జగన్ పార్టీ నేతల కుమ్ములాటలు
Publish Date:Sep 12, 2012
Advertisement
అధికారం అంతా అధిష్టానం చేతిలోనే ఉన్నా లోకల్గా తానే గొప్పంటూ నిరూపించుకోవాలన్న తపన కాంగ్రెస్ లోనే ఎక్కువగా వుంటుందన్నది నిజం ! ప్రాంతీయ పార్టీల హవా మొదలయిన తర్వాత ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు అధికారాన్ని కైవసం చేసుకోవడంతో దేశం లోనూ ఆధిపత్య పోరు మొదలైంది. అదిప్పుడు నారా, నందమూరి వంశాల మధ్య నివురుగప్పిన నిప్పులా కొనసాగుతోంది. ఇదిలా వుంటే` రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత అవిర్భవించిన వైఎస్ఆర్సిపి పేద ప్రజల కోసం ఆవిర్భవించిన పార్టీగా చెప్పుకుంటున్నప్పటికీ, జగన్ తన సంక్షేమం కోసమే పార్టీ పెట్టారన్నది విమర్శకుల మాట! అక్రమాస్తుల కేసులో జగన్ చంచల్గూడా జైలుకు వెళ్ళడంతో పార్టీ పగ్గాల కోసం షర్మిల పోటీపడుతున్నారని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఆ నేపధ్యంలోనే షర్మిల ఉప ఎన్నికలయ్యిం తర్వాత ఉన్నట్టుండి బెంగళూరు వెళ్ళిపోయారంటారు. అసలు నేత జగన్ జైలుకెళ్లడం ఎన్నికల ప్రచారంలో ఫ్యానుగాలి హోరు బలంగా వినిపించిన షర్మిల బెంగళూరుకు వెళ్ళిపోవడం నేపథ్యంలో లోకల్గా తామే హీరోలం కావాలని ఆ పార్టీకి చెందిన చాలా మందే ప్రయత్నాలు చేసేసుకుంటున్నారు. అందుకు మొన్న ఇబ్రహీంపట్నం, మాల్కాజ్గిరి, నిన్న జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వైఎస్ఆర్సిపి కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలే సాక్షి! తూర్పు పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల్లో కూడా పార్టీలో పట్టుకోసం లోకల్ నేతల మధ్య కోల్డ్వార్ జరుగుతోందని తెలుస్తోంది. ఇవన్నీ`2014 ఎన్నికల్లో అసెంబ్లీ సీట్ల కోసం ఇప్పట్నుంచే జరుగుతున్న ప్రయత్నాలేనంటూ ప్రజలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/differences-in-ysrcp-24-17319.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





