తెలంగాణకు కాబోయే సీఎం షర్మిల.. డీఎస్ ఆశీర్వాదానికి కారణమేమిటి?

Publish Date:Jul 25, 2022

Advertisement

ధర్మపురి శ్రీనవాస్ కాంగ్రెస్ అగ్ర నేతలలో ఒకరిగా వెలుగొందారు.  సీఎం పదవి ఆయనదే అని ఒక సమయంలో అంతా భావించారు. 1989లో మంత్రిగా పని చేసిన ఆయన దశాబ్ద కాలంలో రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నాయకులలో ఒకరిగా ఎదిగారు. రాష్ట్ర విభజన జరిగే వరకూ ఆయన కాంగ్రెస్ నేతే. ఆ తరువాతే ఆ పార్టీకి దూరమయ్యారు. ముఖ్యంగా వైఎస్ లో ఆయనకు సత్సంబంధాలు ఉండేవి. పీసీసీ చీఫ్ గా ఆయన, ముఖ్యమంత్రిగా వైఎస్ ఇద్దరూ పార్టీని విజయవంతంగా ముందుకు నడిపారు. అయితే విభజన తరువాత ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి గూటికి చేరారు. ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. అయితే ఆ తరువాత పార్టీతో విభేదించారు. రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తరువాత ఆయనకు తెరాస మరో అవకాశం ఇవ్వలేదు. అసలు ఆయనకు పార్టీకీ సంబంధమే లేదన్నట్లుగా తెరాస వ్యవహరిస్తున్నది. డీఎస్ కూడా అంతే పార్టీతో అంటీముట్టనట్లే ఉన్నారు.  దూరం జరిగారు. అయితే తెరాసకు మాత్రం రాజీనామా చేయలేదు. ఈ రోజుకూ ఆయన టీఆర్ఎస్ సభ్యుడే. అయితే టీఆర్ఎస్ లో ఉన్నారంటే ఉన్నారు అంతే. డీఎస్ కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీ ఎంపీ.. దాంతో కొద్ది కాలం కిందట డీఎస్ కమలం గూటికి చేరతారన్న వార్తలు వినవచ్చినా ఆయన చూపంతా సొంత గూటిపైనే అంటే కాంగ్రెస్ పైనే. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు కారణాలేమైనా ఫలించలేదు. అందుకు వయోభారం కూడా ఒక కారణమని చెప్పాలి.

అయితే ఇప్పుడు ఆయన చూపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లిందని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ ప్రగతి మార్గంలో ముందుకు సాగాలంటే వైఎస్సార్ కుమార్తె షర్మిల రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన పేర్కొన్నారు. అక్కడితో ఆగలేదు ఆమె ముఖ్యమంత్రి అవుతారనీ, రాజకీయాలలో తన అంచనాలు ఇప్పటి వరకూ తప్పలేదని ప్రకటించారు. 2004  లో వైఎస్సార్ సీఎం అవుతారని ముందుగా చెప్పింది తానేననీ డీఎస్ చెప్పుకున్నారు. ఇంతకీ ఆయనకు హఠాత్తుగా షర్మిలపైనా, ఆమె పార్టీపైనా ఇంత అభిమానం ఎందుకు వచ్చింది. ఈ ప్రశ్నకు కూడా పరిశీలకులు సమాధానం చెబుతున్నారు. వయో భారం కారణంగా ఇంటికే పరిమితమైన డీఎస్ ను పలకరించే వారే కరవైన పరిస్థితి. అన్నేళ్ల పాటు సేవ చేసిన కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు.. తాను ప్రస్తుతం సభ్యుడిగా ఉన్న టీఆర్ ఎస్ వదిలేసింది. ఆ సమయంలో  షర్మిల తన డీఎస్ కి ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. తన తండ్రికి మిత్రుడు కనుక తనకూ పితృ సమానేడే అని  స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి  పలకరించి క్షేమ సమాచారాలు అడిగారు. అంతే పొంగిపోయిన డీఎస్ ను తెలంగాణకు కాబోయే సీఎం నువ్వేనమ్మా అని ఆశీర్వదించేశారు. ఇటు షర్మిలకు తన పార్టీలో చెప్పుకోదగ్గ పెద్ద నాయకుడెవరూ లేరు.. అటు డీఎస్ కు పలకరించి క్షేమ సమాచారాలు ఆరా తీసే వారు కరవైయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆయనతో షర్మిల భేటీ కావడంతో డీఎస్ వైఎస్సీటీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమన్ వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

దాంతో ఆమె తన తండ్రి  సహచరులను వరసగా కలవాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఈ క్రమంలో డీఎస్ ని కూడా కలసి ఆయనతో మంతనాలు సాగించారు అని అంటున్నారు. ఇక టీయారెస్ లో ఉన్నట్లా లేనట్లా అన్నట్లుగా ఉన్న డీఎస్ షర్మిలమ్మ పార్టీలో చేరుతారా అన్నది ఒక చర్చ. ఆయన కనుక చేరితే కచ్చితంగా వైఎస్సార్టీపీకి ఎంతో కొంత బలం చేకూరినట్లే. డీఎస్ పెద్ద నాయకుడు. పైగా బీసీ నేతగా బలమైన గొంతుక కలిగిన వారు మరి ఆయన షర్మిల పార్టీలో చేరడానికేనా ఆమె ఫ్యూచర్ సీఎం అని జోస్యం చెప్పినది అన్న మాట కూడా ఉంది.

ఏది ఏమైనా షర్మిల పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది అన్నది ఒక అంచనాకు అందని అతి పెద్ద  సందేహం. అయితే బడా నాయకులు కొందరు చేరితే మాత్రం కచ్చితంగా తాను గెలవకపోయినా కాంగ్రెస్ ని చీల్చే స్థాయిలో మాత్రం ఉంటుంది అని చెప్పవచ్చు.   ఈ పరిణామాలు అన్నీ షర్మిల సీఎం పదవి కోసం కాకుండా కేసీయార్ ని మూడవసారి గెలిపించడానికే పనికివచ్చినా వస్తాయని అనే వారూ ఉన్నారు. మొత్తానికి డీఎస్ తాపీగా ఒక రాజకీయ  జోస్యం వదిలారు. ఫ్యూచర్ లో చూసుకోండి షర్మిల సీఎం అంటున్నారు. మరి ఇది చెప్పిన ఆయన తాను ఏ పార్టీయో మాత్రం చెప్పలేదు. అదే కదా రాజకీయ గడుసుదనం అంటే.

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.