వైసీపీలో రగులుతున్న ఆత్మీయ సమ్మేళనాల చిచ్చు!

Publish Date:Jul 23, 2023

Advertisement

ఏపీలో అధికార  వైసీపీ పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతున్నది. పార్టీలో నేతల మధ్య కుమ్ములాటలు తీర్చేందుకు అధిష్టానం పడరాని పాట్లు పడుతున్నది. అయినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు.  నేతల మధ్య చిచ్చు తీర్చే క్రమంలో అధిష్టానం పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లుగా తయారౌతున్నది. అధిష్టానం గీసిన గీతలను ఎప్పుడో దాటేసిన వైసీపీ నేతలు,  సొంత పార్టీ నేతలనే ప్రత్యర్ధులుగా భావించి వారిని దెబ్బతీసే కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నారు. ఫలితంగా..    పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారౌతున్నది.  రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల మధ్య అంతర్గత యుద్ధం తారస్థాయికి చేరింది. 

కొన్ని కొన్ని నియోజకవర్గాలలో వైసీపీ పార్టీలో కుమ్ములాటలు రచ్చకెక్కుతున్నాయి.  ఇలా పార్టీలో విభేదాలు రచ్చకెక్కిన నియోజకవర్గాలలో మాజీ మంత్రులు, సీనియర్ నేతల నియోజకవర్గాలు  కూడా ఉండడం విశేషం. అటు చిత్తూరులో రోజా, ఇటు గుంటూరులో అంబటి రాంబాబు, విడదల రజనీ,   విశాఖలో అవంతి,  తూర్పు గోదావరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇలా బడా బడా నేతల జిల్లాలు, స్థానాలలో  అంతర్గత యుద్ధం నడుస్తున్నది. అది కూడా ఈ బడా నేతల వల్లనే  పోరు జరగడం ఇప్పుడు అధిష్టానం సైతం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సీనియర్ నేతలకు అదే జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు అదే నియోజకవర్గంలోని సీనియర్ నేతలతో పొసగడం లేదు. అందుకే ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ కార్యకర్తలను విడదీసి కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు.

   రామచంద్రపురం నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ మంత్రి చెల్లుబోయిన వేణు.. మాజీ మంత్రి, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ వర్గాల మధ్య ఆధిపత్యపోరు పీక్స్‌కి చేరింది. ప్రస్తుతం బోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ మంత్రి వేణుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం మంత్రి వేణుకే టిక్కెట్ ఖరారు చేస్తే.. తాను ఇండిపెండెంట్‌గా  లేదా టీడీపీ తరఫున బరిలో దిగి వేణును ఓడిస్థానని ప్రజలకు చెప్తున్నారు. తాజాగా, పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఇదే విషయాన్ని మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మళ్లీ టికెట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని స్పష్టం చేశారు. ఈ తండ్రీ కొడుకులలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వకుంటే వారు పార్టీ వీడడం ఖాయంగా కనిపిస్తున్నది. 

కాగా, ఆదివారం (జూలై 23) మంత్రి వేణు వర్గం ఆత్మీయ సమావేశం నిర్వహించింది. చోడవరంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి వేణు వర్గం నియోజకవర్గంలోని అన్నిగ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనాలను తరలించి తన సత్తా చాటుకున్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ బాధ్యతలు స్వీకరించి 3 ఏళ్లయిన సందర్భంగానే ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినట్లు మంత్రి వర్గం చెప్పుకుంది. మంత్రిగా మూడేళ్ళ వేడుక అనే చెప్తున్నా ఇది ముమ్మాటికీ వేణుగోపాల్ తన ఆధిపత్యాన్ని చాటుకుని బలం నిరూపించుకోవడానికి నిర్వహించిన సమావేశమే వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.  ఇలా రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుండగా.. ఇక ఒక్కొక్కటీ ఆత్మీయ సమ్మేళనాల రూపంలో బయటపడే ఛాన్స్ కనిపిస్తున్నది.

By
en-us Political News

  
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.