అవినాష్ కు ఊరట.. బుధవారం వరకూ నో అరెస్ట్

Publish Date:May 27, 2023

Advertisement

తెలంగాణ హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ పై సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పు బుధవారానికి వాయిదా పడింది. అంత వరకూ అవినాష్ ను అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు అదేశించింది. అంతకు ముందు వరుసగా రెండో రోజు అవినాష్  ముందస్తు బెయిలు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. అవినాష్ ను  కస్టోయిల్ విచారణ చేయాల్సిందేనని సీబీఐ అధికారులు విస్పష్టంగా చెప్పారు.  

గురువారం (మే26)ఇదే కేసులో అవినాష్ తరఫు న్యాయవాదులు, అలాగే సునీత తరఫు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు శుక్రవారం (మే27) సీబీఐ తరఫు వాదనలు వింది. ఈ సందర్భంగా కోర్టు సీబీఐ తీరు పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. అవినాష్ ను ఇన్నాళ్లూ ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. కనీసం ఆయన ఫోన్ ను కూడా ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నిలదీసింది. ఆ ప్రశ్నలన్నిటికీ సీబీఐ తరఫు న్యాయవాదులు సమాధానాలు ఇచ్చారు. చివరికి తీర్పు బుధవారం వెలువరించనున్నట్లు కోర్టు చెప్పింది. అయితే బుధవారం అవినాష్ ను విచారణకు పిలుస్తామని సీబీఐ తరఫు న్యాయవాదులు పేర్కొనగా, అందుకు అవినాష్ తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. తల్లి ఆస్పత్రిలో ఉన్నందున ఆయన రాలేరని పేర్కొన్నారు.

దీంతో కోర్టు తుది తీర్పును బుధవారం వెలువరిస్తామని పేర్కొంటూ అంత వరకూ అవినాష్ ను అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది. మొత్తం మీద కోర్టు తీర్పు అవినాష్ రెడ్డికి అనుకూలంగానే వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో అవినాష్ రెడ్డి సీబీఐకి రాసిన లేఖలో కూడా మే 27(శనివారం) తరువాత సీబీఐ ఎప్పుడు రమ్మంటే అప్పుడు విచారణకు వస్తానని పేర్కొన్నారు. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఆయన (బుధవారం) మే 31 వరకూ విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ రోజు ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పు వెలవరించనుంది. ఏది ఏమైనా ఈ ముందస్తు బెయిలు పిటిషన్ విచారణ సందర్భంగా పలు కీలక, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో సీఎం జగన్ పేరు ప్రస్తావనకు వచ్చింది.

వివేకా హత్య విషయం అవినాష్ ద్వారా జగన్ కు ప్రపంచానికి తెలియడానికి ముందే తెలుసునని తమ విచారణలో వెల్లడైందనీ, దానిని నిర్ధారించుకోవాలంటే అవినాష్ ను అరెస్టు చేసి విచారించాల్సిందేనని సీబీఐ విస్పష్టంగా పేర్కొంది. అలాగే హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందనీ, హత్య జరిగిన వెంటనే అవినాష్ వాట్సాప్ కాల్స్ చేశారనీ నిర్ధారణ అయ్యిందనీ, ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలుసుకోవాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. ఆ సమయంలో కోర్టు జోక్యం చేసుకుని ఇంత కాలం అవినాష్ ఫోన్ స్వాధీనం ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించింది. చివరకు అవినాష్ బెయిలు పిటిషన్ పై తీర్పు బుధవారం(మే31)కి వాయిదా వేసింది. 

By
en-us Political News

  
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.