తెలంగాణలో రాజకీయ పార్టీల వ్యూహాలకు, ఎన్నికల ప్రణాళికలకు ఆయా పార్టీలోని అసంతృప్తి వాదులు, అసమ్మతి వాదులే పెద్ద అవరోధంగా తయారయ్యారు.
రానున్న ఎన్నికలలో అన్ని పార్టీలూ రెబల్స్ బెదడను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సిద్ధమైపోతున్న పరిస్థితి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికార తెరాస, రాష్ట్రంలో బలోపేతమై తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగామని చెప్పుకుంటున్న బీజేపీ, రాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకోవడానికి శతధా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ఇలా మూడు పార్టీలలోనూ అసమ్మతి సెగలు రగులుతున్నాయి.
రాష్ట్రంలో మూడో సారి అధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్న టీఆర్ఎస్ లో అసమ్మతి రాగాలు ఒకింత ఎక్కవగానే ఉన్నాయని చెప్పాలి. 2018 ఎన్నికల అనంతరం ఇరత పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు తలుపులు బార్లా తెరిచి తెరాస గూటిలో చేర్చుకోవడమే ఇప్పుడు ఆ పార్టీకి అసమ్మతి బెడద ఎక్కువగా ఉండటానికి కారణం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. మొదటి నుంచీ పార్టీలో ఉండి గత ఎన్నికలలో పరాజయం అయిన వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇలా తెరాసలో అసమ్మతి బెడద ఉన్న నియోజకవర్గాలు పదిహేనుకు పైగానే ఉన్నాయంటున్నారు పరిశీలకులు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో రానున్న ఎన్నికలలో తలనొప్పులు తప్పవని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.
ఇక రాష్ట్రంలో తెరాసకు దీటుగా బలోపేతం అయ్యామని చెప్పుకుంటున్న బీజేపీకి కూడా అసమ్మతి తలపోటులు తప్పడం లేదు. అభ్యర్థుల ఎంపిక సమయానికి ఈ బెడద మరింత ఎక్కువ అయ్యేలా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. స్వయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన సొంత నియోజకవర్గంలో అసమ్మతి బెడద ఎదుర్కొంటున్నారు. అలాగే బండి సంజయ్ తీరుతో ఆయన త్రిబుల్ ఆర్ గా అభివర్ణించిన ఈటల రాజేందర్, రఘునందనరావు, రాజాసింగ్ లే అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాల నుంచే సమాచారం అందుతోంది.
ఇక రాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ లో అసమ్మతి మరింత అధికంగా ఉంది. స్వయంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అయినా కాంగ్రెస్ లో అసమ్మతి, అసంతృప్తి, తిరుగుబాట్ల బెడద లేకపోతే ఆశ్చర్యపోవాలి కానీ ఉన్నందుకు కాదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/disidents-in-all-parties-25-135329.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.