెనక్కు తగ్గే ప్రశ్నే లేదని జగన్ తన మొండి పట్టుదలను వదలడం లేదు. ఇందు కోసం రాజ్యసభలో ఏకంగా ప్రైవేటు బిల్లు పెట్టారు.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి మూడు రాజధానులపై రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. రాజధాని వ్యవహారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినదేననీ, సర్వాధికారాలూ రాష్ట్రానికే ఉండాలని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆర్టికల్ త్రీని సవరించాలని కోరుతూ ఆయన ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టారు. గతంలో కేంద్రం ఏ మాట అయితే చెప్పిందో అదే మాటకు కట్టుబడి ఉండాలంటూ వైసీపీ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నది.
అందుకే మూడు రాజధానుల విషయంలో రాజ్యాంగ సవరణ చేయాలంటూ ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టింది. రాజధాని విషయంలో వైసీపీ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడిన ఎలకలా కొట్టుకుంటున్నది. రాజధాని విషయంలో వైసీపీ సర్కార్ పూర్తిగా ఇరుకున పడింది. చట్ట ప్రకారం చూసినా, కోర్టు తీర్పులను అనుసరించాల్సి వచ్చినా అమరావతి నిర్మించక తప్పని పరిస్థితి వైసీపీ సర్కార్ ది. మూడు రాజధానుల విషయంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.
అయితే అక్కడ కూడా మూడు రాజధానులకు అనుకూలంగా తీర్పు వస్తుందన్న నమ్మకం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజ్యసభలో మూడు రాజధానుల కోసం రాజ్యాంగ సవరణ చేయాలంటూ ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టినట్లు చెబుతున్నారు. అసలు రాజధాని అన్నది రాజ్యాంగంలోనే లేదని జగన్ ఇటీవలి కాలంలో తరచూ చెబుతున్నారు. అలా చెబుతూ కూడా ఇప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సవరణ కోసం ప్రైవేటు బిల్లు పెట్టడం ఎందుకన్నది ఆ పార్టీ అధినేతకే తెలియాలి. తన మకాంను విశాఖ మారుస్తానంటూ రిషికొండను తవ్వేసి మరీ నిర్మించుకుంటున్న నిర్మాణాలపైనా వివాదాలు ముసురుకున్న నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థతుల్లోనే జగన్ మూడు రాజధానుల కోసం రాజ్యాంగ సవరణ చేయాలంటూ రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారని పరిశీలకులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-private-bill-in-rajya-sabha-for-three-capitals-39-141395.html
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.