రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పరువు హుష్ కాకీ

Publish Date:Dec 13, 2013

Advertisement

 

రాష్ట్ర శాసనసభలో తెలంగాణా బిల్లుని వీలయినంత త్వరగా, వీలయినంత తక్కువ వ్యతిరేఖతతో ఆమోదింపజేసుకొనే ఏకైక లక్ష్యంతో హైదరాబాద్ లో దిగిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ కు, అందుకు అవసరమయిన ఎటువంటి చర్యలయినా తీసుకొనేందుకు సర్వాధికారాలు సోనియాగాంధీ కట్టబెట్టి పంపే ఉంటారు.

 

తన రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్నివిభజిస్తున్నకాంగ్రెస్ అధిష్టానం, అందుకోసం రాష్ట్రంలో తన స్వంత పార్టీనే పణంగా పెట్టడం ఆశ్చర్యమనుకొంటే, ఇప్పుడు దిగ్విజయ్ సింగ్, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను ప్రాంతాలు, కులాల వారిగా విడదీసి పని చక్కబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన ముందుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని దారికి తెచ్చుకొనే ప్రయత్నం చేసారు. కానీ అది సఫలం కాకపోవడంతో అధిష్టానానికి విదేయులయిన వారి ద్వారా మిగిలిన వారిపై ఒత్తిళ్ళు తెస్తున్నట్లు సమాచారం.

 

సీమాంధ్ర కాంగ్రెస్ శాసనసభ్యులను నయాన్నోభయాన్నో లొంగ దీసుకొని దారికి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పదవులపై ఆశలున్నవారికి పదవులు, వాటికి లొంగని వారికి క్రమశిక్షణ చర్యల బెదిరింపులు ఉండనే ఉన్నాయి. రాయల సీమకు చెందిన కాంగ్రెస్ సభ్యులను దారికి తెచ్చుకొనగలిగితే, అధిష్టానం విధేయుల ద్వారా మిగిలిన వారిలో చాలా మందిని తనవైపు తిప్పుకోవచ్చని ఆయన వ్యూహం.

 

ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో సీమాంధ్ర నుండి కాంగ్రెస్-97, టీడీపీ-45 మరియు వైసీపీ-17 కలిపి మొత్తం 159 మంది సభ్యులు ఉండగా, తెలంగాణా నుండి కాంగ్రెస్- 49, టీడీపీ-34, టీఆర్ఎస్-17, బీజేపీ-03, సీపీఐ- 04, సీపీఎం-01, మజ్లిస్-07, ఇతరులు-04 కలిపి మొత్తం 119 మంది మాత్రమే ఉన్నారు.

 

శాసనసభలో బిల్లుపై ఓటింగ్ జరగకపోయినప్పటికీ, మెజార్టీ సభ్యులు బిల్లుని వ్యతిరేఖించినట్లయితే, బిల్లుపై రాష్ట్రపతి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంది గనుక, కనీసం సభలో సగం మంది కంటే ఎక్కువ మంది బిల్లుకి అనూలంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం అవసరమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకు కనీసం మరో 50 మంది సభ్యుల మద్దతు అవసరమయినా ఉంటుంది గనుక, ముందుగా రాయలసీమ కాంగ్రెస్ సభ్యులని నయాన్నో భయాన్నో లొంగదీసుకొనే ప్రయత్నం చేయవచ్చును.

 

అయితే ఇంత కాలంగా శాసనసభకి బిల్లు వస్తే దానికి వ్యతిరేఖంగా ఓటువేస్తామని, ఓడిస్తామని ప్రజల ముందు ప్రగల్భాలు పలికిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆఖరినిమిషంలో దిగ్విజయ్ సింగ్ ఒత్తిళ్లకు లొంగి బిల్లుకి అనుకూలంగా ఓటు వేయకపోవచ్చును. ఒకవేళ అనుకూలంగా మాట్లాడదలచుకొన్నపటికీ, తమ తమ ప్రాంతాలకు చెందిన ప్రతిపక్ష పార్టీ సభ్యులు బిల్లును వ్యతిరేఖిస్తుంటే, తాము అనుకూలంగా మాట్లాడితే అది రాజకీయంగా ఆత్మహత్యతో సమానమే గనుక, చాలా మంది సభ్యులు బిల్లుని వ్యతిరేఖించవచ్చును.

 

నాలుగు రాష్ట్రాలలో ఓటమితో క్రుంగి పోతున్నకాంగ్రెస్ అధిష్టానం, తమ స్వంత పార్టీ యంపీలే అవిశ్వాస నోటీసులు ఈయడంతో సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితి. ఇప్పుడు సాక్షాత్ సోనియా దూతగా రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్ సింగ్ మాట కూడా నెగ్గకపోతే, ఇక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పరువు పూర్తిగా గంగలో కలిసిపోవడం ఖాయం.

 

అయితే బిల్లుకి సహకరించదలచకున్నవిదేయులయిన కాంగ్రెస్ నేతలు, బిల్లుకి వ్యతిరేఖంగా తమ వాదనలు వినిపించి, దానిపై అభిప్రాయాలు వ్యక్తం చేయవలసిన సమయంలో సభకు మొహం చాటేసి పరోక్షంగా సహకరించవచ్చును. కానీ, బిల్లుని ఏవిధంగానయినా అడ్డుకోవాలనే పట్టుదలతో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఆయన అనుచరులు కూడా అటువంటి వారిని, మీడియా ద్వారా సీమాంధ్ర ద్రోహులనే ముద్ర వేస్తూ తమ దారికి తెచ్చుకొనే ప్రయత్నించవచ్చును.

 

ఇక ఈ బిల్లుని ఎంత త్వరగా ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలా అని తెలంగాణా సభ్యులు ప్రయత్నిస్తే, వీలయినంత జాప్యం చేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి వర్గీయులు గట్టిగా కృషి చేయడం ఖాయం. అందువల్ల రాష్ట్ర విభజన ప్రక్రియతో మొదలయిన ఈ సస్పెన్స్ పార్లమెంటులో ఆమోదం పొందేవరకు కూడా తప్పదు. ఇది ప్రజాభీష్టం మేరకు సాంకేతికంగా జరుగుతున్న ఒక రాజ్యంగా ప్రక్రియలా కాకుండా అనేక పార్టీల, నేతల స్వార్ధ రాజకీయ లబ్ది కోసం జరుగుతున్న పోరాటంలా మారడమే చాలా విషాదకరం.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.