టెక్స్ టైల్ పార్క్ మూత.. కేంద్రం, రాష్ట్రాలదే బాధ్యత!

Publish Date:May 2, 2022

Advertisement

తెలంగాణ రాష్ట్రంలో  నేతన్నలకు మహర్దశ అంటూ ఊదరగొట్టిన టీఆర్ఎస్ సర్కార్.. అదే సిరిసిల్లలోని టెక్స్ టైల్ పార్క్ మూతపడి 2వేల  మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడితే కేంద్రం పన్నే కారణమంటూ సణుగుతోంది తప్ప.. వాస్తవంలోనికి వచ్చి టెక్స్ పార్క్ యాజమాన్యాల సమస్యల పరిష్కారంపై నోరు మెదపడం లేదు.

ప్రపంచ కార్మికుల దినోత్సవం అయిన మేడే నాడే నేత కార్మికుల ఉపాధికి గండి పడింది. సరిగ్గా మే 1వ తారీకునే..అంటే ఆదివారం నాడే సిరిసిట్ల జిల్లా బద్దెనపల్లిలోని టెక్స్ టైల్ పార్కుకు యాజమాన్యాలు తాళం వేశాయి. పరిశ్రమను నడపడం మా వల్ల కాదంటూ చేతులెత్తేశాయి. దీంతో ఆ పార్క్ లో పని చేసే దాదాపు రెండు వేల మంది నేత కార్మికుల బతుకులు అగమ్యగోచరంగా మారిపోయాయి. 
 టెక్స్ టైల్ పార్క్ మూతకు విద్యుత్ రీయింబర్స్ మెంట్ బకాయిలు సకాలంలో రాకపోవడమే ప్రధాన కారణంగా యాజమాన్యాలు చెబుతున్నాయి.

ఏడు కోట్లు వెచ్చించి 75 ఎకరాల్లోఎకరాల్లో  2004లో  టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేశారు.   టెక్స్‌టైల్‌పార్క్‌లో పరిశ్రమలను నెలకొల్పితే సబ్సిడీలు, విద్యుత్తు రాయితీలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రభుత్వం  హామీ ఇవ్వడంతో పలువురు పారిశ్రామికులు ముందుకొచ్చి టెక్స్‌టైల్‌పార్క్‌లో పరిశ్రమలు స్థాపించారు.  165 ఇండస్ట్రీయల్ యూనిట్లు, 27 కమర్షియల్‌ యూనిట్లు  ఏర్పాటయ్యాయి. వీటిలో 115 యూనిట్లలో 1,475 ఆధునిక రాపియర్‌ మరమగ్గాలను ఏర్పాటు చేశారు.

అయితే వాగ్దానం చేసినట్లుగా ప్రభుత్వం నుంచి ఆర్డర్లు రాకపోవడం, అలాగే ప్రైవేటు ఆర్డర్లూ లేకపోవడంతో యాజమాన్యాలకు పరిశ్రమల నిర్వహణ భారంగా మారింది. కరోనా విజృంభించిన సమయంలో మార్కెట్లు పూర్తిగా స్తంభించిపోవడం, దానికి తోడు నూలు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పరిశ్రమలు నష్టాల బాట పట్టాయి. అలాగే పరిశ్రమను ఏదో మేరకు ఆదుకుంటూ వస్తున్న బతుకమ్మ ఆర్డర్లు కూడా ఈ ఏడు భారీగా తగ్గిపోవడం పరిశ్రమల నిర్వహణను కష్టసాధ్యంగా మార్చింది.

అన్నిటికీ మించి ప్రభుత్వ హామీ మేరకు మౌలిక సదుపాయాలు, విద్యుత్ రాయితీలూ కూడా అందకపోవడం పార్క్ లో పరిశ్రమల మనుగడను భారంగా మార్చేశాయి.  2015 నుంచి పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను విడుదల చేస్తామన్న మంత్రి కేటీఆర్ హామీ కూడా నెరవేరలేదు.  ఈ పరిస్థితుల్లో పరిశ్రమల నిర్వహణ తమ వల్ల కాదంటూ, ప్రభుత్వ హామీలను నెరవేర్చి విద్యుత్ రీయింబర్స్ మంట్ బకాయిలు చెల్లించడమే కాకుండా.. ప్రభుత్వ హామీ మేరకు ఆర్డర్లు కూడా వచ్చేలా చేయాలని పరిశ్రమల యాజమాన్యాలు కోరుతున్నాయి. 

వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా చేనేతలను ఆదుకునే విషయంలో మేం చాంపియన్లం అంటే మేం చాంపియన్లమన తెలంగాణలో ఉన్న తెరాస, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయ విమర్శలలో మునిగి తేలుతున్నాయి. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం కేటాయించని స్థాయిలో తమ సర్కార్ చేనేతకు బడ్జెట్ కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు సత్యనారాయణ, అది ఆయన అజ్ణాజానికి పరాకాష్ట, అసలు చేనేతపై పన్ను వేసిన తొలి సర్కార్ మోడీదే అంటూ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పరస్పర విమర్శల పర్వానికి తెర లేపారు. వాస్తవానికి నేతల సంక్షేమంపై, చేనేత పరిశ్రమ అభివృద్ధిపై ప్రభుత్వాల చిత్తశుద్ధి లేమికి సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ మూతపడటం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

By
en-us Political News

  
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.
సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
తెలంగాణ షాబాద్ లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ కు, సొంత బాబాయిపై గొడ్డలి వేటు, సొంత తల్లీ, చెల్లిని గెంటేసిన జగన్ కూ మనస్తత్వ పరంగా పోలీకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
ముందస్తు ఎన్నికల ప్రచారాలపైనా సీఎం స్పష్టత ఇచ్చారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకున్నారని తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.
నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు.
మొత్తం మీద రేవంత్ సభలో జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణలో కేటీఆర్ సభలోనూ జగన్ ఫ్లెక్సీలు వెలిసన సంగతి తెలిసిందే. సొంత రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టడంలో స్తబ్దుగా ఉంటున్న వైసీపీ శ్రేణులు తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల సభలలో తమ అధినేత ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది.
మాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసిపి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి.. తనను తాను రావణుడినని చెప్పుకున్న వ్యక్తిని వత్తాసుగా వైసీపీ నిలవడం కోరి ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.